ఐపీసీ స్థానంలో బీఎన్ఎస్!
నేరాల నియంత్రణ, వేగవంతంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)- 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) 2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు(ఐఈఏ) బదులుగా భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్ఏ) అమల్లోకి తెచ్చింది.
నూతన న్యాయ చట్టాల అమలుకు సిద్ధం
కమిషనరేట్లో సిబ్బందికి శిక్షణ పూర్తి
న్యూస్టుడే, వరంగల్క్రైం : నేరాల నియంత్రణ, వేగవంతంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)- 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) 2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు(ఐఈఏ) బదులుగా భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్ఏ) అమల్లోకి తెచ్చింది. నేటి నుంచి ఠాణాల్లో బీఎన్ఎస్ సెక్షన్ల ద్వారా కేసులను నమోదు చేయాలి. బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత అధికారి పరిశీలించి ఏ సెక్షన్ వర్తిస్తుందో తెలుసుకొని కేసులను నమోదు చేసి విచారణ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి నెల పాటు కొత్త చట్టాలపై నిపుణులు శిక్షణ ఇచ్చారు. సుమారు 2 వేల మంది వరకు సిబ్బంది తరగతులకు హాజరయ్యారు. కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసేందుకు ఠాణాల్లో అధికారులు, రైటర్లు సిద్ధమవుతున్నారు. ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా బీఎన్ఎస్లో 358కి కుదించారు. కొత్త చట్టంలో పోలీసులకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. దీంతో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.
మహిళలు, పిల్లలపై నేరాల్లో..
సమాజంలో మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను నియంత్రించేందుకు కొత్త చట్టంలో అనేక చర్యలు చేపట్టారు. గతంలో ఉన్న వాటికంటే శిక్షలు, కాల పరిమితిని పెంచారు. బాధిత మహిళలు, పిల్లలకు సత్వర న్యాయం జరిగేలా కొత్త చట్టంలో అంశాలను పొందుపర్చారు. రెండు నెలల్లో దర్యాప్తు పూర్తిచేయాలి. బాధిత మహిళలు, పిల్లలకు ఉచిత ప్రాథమిక వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీనిస్తున్నాయి. అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.
ఠాణాకు వెళ్లకుండానే ఫిర్యాదు చేయవచ్చు..
బాధితుడు ఠాణాలకు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఘటనకు సంబంధించిన అంశాలను ఫిర్యాదు చేయవచ్చు. దీంతో కేసు విచారణ వేగవంతంగా చేసేందుకు పోలీసులకు వెసులుబాటు ఉంటుంది. జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా, ఠాణా పరిధిలో సంబంధం లేకుండా ఎక్కడి ఠాణాలోనైనా ఫిర్యాదు చేయవచ్చు. కేసు నమోదైన తర్వాత బాధితుడితో పాటుగా నిందితుడు కూడా ఎఫ్ఐఆర్ కాపీని ఉచితంగా పొందే అవకాశం ఉంది.
సాంకేతికత తోడుగా..
గతంలో కేసుల దర్యాప్తు మందకొడిగా జరిగేది. కొత్త నేర న్యాయ చట్టాల ద్వారా దర్యాప్తు వేగవంతం చేసేందుకు వెసులుబాటు ఉంది. జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్ ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమన్ల జారీ, తీవ్రమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు వేగంగా జరగనుంది.
ఫోరెన్సిక్ పరిశోధన తప్పనిసరి
తీవ్రమైన నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా వెళ్లాలి. అక్కడ లభించిన ఆధారాలు సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరిగా చేస్తారు. దీంతో దర్యాప్తు నాణ్యత, విశ్వసనీయత పెరుగుతుంది. నిందితులకు శిక్షలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కేసుల విచారణలో మార్పులు..
రాజమహేంద్రనాయక్, డీసీపీ, వెస్ట్జోన్ (జనగామ)
నూతన నేర న్యాయ చట్టాలు- 2023 ద్వారా కేసుల విచారణ వేగవంతం అవుతుంది. కేసుల విచారణలో మార్పులు వస్తాయి. ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో ఇది ఒక మైలురాయి. నేరం చేసిన వారికి శిక్షలు పడేందుకు ఎక్కువ అవకాశం ఉంది. దీంతో సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు అవకాశం ఉంది.
నిందితులకు శిక్షలు పడతాయి
సీ.విద్యాసాగర్రెడ్డి, సీనియర్ న్యాయవాది
బాధితులు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయాలి. విచారణ పారదర్శకంగా జరుగుతుంది. నూతన చట్టాల అమలుతో నిందితులకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. నేరం చేసిన వారు తప్పించుకునే అవకాశం లేదు. నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకునే గడువు పెంచారు. ప్రస్తుతం అరెస్టయిన తర్వాత 14 రోజుల్లోపే కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ గడువును 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సిన కేసుల్లో 40 రోజులకు, 90 రోజుల్లో దర్యాప్తు చేయాల్సిన కేసుల్లో 60 రోజుల వరకు పొడిగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక వాట్సప్లోనూ పిర్యాదు చేయొచ్చు
[ 03-07-2024]
ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగై వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) వచ్చాయి. -
ఆదిమానవుల ఆనవాళ్లివి.. సమాది చేయొద్దు!
[ 03-07-2024]
అవి ఆది మానవుల సమాధులు.. చూస్తే రాళ్లు పేర్చారేమో అనిపిస్తుంది... తరచి చూస్తే ఆశ్చర్యం.. ఎన్నో సందేహాలు కలుగుతాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దామెరవాయిలో ఉన్న వీటిని చూడడానికి పర్యాటకు లు ఆసక్తి చూపుతున్నారు.. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.. -
దర్జాగా మట్టి దందా..
[ 03-07-2024]
చెరువుల్లో మట్టి తవ్వకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి, మొరం దందా జోరుగా సాగిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. -
వసతిగృహం.. సమస్యలతో సతమతం
[ 03-07-2024]
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సమస్యలు తిష్ఠ వేయడంతో విద్యార్థులు వసతిగృహాల్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. -
‘కుడా’ తీరే వేరు!
[ 03-07-2024]
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) తీరే వేరు. అభివృద్ధి పనుల టెండర్లు కొంతమంది బడా గుత్తేదారులకు దక్కేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దానికి బలం చేకూర్చేలా టెండర్లు సకాలంలో తెరవడం లేదు. -
వసతి గృహాలు.. సమస్యల లోగిళ్లు..!
[ 03-07-2024]
సంక్షేమ వసతి గృహాల్లో అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. శిథిÅల భవనాలు, మూత్రశాలల కొరత, తలుపులు లేని మరుగుదొడ్లు, అస్తవ్యస్థ పరిసరాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో 20 ఫ్రీ, పోస్టు మెట్రిక్ వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన కల్పిస్తాం
[ 03-07-2024]
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించామని తెలిపారు. -
నాడు సక్రమం.. నేడు అక్రమం!
[ 03-07-2024]
హనుమకొండ నగరంలో బాలసముద్రంలోని భారాస జిల్లా కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వరంగల్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. -
నూతన నేర చట్టాలతో సత్వర న్యాయం
[ 03-07-2024]
దేశంలో అమల్లోకి వచ్చిన నూతన నేర చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) కిరణ్ ఖరే అన్నారు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాలపై మంగళవారం ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. -
పురకు పట్టని కార్మికుల సంక్షేమం
[ 03-07-2024]
పౌర, కార్యాలయ సేవలను ప్రజలకు అందించే నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే పురపాలిక అధికారులు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తున్నారు. తద్వారా చట్ట ఉల్లంఘన ఒక అంశం కాగా, నిర్లక్ష్యం కారణంగా పుర పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. -
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ
[ 03-07-2024]
పట్టణంలోని సిద్దిపేట రోడ్డు వైపు బ్రిడ్జి కింద ఉన్న బీరప్పగడ్డ ప్రాంతంలోని ఓ నివాసంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో అగంతకులు చొరబడి బంగారు, వెండి నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!