బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం..
సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ, కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు.
మాట్లాడుతున్న సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టయ్య
భూపాలపల్లి, న్యూస్టుడే : సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ, కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5వ గని ఆవరణలో ద్వార సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గట్టయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా 60 బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారని, ఇందులో సింగరేణిలో ఒక బొగ్గు బ్లాక్ ఉందని, ఈ బ్లాక్ వేలాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ హమ్మద్ మాట్లాడుతూ.. సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు పూర్తిగా విఫలమయ్యాయని, గతంలో భారాస నాయకులు చేసిన పాపాలకు వ్యతిరేకంగా నేడు విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న సింగరేణి కార్మిక ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆరేళ్ల క్రితమే మాజీ సీఎం కేసీఆర్ తాడిచర్ల బ్లాక్ను ప్రైవేటీకరణ చేసి, ఇప్పుడు మోసపూరితమైన మాటలతో కార్మికవర్గాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తాడిచర్ల బ్లాక్-2లో సింగరేణి సంస్థ ద్వారా బొగ్గు తవ్వకాలు చేపట్టడం సాధ్యం కాదని ఓ తప్పుడు నివేదిక సృష్టించి, ప్రైవేటీకరణకు భారాస ప్రభుత్వం సహకరించిందని విమర్శించారు. సమావేశంలో ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ నాయకులు పోషమల్లయ్య, నారాయణ, నీరటి రాజన్న, శంకరయ్య, వెంకన్న పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్ఫూర్తి చాటుదాం.. కొలువు కొట్టేద్దాం!
[ 01-07-2024]
నిరాశ, నిస్పృహలు దరిచేరకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం.. అవకాశాలను అందిపుచ్చుకోవడం.. ఒత్తిడిని అధిగమించడం.. ప్రణాళిక అమలుపర్చడం.. -
ఖాళీ ప్లాట్లు.. స్థానికులకు పాట్లు
[ 01-07-2024]
నగరంలో ఖాళీగా ఉన్న ప్లాట్లతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు నిలిచి పాములు, తేళ్లు, దోమలకు ఆవాసాలుగా మారడంతో కాలనీవాసులకు అవస్థలు తప్పడం లేదు. తలుపులు, కిటికీలు నిత్యం మూసేయాల్సి వస్తోందని వాపోతున్నారు. -
బాహ్యవలయ రహదారి నిర్మాణానికి కసరత్తు
[ 01-07-2024]
జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. పట్టణంలో ద్విచక్రవాహనాలతో పాటు ఇతర వాహనాలు కలిపి సుమారు 30 వేల వరకు ఉంటాయని అంచనా. -
వ్యాధుల కాలం.. అప్రమత్తతే కీలకం
[ 01-07-2024]
వర్షాలు అడపాదడపా కురుస్తున్నాయి. పల్లెలు, పట్టణాల్లో అపరిశుభ్రం నెలకొంటోంది. గుంతలు, మురుగు కాల్వలు, ఖాళీ స్థలాల్లో నిలిచే నీరు మశకాలకు ఆవాసంగా మారుతున్నాయి. -
బకాయిల ఊబిలో సింగరేణి
[ 01-07-2024]
భూపాలపల్లి సింగరేణి డివిజన్లో కార్మికుల, అధికారుల క్వార్టర్లు, భవనాలను అద్దెకు తీసుకున్న ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు కొందరు నెలవారీగా అద్దె చెల్లించటం లేదు. సకాలంలో సింగరేణికి అద్దె చెల్లించకపోవడంతో విద్యుత్తు బిల్లులు, తాగునీరు. -
పలిమెల మండలం పేరుకేనా?
[ 01-07-2024]
జిల్లాలోనే మారుమూల ప్రాంతం పలిమెల మండలం. ఆ ప్రాంత అభివృద్ధికి, ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ఎనిమిదేళ్ల కిందట నూతన మండలంగా ఏర్పాటుచేశారు. -
వేప చెట్లతో చిట్టడవిని సృష్టించాడు
[ 01-07-2024]
ఈ చిత్రంలో వేప వనంలో కనిపిస్తున్న రైతు పేరు సుంకరి శ్రీనివాస్రెడ్డి. జనగామ మండలం సిద్దెంకి గ్రామం. పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. 2013లో తనకున్న 10 ఎకరాల్లో ఐదు వేల వేప మొక్కలను నాటారు. -
నిర్మాణం పూర్తయినా.. నిరుపయోగం
[ 01-07-2024]
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య పరిరక్షణ, యోగా సాధన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోజు రోజుకు పెరుగుతున్న యోగా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో ఆయుష్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాధన చేయడానికి ఆరోగ్య స్వస్థత కేంద్రాలను(హెల్త్ వెల్నెస్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నారు. -
విద్యార్థులకు ఉపకారం.. విజ్ఞాన్ మంథన్
[ 01-07-2024]
నిత్యం నాలుగు గోడల మధ్య పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థుల దృష్టిని పరిశోధన, ప్రయోగ రంగాల వైపు మరల్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. -
కాంగ్రెస్లో అసమ్మతి గళం!
[ 01-07-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య కలహాలు పెరిగాయి. ఉమ్మడి జిల్లాలోని కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య మాటామంతి ఉండటం లేదు. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. -
వైద్య వృత్తి.. సేవా కీర్తి
[ 01-07-2024]
పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థం ఏటా జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో ఉండేవారు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు. -
వేధింపులు భరించలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
[ 01-07-2024]
ఓ వ్యక్తి వేధింపులు దంపతుల మధ్య చిచ్చుపెట్టాయి.. తమ ఇంటికే వచ్చి భార్యను వేధిస్తున్న వ్యక్తిని చూసి భర్త తట్టుకోలేకపోయాడు.. అవమానంగా భావించిన ఆ జంట మనోవేదనతో ఆత్మహత్యాయత్నం చేయడంతో భార్య మృతి చెందగా, భర్త చికిత్స పొందుతున్నాడు. -
ఐపీసీ స్థానంలో బీఎన్ఎస్!
[ 01-07-2024]
నేరాల నియంత్రణ, వేగవంతంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)- 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) 2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు(ఐఈఏ) బదులుగా భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్ఏ) అమల్లోకి తెచ్చింది.