వ్యాపారుల మాయాజాలం
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనామ్ విధానాన్ని అమలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం అందుకుంది. అలాంటిది కొంత మంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్ బయట ఖరీదులు నిర్వహిస్తున్నారు.
కేసముద్రం మార్కెట్లో నిబంధనలకు విరుద్ధంగా ఖరీదు
కేసముద్రం, న్యూస్టుడే
కేసముద్రం వ్యవసాయ మార్కెట్
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనామ్ విధానాన్ని అమలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం అందుకుంది. అలాంటిది కొంత మంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్ బయట ఖరీదులు నిర్వహిస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని తరుగు, తేమ పేరుతో నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
చేయాల్సింది ఇలా..
సరకు విక్రయించేందుకు వచ్చిన రైతులకు మార్కెట్ కమిటీ అండగా నిలిచి గిట్టుబాటు ధర కల్పించాలి. తూకంలో మోసం లేకుండా జాగ్రత్తలు తీసుకొని విక్రయ సొమ్ము సకాలంలో చెల్లించేలా చూడాలి. దీనికోసం మార్కెట్ యార్డులో అధికారులతోపాటు తూకం వేయడానికి దడువాయిలు, కార్మికులు, సూపర్వైజర్లు ఉంటారు. సరకుల విక్రయం తర్వాత రైతు మార్కెట్ కార్యాలయంలో తక్పట్టీ తీసుకొని వ్యాపారి వద్దకు వెళ్తారు. ఇలా మార్కెట్ యార్డులో సరకులు అమ్ముకోవడం వల్ల రైతుకు ఎక్కడ మోసం జరిగినా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
జరుగుతుంది ఇలా..
కొంతమంది వ్యాపారులు మార్కెట్ బయట ప్రధాన రహదారుల వెంట తమ గుమస్తాలను తేమ పరీక్షించే యంత్రాలు చేత పట్టుకొని నిలబెడుతున్నారు. సరకుతో వస్తున్న వాహనాలను అడ్డుకొని ఎక్కువ ధర చెల్లిస్తామని ఆశ చూపి తమ మిల్లు, ట్రేడింగ్ సంస్థ వద్దకు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత తేమ, నాప గింజల పేరిట తక్కువ ధర చెల్లిస్తున్నారు. దీనికి తోడు ప్రతి ట్రాక్టరుకు 30 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. మార్కెట్ నిబంధనల మేరకు ఖరీదు చేసిన సరకు విక్రయ సొమ్ము అదేరోజు చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు 15 రోజుల వాయిదా పెడుతున్నారు. వెంటనే నగదు చెల్లించాలని కోరితే సొమ్ములో ఒక శాతం కోత విధిస్తున్నారు. వాయిదాలో ఖరీదు చేసిన వ్యాపారి బోర్డు తిప్పితే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. వేబ్రిడ్జిపై తూకం వేస్తున్నప్పటికీ కార్మికుల ఖర్చు పేరిట బస్తాకు రూ.20 కోత పెడుతున్నారు. ఆ డబ్బులు కార్మికులకు ఇవ్వకుండా వ్యాపారులే కాజేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతు, కార్మిక నాయకులు కోరుతున్నారు.
మార్కెట్ బయట వేబ్రిడ్జిపై తూకమేస్తున్న రైతు
తరుగు పేరిట దోచుకుంటున్నారు
- గంట రామ్మోహన్రెడ్డి, కల్వల, రైతు
మార్కెట్ యార్డు సరకులతో నిండిపోవడంతో బయట వ్యాపారులకు విక్రయించాను. ట్రాక్టరుకు 30 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. నగదు డబ్బులు ఇవ్వమంటే ఒక శాతం కోత పెడుతున్నారు. లేదంటే 15 రోజులు వాయిదా పెడుతున్నారు. దీంతో మార్కెట్లో 25 శాతం రైతులు మాత్రమే విక్రయిస్తున్నారు. 75శాతం రైతులు మార్కెట్ బయట విక్రయిస్తున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
- మల్లేశం, సంయుక్త సంచాలకుడు, మార్కెటింగ్ శాఖ
క్షేత్రస్థాయిలో సందర్శించి మార్కెట్ అధికారులతో సమావేశం నిర్వహించి మార్కెట్ ఫీజు చెల్లింపులపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం. రైతులు మార్కెట్ యార్డులోనే అమ్ముకోవాలి. నిబంధనల ప్రకారం ఏరోజు ఖరీదు చేసిన సరకులకు అదే రోజు చెక్ ఇవ్వాల్సి ఉంటుంది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్ఫూర్తి చాటుదాం.. కొలువు కొట్టేద్దాం!
[ 01-07-2024]
నిరాశ, నిస్పృహలు దరిచేరకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం.. అవకాశాలను అందిపుచ్చుకోవడం.. ఒత్తిడిని అధిగమించడం.. ప్రణాళిక అమలుపర్చడం.. -
ఖాళీ ప్లాట్లు.. స్థానికులకు పాట్లు
[ 01-07-2024]
నగరంలో ఖాళీగా ఉన్న ప్లాట్లతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు నిలిచి పాములు, తేళ్లు, దోమలకు ఆవాసాలుగా మారడంతో కాలనీవాసులకు అవస్థలు తప్పడం లేదు. తలుపులు, కిటికీలు నిత్యం మూసేయాల్సి వస్తోందని వాపోతున్నారు. -
బాహ్యవలయ రహదారి నిర్మాణానికి కసరత్తు
[ 01-07-2024]
జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. పట్టణంలో ద్విచక్రవాహనాలతో పాటు ఇతర వాహనాలు కలిపి సుమారు 30 వేల వరకు ఉంటాయని అంచనా. -
వ్యాధుల కాలం.. అప్రమత్తతే కీలకం
[ 01-07-2024]
వర్షాలు అడపాదడపా కురుస్తున్నాయి. పల్లెలు, పట్టణాల్లో అపరిశుభ్రం నెలకొంటోంది. గుంతలు, మురుగు కాల్వలు, ఖాళీ స్థలాల్లో నిలిచే నీరు మశకాలకు ఆవాసంగా మారుతున్నాయి. -
బకాయిల ఊబిలో సింగరేణి
[ 01-07-2024]
భూపాలపల్లి సింగరేణి డివిజన్లో కార్మికుల, అధికారుల క్వార్టర్లు, భవనాలను అద్దెకు తీసుకున్న ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు కొందరు నెలవారీగా అద్దె చెల్లించటం లేదు. సకాలంలో సింగరేణికి అద్దె చెల్లించకపోవడంతో విద్యుత్తు బిల్లులు, తాగునీరు. -
పలిమెల మండలం పేరుకేనా?
[ 01-07-2024]
జిల్లాలోనే మారుమూల ప్రాంతం పలిమెల మండలం. ఆ ప్రాంత అభివృద్ధికి, ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ఎనిమిదేళ్ల కిందట నూతన మండలంగా ఏర్పాటుచేశారు. -
వేప చెట్లతో చిట్టడవిని సృష్టించాడు
[ 01-07-2024]
ఈ చిత్రంలో వేప వనంలో కనిపిస్తున్న రైతు పేరు సుంకరి శ్రీనివాస్రెడ్డి. జనగామ మండలం సిద్దెంకి గ్రామం. పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. 2013లో తనకున్న 10 ఎకరాల్లో ఐదు వేల వేప మొక్కలను నాటారు. -
నిర్మాణం పూర్తయినా.. నిరుపయోగం
[ 01-07-2024]
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య పరిరక్షణ, యోగా సాధన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోజు రోజుకు పెరుగుతున్న యోగా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో ఆయుష్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాధన చేయడానికి ఆరోగ్య స్వస్థత కేంద్రాలను(హెల్త్ వెల్నెస్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నారు. -
విద్యార్థులకు ఉపకారం.. విజ్ఞాన్ మంథన్
[ 01-07-2024]
నిత్యం నాలుగు గోడల మధ్య పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థుల దృష్టిని పరిశోధన, ప్రయోగ రంగాల వైపు మరల్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. -
కాంగ్రెస్లో అసమ్మతి గళం!
[ 01-07-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య కలహాలు పెరిగాయి. ఉమ్మడి జిల్లాలోని కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య మాటామంతి ఉండటం లేదు. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. -
వైద్య వృత్తి.. సేవా కీర్తి
[ 01-07-2024]
పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థం ఏటా జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో ఉండేవారు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు. -
వేధింపులు భరించలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
[ 01-07-2024]
ఓ వ్యక్తి వేధింపులు దంపతుల మధ్య చిచ్చుపెట్టాయి.. తమ ఇంటికే వచ్చి భార్యను వేధిస్తున్న వ్యక్తిని చూసి భర్త తట్టుకోలేకపోయాడు.. అవమానంగా భావించిన ఆ జంట మనోవేదనతో ఆత్మహత్యాయత్నం చేయడంతో భార్య మృతి చెందగా, భర్త చికిత్స పొందుతున్నాడు. -
ఐపీసీ స్థానంలో బీఎన్ఎస్!
[ 01-07-2024]
నేరాల నియంత్రణ, వేగవంతంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)- 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) 2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు(ఐఈఏ) బదులుగా భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్ఏ) అమల్లోకి తెచ్చింది.