ప్రజాభవన్ వైపు.. అర్జీదారుల చూపు
సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజానీకానికి భరోసా ఇవ్వడం లేదు. జిల్లా పరిధిలో ఇప్పటివరకు 654 అర్జీలు పరిష్కారానికి నోచుకోక.. పెండింగ్లో ఉన్నాయి.
అర్జీ స్వీకరించినట్లు.. చరవాణికి వచ్చిన సంక్షిప్త సందేశం
వరంగల్ కలెక్టరేట్, న్యూస్టుడే: సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజానీకానికి భరోసా ఇవ్వడం లేదు. జిల్లా పరిధిలో ఇప్పటివరకు 654 అర్జీలు పరిష్కారానికి నోచుకోక.. పెండింగ్లో ఉన్నాయి. చిన్నపాటి సమస్యల పరిష్కారంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో చాలామంది బాధితులు హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరుగుతున్న ప్రజావాణికి వెళుతున్నారు. దూరభారాన్ని లెక్క చేయకుండా.. రాజధానికి వెళ్లి అక్కడి అధికారులతో తమ గోడు చెప్పుకొంటున్నారు. చాలావరకు రెవెన్యూ, పింఛను, ధరణి తదితర సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందిస్తున్నారు. ప్రజాభవన్లో స్వీకరించిన దరఖాస్తులకు రసీదు ఇవ్వడంతోపాటు.. అర్జీ ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాల ద్వారా సమాచారం అందిస్తున్నారు. దీంతో ఎప్పటికైనా సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
తిరిగి ఇక్కడికే..
ప్రజా భవన్లో జిల్లాల వారీగా వచ్చిన అర్జీలను క్రోడీకరించి.. తొలుత ఆయాశాఖల వారీగా జిల్లా కలెక్టరేట్కు పంపించారు. కలెక్టరేట్లోని సిబ్బంది వాటిని పరిష్కారం కోసం ఆయా శాఖలకు బదలాయించేవారు. ప్రస్తుతం కలెక్టరేట్లకు రెవెన్యూ సమస్యలను మాత్రమే పంపిస్తూ.. ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు నేరుగా ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ద్వారా పంపిస్తున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత సమస్యలు ఏ దశలో ఉన్నాయో వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఏ అధికారులైతే.. తమ సమస్యలను పట్టించుకోలేదో.. ప్రజాభవన్ నుంచి వస్తే తప్పనిసరిగా పరిశీలిస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టిసారించడంతో.. అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాగా ఇప్పటివరకు జిల్లా నుంచి రెవెన్యూకు సంబంధించి మొత్తం 292 అర్జీలు రాగా.. అందులో 217 పరిశీలన దశలో ఉన్నాయి. మిగిలిన 75 అర్జీలు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజాభవన్కు వచ్చే అర్జీల్లో ప్రధానంగా ఉద్యోగాల కోసం, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు వంటి సమస్యలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
అభివృద్ధి పనులు మొదలుపెట్టారు..
వరంగల్ అండర్బ్రిడ్జి వద్ద 2008 నుంచి గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామని.. తమ సమస్యలు పరిష్కరించాలని ఎల్వీఆర్ కాలనీవాసులు ప్రజాభవన్ ప్రజావాణిలో విన్నవించుకున్నారు. 15 ఏళ్లుగా ఒకే మీటరుపై 220 కుటుంబాల వారు విద్యుత్తు వినియోగించుకుంటున్నామని, తద్వారా ప్రతినెలా రూ.లక్షల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తుందన్నారు. కాలనీలో ఇంటింటికీ మీటర్లు ఏర్పాటుచేసి, కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరారు. స్పందనగా.. సంబంధిత అధికారులు కాలనీలో పర్యటించి, అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు కాలనీవాసులు చెప్పారు.
పెండింగ్ అర్జీలపై దృష్టి సారిస్తాం..
- జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి
పెండింగ్ అర్జీల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ప్రతి ప్రజావాణి కార్యక్రమం నిర్వహణకు ముందు సమీక్ష నిర్వహిస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెండింగ్ అర్జీల సంఖ్య పెరిగింది. వాటి పరిష్కారం కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. ప్రజాభవన్ నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు పంపిస్తున్నాం. ఇకపై ప్రజాభవన్ నుంచి వచ్చే అర్జీలను సమీక్షించేందుకు నేరుగా సంబంధిత శాఖ అధికారులకే ప్రత్యేక లాగిన్ ఐడీలు కేటాయించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ మాట.. గుర్తు చేసుకుందాం!
[ 29-06-2024]
రాష్ట్రంలో రాజధాని తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంది. అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కీలక పరిశ్రమలు, అనేక అభివృద్ధి పనులు పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో వివిధ సందర్భాల్లో 12 నియోజకవర్గాల్లో పర్యటించారు. -
క్రీడాభివృద్ధికి ఓరుగల్లు అనుకూలం
[ 29-06-2024]
క్రీడాభివృద్ధికి నగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఓరుగల్లు స్వల్ప వ్యవధిలోనే గణనీయమైన ప్రగతి సాధిస్తూ స్పోర్ట్స్ సిటీగా మారుతుందని రాష్ట్ర క్రీడలు, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ పేర్కొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని ఎన్హెచ్ఎం సీనియర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ అన్నారు. ములుగులో డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య అధ్యక్షతన ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం..
[ 29-06-2024]
సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ, కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. -
తాగునీటి సీసా.. తప్పని ప్రయాస
[ 29-06-2024]
గుక్కెడు మంచినీళ్ల కోసం ఆ తండావాసులు ప్లాస్టిక్ సీసాలు పట్టుకొని పిల్లా పాపలతో బోరు వద్దకు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం తీగలతండా గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్యతండా వాసుల నీటి కష్టాలివి. -
ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ
[ 29-06-2024]
భారతదేశ మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణల పితామహుడని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భారతరత్న పీవీ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం అధికారిక ఉత్సవాలు నిర్వహించింది. -
వ్యాపారుల మాయాజాలం
[ 29-06-2024]
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనామ్ విధానాన్ని అమలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం అందుకుంది. అలాంటిది కొంత మంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్ బయట ఖరీదులు నిర్వహిస్తున్నారు. -
ప్రతి నెలా ‘ఆరుద్రోత్సవం’
[ 29-06-2024]
రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చారిత్రక, సాహిత్య నేపథ్యం ఎంతో ఉంది. -
ఆకట్టుకుంటున్న సోమనాథుని స్మృతివనం
[ 29-06-2024]
జనగామ జిల్లా పాలకుర్తి శివారులో ఏడాది క్రితం నిర్మితమైన ప్రాచీన యుగానికి చెందిన తెలుగు కవి పాల్కుర్కి సోమనాథుని స్మృతివనంలో భక్తులు, పర్యాటకులు పాల్గొని సందడి చేస్తున్నారు. -
బ్యాంకు లింకేజీలో ఆదర్శం గీసుకొండ
[ 29-06-2024]
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలను అందుకుని మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలిచిన గీసుకొండ మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. -
మట్టిలో పుట్టిన సీత శిశుగృహకు అప్పగింత
[ 29-06-2024]
‘మట్టిలో పుట్టిన సీత’ శిశువు గృహకు చేరింది. మే 4వ తేదీన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను మట్టిలో పాతిపెట్టగా, ఓ లారీ చోదకుడు గుర్తించి రక్షించిన విషయం తెలిసిందే. -
మొలకెత్తని విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన
[ 29-06-2024]
మొలకెత్తని విత్తనాలు విక్రయించారంటూ వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ దుకాణం ఎదుట రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. దుకాణదారులతో వాగ్వాదానికి దిగారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రానికి నీతీశ్ కుమార్ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం
-
‘ఎమర్జెన్సీ’ అంశం ఇప్పుడెందుకు?: శరద్ పవార్
-
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
-
జియో, ఎయిర్టెల్ బాటలోనే వీఐ.. టారిఫ్ల పెంపు
-
రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారింది: నాదెండ్ల మనోహర్
-
అనంత్ అంబానీ-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సామూహిక వివాహాలు