ఆమ్యామ్యాలు ఇచ్చుకో.. తొలి జీతం పుచ్చుకో!
రూ.8 లక్షల వరకు వసూలు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,100 మంది నర్సింగ్ ఆఫీసర్లు విధుల్లో చేరారు. వీరిలో దాదాపు 900 మందికి జీతాలు అందాయి. మిగిలిన వారికి త్వరలో రానున్నాయి. జీతం ఇవ్వడానికి ఇప్పటివరకు దాదాపు 400 మంది నుంచి సగటున రూ.2 వేల చొప్పున రూ.8 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.
నర్సింగ్ ఆఫీసర్ల నుంచి బలవంతపు వసూళ్లు
ఈనాడు, మహబూబాబాద్, న్యూస్టుడే, ఎంజీఎం ఆసుపత్రి, జనగామ టౌన్
రూ.8 లక్షల వరకు వసూలు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,100 మంది నర్సింగ్ ఆఫీసర్లు విధుల్లో చేరారు. వీరిలో దాదాపు 900 మందికి జీతాలు అందాయి. మిగిలిన వారికి త్వరలో రానున్నాయి. జీతం ఇవ్వడానికి ఇప్పటివరకు దాదాపు 400 మంది నుంచి సగటున రూ.2 వేల చొప్పున రూ.8 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. అవి అందని వారిని కూడా సిబ్బంది మామూళ్ల కోసం ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధుల్లో చేరిన నర్సింగ్ ఆఫీసర్లకు మూడు నెలల తర్వాత ఇప్పుడు జీతాలు అందుతున్నాయి. ఇది సంతోషించాల్సిన విషయమే.. తొలి జీతం తీసుకోవడానికి వారు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.. దక్షిణ సమర్పిస్తేనే సంతకం అంటూ కొందరు అధికారులు భీష్మించుకొని కూర్చోవడంతో వారంతా అవాక్కయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమ్యామ్యాలు సమర్పించుకుంటున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది సాగించిన ఈ వసూళ్లపర్వంపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం..
ఇక్కడి నుంచే మొదలు..
ఉద్యోగులకు జీతాలు అందాలంటే వారి వివరాలను పాలనా విభాగం వారు జిల్లా ఖజానా (ట్రెజరీ) కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడే వసూళ్ల పర్వానికి తెరతీశారు.. తమ దగ్గర చేరిన నర్సింగ్ ఆఫీసర్లలో మామూళ్లు ఇచ్చినవారి వివరాలనే ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ట్రెజరీకి పంపించారు.
ఒక్కొక్కరికి మూడు సార్లు ఫోన్
మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో 281 మంది చేరారు. వీరిలో 150 మందికి జీతాలు అందించారు. ఆ సమయంలో వారిలో కొందరికి ఆరోగ్యశాఖ నుంచి రూ.2 వేల చొప్పున ఇవ్వాలంటూ ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు సార్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇవి కూడా మధ్యవర్తుల ద్వారా చేయించారు.
జిల్లాల వారీగా ఇలా
- భూపాలపల్లి జిల్లాలో 199 మంది పనిచేస్తున్నారు. దాదాపు మూడు నెలల వేతనాలు కావాలంటే ఆరోగ్యశాఖలోని అడ్మినిస్ట్రేషన్ విభాగం వారు ఒకరు మధ్యవర్తుల ద్వారా ఒక్కో నర్సింగ్ ఆఫీసరు నుంచి రూ. 2 వేల చొప్పున తీసుకున్నారు.
- వరంగల్ 179, హనుమకొండ జిల్లాలో 179 మంది చొప్పున విధుల్లో చేరారు. వీరికి ఆమ్యామ్యాల బెడద తప్పదు.
- జనగామ జిల్లాలో 158 మంది నర్సింగ్ ఆఫీసర్లు విధుల్లో చేరారు. వేతనాల కోసం జిల్లా ఖజానా కార్యాలయం నుంచి రావాల్సిన ఉద్యోగ గుర్తింపు నెంబరు కోసం ఖజానా కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి రూ.2 వేల చొప్పున వసూలు చేశారు.
- ములుగు జిల్లాలో 18 మంది పనిచేస్తున్నారు. వారికి ఇటీవలే ఖజానా కార్యాలయం నుంచి ఉద్యోగ గుర్తింపు నెంబర్లు ఇచ్చారు.. ఇంకా వేతనాలు అందలేదు. వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి వెళ్లి అక్కడి ఓ అధికారిని కలవాలంటూ వారికి సమాచారం పంపినట్లు తెలిసింది.
ఎంజీఎంలో వసూళ్ల తీరును ముందే బయటపెట్టిన ‘ఈనాడు’
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 120 మంది నర్సింగ్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారి జీతాలకు సంబంధించిన దస్త్రాలు ఖజానా కార్యాలయానికి పంపకుండా తాత్సారం చేశారు.. మధ్యవర్తుల ద్వారా ఒక్కొక్కరి నుంచి రూ.3 వేలు వసూలు చేశాకే ఖజానా కార్యాలయానికి పంపించారు. గత ఏప్రిల్ 14న ఈ విషయాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. ‘అందని వేతనాలు.. అడిగితే వసూళ్లు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించి నర్సింగ్ ఆఫీసర్లకు ఉద్యోగ గుర్తింపు పత్రాలు అందించారు. వసూళ్లకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకున్నారు.
డబ్బులు అడిగినట్లు ఫిర్యాదు రాలేదు
- డా.శ్రీనివాస్, సూపరింటెండెంట్, మహబూబాబాద్ జిలా ఆసుపత్రి
వేతనాలు పొందే క్రమంలో డబ్బులు అడిగినట్లు కొత్తగా విధుల్లో చేరిన నర్సింగ్ ఆఫీసర్లు మాకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా.. డబ్బులు అడిగినా వెంటనే మాకు ఫిర్యాదు చేయాలని వారికి తెలియజేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ మాట.. గుర్తు చేసుకుందాం!
[ 29-06-2024]
రాష్ట్రంలో రాజధాని తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంది. అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కీలక పరిశ్రమలు, అనేక అభివృద్ధి పనులు పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో వివిధ సందర్భాల్లో 12 నియోజకవర్గాల్లో పర్యటించారు. -
క్రీడాభివృద్ధికి ఓరుగల్లు అనుకూలం
[ 29-06-2024]
క్రీడాభివృద్ధికి నగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఓరుగల్లు స్వల్ప వ్యవధిలోనే గణనీయమైన ప్రగతి సాధిస్తూ స్పోర్ట్స్ సిటీగా మారుతుందని రాష్ట్ర క్రీడలు, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ పేర్కొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని ఎన్హెచ్ఎం సీనియర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ అన్నారు. ములుగులో డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య అధ్యక్షతన ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం..
[ 29-06-2024]
సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ, కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. -
తాగునీటి సీసా.. తప్పని ప్రయాస
[ 29-06-2024]
గుక్కెడు మంచినీళ్ల కోసం ఆ తండావాసులు ప్లాస్టిక్ సీసాలు పట్టుకొని పిల్లా పాపలతో బోరు వద్దకు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం తీగలతండా గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్యతండా వాసుల నీటి కష్టాలివి. -
ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ
[ 29-06-2024]
భారతదేశ మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణల పితామహుడని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భారతరత్న పీవీ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం అధికారిక ఉత్సవాలు నిర్వహించింది. -
వ్యాపారుల మాయాజాలం
[ 29-06-2024]
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనామ్ విధానాన్ని అమలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం అందుకుంది. అలాంటిది కొంత మంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్ బయట ఖరీదులు నిర్వహిస్తున్నారు. -
ప్రతి నెలా ‘ఆరుద్రోత్సవం’
[ 29-06-2024]
రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చారిత్రక, సాహిత్య నేపథ్యం ఎంతో ఉంది. -
ఆకట్టుకుంటున్న సోమనాథుని స్మృతివనం
[ 29-06-2024]
జనగామ జిల్లా పాలకుర్తి శివారులో ఏడాది క్రితం నిర్మితమైన ప్రాచీన యుగానికి చెందిన తెలుగు కవి పాల్కుర్కి సోమనాథుని స్మృతివనంలో భక్తులు, పర్యాటకులు పాల్గొని సందడి చేస్తున్నారు. -
బ్యాంకు లింకేజీలో ఆదర్శం గీసుకొండ
[ 29-06-2024]
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలను అందుకుని మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలిచిన గీసుకొండ మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. -
మట్టిలో పుట్టిన సీత శిశుగృహకు అప్పగింత
[ 29-06-2024]
‘మట్టిలో పుట్టిన సీత’ శిశువు గృహకు చేరింది. మే 4వ తేదీన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను మట్టిలో పాతిపెట్టగా, ఓ లారీ చోదకుడు గుర్తించి రక్షించిన విషయం తెలిసిందే. -
మొలకెత్తని విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన
[ 29-06-2024]
మొలకెత్తని విత్తనాలు విక్రయించారంటూ వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ దుకాణం ఎదుట రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. దుకాణదారులతో వాగ్వాదానికి దిగారు.