నెరవేరని పేదల సొంతింటి కల
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత భారాస ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. లక్ష్యం బాగున్నా.. క్షేత్రస్థాయిలో వాటి నిర్మాణం, ఎంపిక మాత్రం ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది.
లబ్ధిదారుల ఎదురుచూపు
పాలకుర్తి మండలం గూడూరులో పూర్తయినా పంపిణీకి నోచక..
పాలకుర్తి, న్యూస్టుడే: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత భారాస ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. లక్ష్యం బాగున్నా.. క్షేత్రస్థాయిలో వాటి నిర్మాణం, ఎంపిక మాత్రం ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. మంజూరైనవి వేల సంఖ్యలో ఉన్నా, ఇప్పటి వరకు అందిన వారు వందల్లోనే ఉన్నారు. జిల్లాలో రెండు పడకగదుల ఇళ్ల ప్రస్తుత స్థితిగతులపై కథనం..
ప్రాంతాలు అధ్వానంగా తయారై..
జిల్లాలో 4,372 రెండు పడక గదుల ఇళ్లను ప్రభుత్వం గతంలో మంజూరు చేసింది. పాలకుర్తిలో 2,034, జనగామలో 1,193, స్టేషన్ఘన్పూర్లో 1,145 మంజూరయ్యాయి. మూడు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు కేవలం 670 మందికి మాత్రమే కేటాయించారు. ఒక మండలంలో రెండు, మూడు గ్రామాలు మినహా, మిగతా ఏ పల్లెల్లో ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరగలేదు. పూర్తయిన చోట లబ్ధిదారులను గుర్తించినా, కేటాయించలేదు. నిర్మాణ ప్రదేశాలు పిచ్చిమొక్కలు, నీటి మడుగులతో అధ్వానంగా తయారయ్యాయి. ఉన్నత, దిగువ స్థాయి అధికారులు పలుమార్లు సమీక్షించినా పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లులు నిలిచిపోయాయి.
గూడూరులో ఆరేళ్లుగా నిరీక్షణ..
పాలకుర్తి మండలం గూడూరులో తొలి దశలో పూర్తయిన నిర్మాణాలు గత ఆరేళ్లుగా పంపిణీకి నోచుకోవడం లేదు. ప్రస్తుతం చాలా గృహాలు నిర్వహణ కరవై శిథిలావస్థకు చేరుతున్నాయి. కిటికీలతోపాటు ఇతరాత్ర సామగ్రి పాడవుతున్నాయి. కొన్ని కిటికీలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. మూడు నెలల క్రితం స్థానికులు నివాసాల్లోకి చొరబడగా, పోలీసులు మాట్లాడి, బయటకు పంపించారు. బమ్మెరలో ఏళ్లుగా పనులు కొనసాగుతుండటంతో పిచ్చిమొక్కలు భారీగా పెరిగాయి. జిల్లాలో అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి త్వరితగతిన పూర్తి చేసి, అందజేయాలని కోరుతున్నారు.
జిల్లా వివరాలు..
మంజూరైన రెండు పడక గదుల ఇళ్లులు : 4,372
టెండర్ ప్రక్రియ పూర్తయినవి : 3,360
పూర్తికానివి : 1,012
గుర్తించిన లబ్ధిదారులు: 1,257
నివాసాలు పొందిన వారు : 670
కేటాయించిన నిధులు : రూ.236 కోట్లు
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..
స్టేషన్ఘన్పూర్లో పిల్లర్ల దశలోనే..
స్టేషన్ఘన్పూర్: మండలంలోని సముద్రాల గ్రామ శివారులో సుమారు 40 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో 10 చివరి దశలో ఉండగా, మిగతావి ఇంకా మొదలుకాలేదు. 2018లో అప్పటి ఎమ్మెల్యే రాజయ్య శంకుస్థాపన చేశారు. గతంలో అధికారులు గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసినా.. ఇప్పటివరకు ఎవరికీ కేటాయించలేదు. దీంతో కొందరు రాత్రిళ్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నియోజకవర్గ కేంద్రంలో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. 2019లో 100 ఇళ్లు కేటాయించినట్లు ప్రకటించినా, ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం..
- దామోదర్రావు, జిల్లా గృహ నిర్మాణశాఖ ఈఈ
ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. వారి మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటాం. పలు కారణాలతో కొన్ని టెండర్లు పూర్తి కాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పూర్తయిన వాటిని పంపిణీ చేసేలా చొరవ తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ మాట.. గుర్తు చేసుకుందాం!
[ 29-06-2024]
రాష్ట్రంలో రాజధాని తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంది. అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కీలక పరిశ్రమలు, అనేక అభివృద్ధి పనులు పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో వివిధ సందర్భాల్లో 12 నియోజకవర్గాల్లో పర్యటించారు. -
క్రీడాభివృద్ధికి ఓరుగల్లు అనుకూలం
[ 29-06-2024]
క్రీడాభివృద్ధికి నగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఓరుగల్లు స్వల్ప వ్యవధిలోనే గణనీయమైన ప్రగతి సాధిస్తూ స్పోర్ట్స్ సిటీగా మారుతుందని రాష్ట్ర క్రీడలు, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ పేర్కొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని ఎన్హెచ్ఎం సీనియర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ అన్నారు. ములుగులో డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య అధ్యక్షతన ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం..
[ 29-06-2024]
సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ, కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. -
తాగునీటి సీసా.. తప్పని ప్రయాస
[ 29-06-2024]
గుక్కెడు మంచినీళ్ల కోసం ఆ తండావాసులు ప్లాస్టిక్ సీసాలు పట్టుకొని పిల్లా పాపలతో బోరు వద్దకు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం తీగలతండా గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్యతండా వాసుల నీటి కష్టాలివి. -
ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ
[ 29-06-2024]
భారతదేశ మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణల పితామహుడని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భారతరత్న పీవీ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం అధికారిక ఉత్సవాలు నిర్వహించింది. -
వ్యాపారుల మాయాజాలం
[ 29-06-2024]
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనామ్ విధానాన్ని అమలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం అందుకుంది. అలాంటిది కొంత మంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్ బయట ఖరీదులు నిర్వహిస్తున్నారు. -
ప్రతి నెలా ‘ఆరుద్రోత్సవం’
[ 29-06-2024]
రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చారిత్రక, సాహిత్య నేపథ్యం ఎంతో ఉంది. -
ఆకట్టుకుంటున్న సోమనాథుని స్మృతివనం
[ 29-06-2024]
జనగామ జిల్లా పాలకుర్తి శివారులో ఏడాది క్రితం నిర్మితమైన ప్రాచీన యుగానికి చెందిన తెలుగు కవి పాల్కుర్కి సోమనాథుని స్మృతివనంలో భక్తులు, పర్యాటకులు పాల్గొని సందడి చేస్తున్నారు. -
బ్యాంకు లింకేజీలో ఆదర్శం గీసుకొండ
[ 29-06-2024]
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలను అందుకుని మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలిచిన గీసుకొండ మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. -
మట్టిలో పుట్టిన సీత శిశుగృహకు అప్పగింత
[ 29-06-2024]
‘మట్టిలో పుట్టిన సీత’ శిశువు గృహకు చేరింది. మే 4వ తేదీన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను మట్టిలో పాతిపెట్టగా, ఓ లారీ చోదకుడు గుర్తించి రక్షించిన విషయం తెలిసిందే. -
మొలకెత్తని విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన
[ 29-06-2024]
మొలకెత్తని విత్తనాలు విక్రయించారంటూ వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ దుకాణం ఎదుట రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. దుకాణదారులతో వాగ్వాదానికి దిగారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం