ప్రజా భవన్కు బారులు
ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళ, శుక్రవారాల్లో హైదరాబాద్లోని ప్రజా భవన్లో చేపడుతున్న ప్రజావాణికి జిల్లా నుంచి బారులుదీరుతున్నారు.
సమస్యలపై హైదరాబాద్కు వెళ్తున్న బాధితులు
హనుమకొండ కలెక్టరేట్, భీమదేవరపల్లి, న్యూస్టుడే : ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళ, శుక్రవారాల్లో హైదరాబాద్లోని ప్రజా భవన్లో చేపడుతున్న ప్రజావాణికి జిల్లా నుంచి బారులుదీరుతున్నారు. జిల్లాస్థాయిలో ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ నేరుగా రాజధాని బాట పడుతున్నారు. ఉన్నతాధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసి, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు పంపిస్తున్నారు. దీని ద్వారా ఆ దరఖాస్తు ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. ప్రజా భవన్లో వారినికి రెండ్రోజులు జరుగుతున్న ప్రజా దర్బార్కు హనుమకొండ జిల్లా ప్రజలు హాజరై ఇస్తున్న వినతులపై ప్రత్యేక కథనం..
జిల్లా నుంచి 320 దరఖాస్తులు..
జిల్లా నుంచి ప్రజా భవన్కు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వెళ్తున్నాయి. అక్కడికి వెళ్లిన వాటిని పరిశీలించిన అధికారులు వాటిలో రెవెన్యూ పరమైన వాటిని పరిష్కారం కోసం జిల్లాకు పంపిస్తున్నారు. ఇతర శాఖలకు సంబంధించిన వినతులు, ఫిర్యాదులను ఆన్లైన్లో పొందుపరచి.. సంబంధిత శాఖల అధికారులు చూసుకొని పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి హైదరాబాద్కు వెళ్లి వినతులు ఇచ్చినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు నిరాశకు గురవుతున్నారు. అయితే పరిష్కారం కాని సమస్యలపై ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, భూ సమస్యలపై వచ్చే అర్జీల్లో ఎక్కువగా కోర్టులో కేసులు ఉన్నవే ఉంటున్నాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. వాటితో పాటు సాదాబైనామా వినతులు వస్తున్నాయని అంటున్నారు. అర్హత లేనివారు సైతం పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. తమ పరిధిలో ఉన్నవి మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నారు. వాటి వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు.
వారసత్వ భూమి ఇతరులకు పట్టా చేశారు
భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన కట్కూరి వీరయ్య.. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని అధికారులు ఇతరుల పేరిట పట్టా చేశారని ఇటీవల హైదరాబాద్కు వెళ్లి ప్రజాదర్బార్లో వినతిపత్రం ఇచ్చారు. భూమి తనకు ఇప్పించాలని కోరారు. సర్వే నెంబరు 86లో రెండు ఎకరాల భూమి ముగ్గురు అన్నదమ్ములకు వారసత్వంగా వచ్చింది. కట్కూరి లింగయ్య, దుర్గయ్య, వీరయ్యలు ఆ భూమిని 0.26 గుంటలుగా పంచుకున్నారు. రూ.1.50 లక్షలు వెచ్చించి ఫెన్సింగ్ వేసుకున్నారు. అయితే హనుమకొండకు చెందిన వ్యక్తి ఆ భూమి తనదని, తనకు పట్టా ఉందంటూ ఫెన్సింగ్ తొలగించడంతో వీరయ్య రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ప్రజాదర్బార్ను ఆశ్రయించారు. తనకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని, భూమి ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
పరిష్కారం కానివే ఎక్కువగా వస్తున్నాయి..
- వైవీ గణేష్, డీఆర్వో హనుమకొండ
జిల్లా ప్రజలు ప్రజా దర్బార్లో ఇచ్చిన వినతులు, దరఖాస్తుల్లో రెవెన్యూ సంబంధిత వాటిని ఇక్కడికి పంపిస్తున్నారు. అవకాశం ఉన్నవి వెంటనే పరిష్కరిస్తున్నాం. చాలా వరకు దరఖాస్తులు పరిశీలిస్తే కోర్టు కేసులున్న తాగాదాలు, సాదా బైనామాలే అధికంగా ఉంటున్నాయి. అవి మా పరిధిలో ఉండవు. ప్రజా దర్బార్ నుంచి వచ్చిన వినతులను వెంట వెంటనే సంబంధిత తహసీల్దార్లకు పంపిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ మాట.. గుర్తు చేసుకుందాం!
[ 29-06-2024]
రాష్ట్రంలో రాజధాని తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంది. అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కీలక పరిశ్రమలు, అనేక అభివృద్ధి పనులు పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో వివిధ సందర్భాల్లో 12 నియోజకవర్గాల్లో పర్యటించారు. -
క్రీడాభివృద్ధికి ఓరుగల్లు అనుకూలం
[ 29-06-2024]
క్రీడాభివృద్ధికి నగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఓరుగల్లు స్వల్ప వ్యవధిలోనే గణనీయమైన ప్రగతి సాధిస్తూ స్పోర్ట్స్ సిటీగా మారుతుందని రాష్ట్ర క్రీడలు, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ పేర్కొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని ఎన్హెచ్ఎం సీనియర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ అన్నారు. ములుగులో డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య అధ్యక్షతన ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం..
[ 29-06-2024]
సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ, కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. -
తాగునీటి సీసా.. తప్పని ప్రయాస
[ 29-06-2024]
గుక్కెడు మంచినీళ్ల కోసం ఆ తండావాసులు ప్లాస్టిక్ సీసాలు పట్టుకొని పిల్లా పాపలతో బోరు వద్దకు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం తీగలతండా గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్యతండా వాసుల నీటి కష్టాలివి. -
ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ
[ 29-06-2024]
భారతదేశ మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణల పితామహుడని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భారతరత్న పీవీ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం అధికారిక ఉత్సవాలు నిర్వహించింది. -
వ్యాపారుల మాయాజాలం
[ 29-06-2024]
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనామ్ విధానాన్ని అమలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం అందుకుంది. అలాంటిది కొంత మంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్ బయట ఖరీదులు నిర్వహిస్తున్నారు. -
ప్రతి నెలా ‘ఆరుద్రోత్సవం’
[ 29-06-2024]
రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చారిత్రక, సాహిత్య నేపథ్యం ఎంతో ఉంది. -
ఆకట్టుకుంటున్న సోమనాథుని స్మృతివనం
[ 29-06-2024]
జనగామ జిల్లా పాలకుర్తి శివారులో ఏడాది క్రితం నిర్మితమైన ప్రాచీన యుగానికి చెందిన తెలుగు కవి పాల్కుర్కి సోమనాథుని స్మృతివనంలో భక్తులు, పర్యాటకులు పాల్గొని సందడి చేస్తున్నారు. -
బ్యాంకు లింకేజీలో ఆదర్శం గీసుకొండ
[ 29-06-2024]
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలను అందుకుని మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలిచిన గీసుకొండ మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. -
మట్టిలో పుట్టిన సీత శిశుగృహకు అప్పగింత
[ 29-06-2024]
‘మట్టిలో పుట్టిన సీత’ శిశువు గృహకు చేరింది. మే 4వ తేదీన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను మట్టిలో పాతిపెట్టగా, ఓ లారీ చోదకుడు గుర్తించి రక్షించిన విషయం తెలిసిందే. -
మొలకెత్తని విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన
[ 29-06-2024]
మొలకెత్తని విత్తనాలు విక్రయించారంటూ వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ దుకాణం ఎదుట రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. దుకాణదారులతో వాగ్వాదానికి దిగారు.