స్పందన సరే.. పరిష్కారమేది..?
సమస్యలపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో హైదరాబాద్లోని జ్యోతిబాఫులే ప్రజాభవన్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో జిల్లా నుంచి అనేక మంది దరఖాస్తులను సమర్పిస్తున్నారు.
ప్రజావాణి వినతులపై ఫిర్యాదుదారుల ఆవేదన
మహబూబాబాద్, న్యూస్టుడే: సమస్యలపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో హైదరాబాద్లోని జ్యోతిబాఫులే ప్రజాభవన్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో జిల్లా నుంచి అనేక మంది దరఖాస్తులను సమర్పిస్తున్నారు. వాటిని పరిశీలించిన ప్రజావాణి నిర్వహణ అధికారులు ఆ సమస్యను పరిశీలించి వాటిని పరిష్కరించాలంటూ తిరిగి జిల్లాకే పంపిస్తున్నారు. సంబంధిత అధికారులు ఆ వినతులపై స్పందించినా పరిష్కారాలు మాత్రం కనిపించడం లేదు.
భూ వివాదాలే అధికం..
జిల్లా నుంచి ప్రజావాణిలో సమర్పించిన ఫిర్యాదుల్లో ఎక్కువగా భూముల వివాదాలే ఉంటున్నాయి. ధరణి పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి భూ సమస్యలు పెరిగిపోయాయంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ తర్వాత ఆసరా పింఛన్లు, ఉద్యోగ నియామకాలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరుతో వివిధ శాఖలకు సంబంధించి నాలుగైదు దరఖాస్తులు ఉన్నాయి.
కోర్టు వివాదాలు, సరైన ఆధారాలు లేని సమస్యలను ఎక్కడికెళ్లినా వాటికి పరిష్కారం లభించదని ఓ అధికారి పేర్కొన్నారు. ఎక్కువగా భూముల సమస్యలే ఉన్నందున ధరణి పోర్టల్ సవరణ ప్రక్రియ ముగిసి కొత్తగా చేపట్టనున్న కార్యక్రమంలో వాటికి పరిష్కారం లభించవచ్చని భావిస్తున్నారు.
ఇదీ పరిస్థితి.. జిల్లా నుంచి హైదరా బాద్ ప్రజావాణికి 206 దరఖాస్తులు వెళ్లగా 17 దరఖాస్తుదారుల సమస్యలను పరిష్కరించినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. మిగిలినవాటిపై సరైన సమాధానం లభించడం లేదు.
మరికొన్ని సమస్యలు..
- బయ్యారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒంటరి మహిళ రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైతే ఆ మహిళా సమస్యకు పరిష్కారం లభించనుంది.
- డోర్నకల్ మండలానికి చెందిన ఓ దివ్యాంగుడు తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఫిర్యాదు చేశారు.
- నెల్లికుదురు మండలానికి చెందిన ఓ మహిళ తన భూమిని ఇతరుల పేరిట రికార్డు చేసుకున్నారని ఫిర్యాదు చేశారు.
- మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ గిరిజన రైతు తమ పూర్వీకుల నుంచి వస్తున్న భూమిని ఓ వ్యక్తి వేరే సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ భూమిని విక్రయిస్తున్నారంటూ విన్నవించారు.
ఉద్యోగం ఇవ్వాలని..
- పి.సైదులు, చిట్యాల, పెద్దవంగర మండలం.
మా గ్రామంలో కొన్నేళ్లుగా సాక్షరభారత్ కో-ఆర్డినేటర్గా పని చేశాను. ఆ తర్వాత పంచాయతీ కారోబార్గా విధులు నిర్వహించాను. వివిధ రాజకీయ కారణాలతో నన్ను ఆ విధుల నుంచి తొలగించారు. తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ప్రజాదర్బార్లో వినతి పత్రం ఇచ్చాను. ముందుగా మీ విద్యార్హతతో ఎంప్లాయిమెంట్ కార్డు తీసుకోమని జిల్లా ఉపాధి కార్యాలయం నుంచి లేఖ పంపించారు. దీంతో కార్డుకు దరఖాస్తు చేసుకున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు సమాచారం ఇస్తామని చెప్పారు.
సమాచారం ఇచ్చారు..
- ఎం.మధు, కోమటిపల్లి, కేసముద్రం మండలం.
సివిల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన నాకు మైనింగ్ శాఖ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో సర్వేయర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. ముఖాముఖి కోసం పిలిచినప్పుడు నేను అందుబాటులో లేను. తర్వాత అధికారులను వెళ్లి కలిస్తే సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ విషయమై హైదరాబాద్లో నిర్వహించిన ప్రజాదర్బార్లో వినతిపత్రం అందించాను. దీంతో వారం రోజుల తర్వాత స్పందించిన మైనింగ్ శాఖ అధికారులు లేఖ పంపించారు. సంబంధిత శాఖకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్లు మారుతున్నారని పూర్తి స్థాయిలో ఎండీ లేకపోవడం వల్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు నియమించడం లేదంటూ సమాచారం పంపించారు.
సంబంధిత కార్యాలయాలకు పంపిస్తున్నాం
- ఎం.డేవిడ్, జిల్లా అదనపు కలెక్టర్.
జిల్లావాసులు ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం కోసం మా వద్దకు వస్తున్నాయి. వాటిని సంబంధిత కార్యాలయాలకు పంపించి పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నాం. న్యాయపరమైన అంశాలు ఉంటే వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ మాట.. గుర్తు చేసుకుందాం!
[ 29-06-2024]
రాష్ట్రంలో రాజధాని తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంది. అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కీలక పరిశ్రమలు, అనేక అభివృద్ధి పనులు పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో వివిధ సందర్భాల్లో 12 నియోజకవర్గాల్లో పర్యటించారు. -
క్రీడాభివృద్ధికి ఓరుగల్లు అనుకూలం
[ 29-06-2024]
క్రీడాభివృద్ధికి నగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఓరుగల్లు స్వల్ప వ్యవధిలోనే గణనీయమైన ప్రగతి సాధిస్తూ స్పోర్ట్స్ సిటీగా మారుతుందని రాష్ట్ర క్రీడలు, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ పేర్కొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని ఎన్హెచ్ఎం సీనియర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ అన్నారు. ములుగులో డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య అధ్యక్షతన ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం..
[ 29-06-2024]
సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ, కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. -
తాగునీటి సీసా.. తప్పని ప్రయాస
[ 29-06-2024]
గుక్కెడు మంచినీళ్ల కోసం ఆ తండావాసులు ప్లాస్టిక్ సీసాలు పట్టుకొని పిల్లా పాపలతో బోరు వద్దకు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం తీగలతండా గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్యతండా వాసుల నీటి కష్టాలివి. -
ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ
[ 29-06-2024]
భారతదేశ మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణల పితామహుడని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భారతరత్న పీవీ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం అధికారిక ఉత్సవాలు నిర్వహించింది. -
వ్యాపారుల మాయాజాలం
[ 29-06-2024]
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనామ్ విధానాన్ని అమలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం అందుకుంది. అలాంటిది కొంత మంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్ బయట ఖరీదులు నిర్వహిస్తున్నారు. -
ప్రతి నెలా ‘ఆరుద్రోత్సవం’
[ 29-06-2024]
రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చారిత్రక, సాహిత్య నేపథ్యం ఎంతో ఉంది. -
ఆకట్టుకుంటున్న సోమనాథుని స్మృతివనం
[ 29-06-2024]
జనగామ జిల్లా పాలకుర్తి శివారులో ఏడాది క్రితం నిర్మితమైన ప్రాచీన యుగానికి చెందిన తెలుగు కవి పాల్కుర్కి సోమనాథుని స్మృతివనంలో భక్తులు, పర్యాటకులు పాల్గొని సందడి చేస్తున్నారు. -
బ్యాంకు లింకేజీలో ఆదర్శం గీసుకొండ
[ 29-06-2024]
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలను అందుకుని మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలిచిన గీసుకొండ మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. -
మట్టిలో పుట్టిన సీత శిశుగృహకు అప్పగింత
[ 29-06-2024]
‘మట్టిలో పుట్టిన సీత’ శిశువు గృహకు చేరింది. మే 4వ తేదీన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను మట్టిలో పాతిపెట్టగా, ఓ లారీ చోదకుడు గుర్తించి రక్షించిన విషయం తెలిసిందే. -
మొలకెత్తని విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన
[ 29-06-2024]
మొలకెత్తని విత్తనాలు విక్రయించారంటూ వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ దుకాణం ఎదుట రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. దుకాణదారులతో వాగ్వాదానికి దిగారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
-
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్
-
అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు