మామను హతమార్చిన అల్లుడికి జీవిత ఖైదు
మామను గొడ్డలితో నరికి చెరువులో పడేసి ప్రమాదవశాత్తు పడి చనిపోయినట్లు చిత్రీకరించేందుకు యత్నించిన అల్లుడికి జీవితఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి మంగళవారం తీర్పుచెప్పారు.
వరంగల్ న్యాయవిభాగం, హసన్పర్తి, న్యూస్టుడే: మామను గొడ్డలితో నరికి చెరువులో పడేసి ప్రమాదవశాత్తు పడి చనిపోయినట్లు చిత్రీకరించేందుకు యత్నించిన అల్లుడికి జీవితఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి మంగళవారం తీర్పుచెప్పారు. హసన్పర్తి ఎస్సై అశోక్, ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామానికి చెందిన జిక్కి ఎల్లయ్య (55) తన కుమార్తె స్వాతిని హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన పోతరాజు వెంకటేశ్ (35)కు ఇచ్చి 2013లో వివాహం చేశారు. వీరికి కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. పెద్దలు పలుమార్లు సర్దిచెప్పినా మార్పు రాలేదు. ఈ క్రమంలో 2020 అక్టోబరు 6న ఎల్లయ్య హసన్పర్తిలోని తన కుమార్తె ఇంటికి వచ్చి, మరుసటిరోజు ఉదయం స్వగ్రామం వెళుతున్నట్లు చెప్పి బయల్దేరారు. మార్గమధ్యలో హసన్పర్తిలోని నల్లగుట్ట వద్ద ఉన్న దుకాణంలో మద్యం తాగారు. అనంతరం అల్లుడు వెంకటేశ్కు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. ఇద్దరూ కలిసి మద్యం తాగి అక్కడే కొద్దిసేపు నిద్రించారు. సాయంత్రం మళ్లీ హసన్పర్తి చెరువుకట్ట పైకి కల్లు తాగడానికి వెళ్లారు. ఆ సమయంలో తన కుమార్తెను తరచూ ఎందుకు వేధిస్తున్నావంటూ ఎల్లయ్య అల్లుడిని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. కోపోద్రిక్తుడైన వెంకటేశ్ అక్కడే ఉన్న గొడ్డలితో దాడి చేయడంతో మామ ఎల్లయ్య తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అలాగే వదిలి వెళితే తానే చంపినట్లు తెలిసిపోతుందనుకొని వెంకటేశ్ ఆ మృతదేహాన్ని చెరువులో పడేశాడు. ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదుతో హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ఎ.శ్రీధర్రావు దర్యాప్తులో వెంకటేశ్ తన మామను హతమార్చినట్లు తేలింది. హత్యా నేరం కింద కేసు నమోదు చేసి న్యాయస్థానంలో నేరారోపణ పత్రాన్ని దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు పైవిధంగా శిక్ష విధించింది. ఈ కేసును ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాజమల్లారెడ్డి వాదించగా.. కోర్టు హెడ్ కానిస్టేబుల్ వి.రవీందర్ విచారణ సందర్భంగా పలువురు సాక్షులను హాజరుపర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ మాట.. గుర్తు చేసుకుందాం!
[ 29-06-2024]
రాష్ట్రంలో రాజధాని తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంది. అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కీలక పరిశ్రమలు, అనేక అభివృద్ధి పనులు పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో వివిధ సందర్భాల్లో 12 నియోజకవర్గాల్లో పర్యటించారు. -
క్రీడాభివృద్ధికి ఓరుగల్లు అనుకూలం
[ 29-06-2024]
క్రీడాభివృద్ధికి నగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఓరుగల్లు స్వల్ప వ్యవధిలోనే గణనీయమైన ప్రగతి సాధిస్తూ స్పోర్ట్స్ సిటీగా మారుతుందని రాష్ట్ర క్రీడలు, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ పేర్కొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని ఎన్హెచ్ఎం సీనియర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ అన్నారు. ములుగులో డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య అధ్యక్షతన ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం..
[ 29-06-2024]
సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ, కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. -
తాగునీటి సీసా.. తప్పని ప్రయాస
[ 29-06-2024]
గుక్కెడు మంచినీళ్ల కోసం ఆ తండావాసులు ప్లాస్టిక్ సీసాలు పట్టుకొని పిల్లా పాపలతో బోరు వద్దకు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం తీగలతండా గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్యతండా వాసుల నీటి కష్టాలివి. -
ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ
[ 29-06-2024]
భారతదేశ మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణల పితామహుడని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భారతరత్న పీవీ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం అధికారిక ఉత్సవాలు నిర్వహించింది. -
వ్యాపారుల మాయాజాలం
[ 29-06-2024]
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనామ్ విధానాన్ని అమలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం అందుకుంది. అలాంటిది కొంత మంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్ బయట ఖరీదులు నిర్వహిస్తున్నారు. -
ప్రతి నెలా ‘ఆరుద్రోత్సవం’
[ 29-06-2024]
రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చారిత్రక, సాహిత్య నేపథ్యం ఎంతో ఉంది. -
ఆకట్టుకుంటున్న సోమనాథుని స్మృతివనం
[ 29-06-2024]
జనగామ జిల్లా పాలకుర్తి శివారులో ఏడాది క్రితం నిర్మితమైన ప్రాచీన యుగానికి చెందిన తెలుగు కవి పాల్కుర్కి సోమనాథుని స్మృతివనంలో భక్తులు, పర్యాటకులు పాల్గొని సందడి చేస్తున్నారు. -
బ్యాంకు లింకేజీలో ఆదర్శం గీసుకొండ
[ 29-06-2024]
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలను అందుకుని మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలిచిన గీసుకొండ మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. -
మట్టిలో పుట్టిన సీత శిశుగృహకు అప్పగింత
[ 29-06-2024]
‘మట్టిలో పుట్టిన సీత’ శిశువు గృహకు చేరింది. మే 4వ తేదీన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను మట్టిలో పాతిపెట్టగా, ఓ లారీ చోదకుడు గుర్తించి రక్షించిన విషయం తెలిసిందే. -
మొలకెత్తని విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన
[ 29-06-2024]
మొలకెత్తని విత్తనాలు విక్రయించారంటూ వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ దుకాణం ఎదుట రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. దుకాణదారులతో వాగ్వాదానికి దిగారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త