అనిశా అధికారినంటూ ఉద్యోగులకు బెదిరింపులు
అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారినంటూ గుర్తు తెలియని వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.
వరంగల్క్రైం, న్యూస్టుడే: అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారినంటూ గుర్తు తెలియని వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వివిధ శాఖల అధికారులకు ఫోన్ చేసి.. తాను అనిశా కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, మీకున్న ఆస్తుల వివరాలు మావద్ద ఉన్నాయి.. ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో దాడులు చేసే అవకాశం ఉంది.. మేము సూచించిన ఖాతాకు డబ్బులు పంపిస్తే దాడులు జరగకుండా చూస్తామని చెప్పి డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కొందరు అతడి మాటలు నమ్మి డబ్బులు ఇచ్చారు. బయటకు చెబితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎవరూ ముందుకు రావడం లేదు. గత రెండేళ్ల నుంచి ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని కమిషనరేట్ పోలీసులు గుర్తించారు. కానీ ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో దృష్టి సారించలేదు.
ఠాణాల నుంచి ఫోన్ నెంబర్ సేకరణ
ఎక్కడైనా అనిశా దాడులు జరిగితే గుర్తు తెలియని వ్యక్తి ఆ వివరాలు తెలుసుకొని, ఆ కార్యాలయ పరిధిలోని ఠాణాకు ఫోన్ చేసి ఇతర అధికారులు, ఉద్యోగుల చరవాణి నెంబర్ సేకరిస్తాడు. కొద్ది రోజుల తర్వాత వారికి ఫోన్ చేసి అనిశా అధికారిని మాట్లాడుతున్నా.. మీకు నమ్మకం లేకుంటే స్థానిక పోలీసులను అడగాలని చెబుతాడు. తెలిసిన పోలీసులు ఎవరైనా ఉంటే వారిని అడిగితే రెండ్రోజుల కిందట అనిశా కార్యాలయం నుంచి ఫోన్ చేసి వివరాలు తీసుకున్నారని చెప్పడంతో భయపడి గుర్తు తెలియని వ్యక్తి అడిగినంత డబ్బు ఇస్తున్నారు.
వెలుగులోకి ఇలా..
- ఇటీవల కమలాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంపై అనిశా అధికారులు దాడి చేశారు. లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ను పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గుర్తు తెలియని వ్యక్తి రెండ్రోజుల అదే మండల ఉప తహసీల్దార్కు ఫోన్ చేసి.. ‘మీకు ఎంత ఆస్తి ఉందో మావద్ద వివరాలున్నాయి. ఇప్పటికే మీ తహసీల్దార్ను పట్టుకున్నాం. మీరు తప్పించుకోవాలంటే నేను చెప్పిన ఖాతాలో రూ.50 వేలు వేయాలి’.. అని చెప్పాడు. అనుమానం వచ్చిన ఉప తహసీల్దార్ వరంగల్ అనిశా అధికారులను ఫోన్ చేసి ఆరా తీయగా.. తాము ఫోన్ చేయలేదని, దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
- గత కొద్దిరోజుల క్రితం వరంగల్ నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేస్తున్న అధికారికి సైతం ఫోన్ కాల్ రాగా.. అతను అనిశా అధికారులను సంప్రదించారు. తప్పుడు కాల్ అని తెలిసి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినా స్పందించలేదు.
మా శాఖ అధికారులు ఎవరూ ఫోన్ చేయరు..
- సాంబయ్య, ఏసీబీ డీఎస్పీ, వరంగల్
అధికారులు, ఉద్యోగులకు అనిశా అధికారులు ఎవరూ ఫోన్ చేయరు. ఇటీవల కొందరు మా శాఖ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. కేసు నమోదు చేసి విచారణ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
[ 29-06-2024]
వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. -
మీ మాట.. గుర్తు చేసుకుందాం!
[ 29-06-2024]
రాష్ట్రంలో రాజధాని తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంది. అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కీలక పరిశ్రమలు, అనేక అభివృద్ధి పనులు పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో వివిధ సందర్భాల్లో 12 నియోజకవర్గాల్లో పర్యటించారు. -
క్రీడాభివృద్ధికి ఓరుగల్లు అనుకూలం
[ 29-06-2024]
క్రీడాభివృద్ధికి నగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఓరుగల్లు స్వల్ప వ్యవధిలోనే గణనీయమైన ప్రగతి సాధిస్తూ స్పోర్ట్స్ సిటీగా మారుతుందని రాష్ట్ర క్రీడలు, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ పేర్కొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని ఎన్హెచ్ఎం సీనియర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ అన్నారు. ములుగులో డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య అధ్యక్షతన ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం..
[ 29-06-2024]
సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ, కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. -
తాగునీటి సీసా.. తప్పని ప్రయాస
[ 29-06-2024]
గుక్కెడు మంచినీళ్ల కోసం ఆ తండావాసులు ప్లాస్టిక్ సీసాలు పట్టుకొని పిల్లా పాపలతో బోరు వద్దకు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం తీగలతండా గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్యతండా వాసుల నీటి కష్టాలివి. -
ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ
[ 29-06-2024]
భారతదేశ మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణల పితామహుడని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భారతరత్న పీవీ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం అధికారిక ఉత్సవాలు నిర్వహించింది. -
వ్యాపారుల మాయాజాలం
[ 29-06-2024]
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనామ్ విధానాన్ని అమలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం అందుకుంది. అలాంటిది కొంత మంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్ బయట ఖరీదులు నిర్వహిస్తున్నారు. -
ప్రతి నెలా ‘ఆరుద్రోత్సవం’
[ 29-06-2024]
రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చారిత్రక, సాహిత్య నేపథ్యం ఎంతో ఉంది. -
ఆకట్టుకుంటున్న సోమనాథుని స్మృతివనం
[ 29-06-2024]
జనగామ జిల్లా పాలకుర్తి శివారులో ఏడాది క్రితం నిర్మితమైన ప్రాచీన యుగానికి చెందిన తెలుగు కవి పాల్కుర్కి సోమనాథుని స్మృతివనంలో భక్తులు, పర్యాటకులు పాల్గొని సందడి చేస్తున్నారు. -
బ్యాంకు లింకేజీలో ఆదర్శం గీసుకొండ
[ 29-06-2024]
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలను అందుకుని మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలిచిన గీసుకొండ మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. -
మట్టిలో పుట్టిన సీత శిశుగృహకు అప్పగింత
[ 29-06-2024]
‘మట్టిలో పుట్టిన సీత’ శిశువు గృహకు చేరింది. మే 4వ తేదీన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను మట్టిలో పాతిపెట్టగా, ఓ లారీ చోదకుడు గుర్తించి రక్షించిన విషయం తెలిసిందే. -
మొలకెత్తని విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన
[ 29-06-2024]
మొలకెత్తని విత్తనాలు విక్రయించారంటూ వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ దుకాణం ఎదుట రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. దుకాణదారులతో వాగ్వాదానికి దిగారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జియో సేఫ్, జియో ట్రాన్స్లేట్.. ఎలా పనిచేస్తాయ్..?
-
దంచికొట్టిన కోహ్లీ, అక్షర్.. దక్షిణాఫ్రికా టార్గెట్ 177
-
ఎన్టీఆర్ పురస్కారాలు.. బేబీ చిత్రానికి 2 అవార్డులు
-
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం