మేయర్పై అవిశ్వాసం?
గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణిని పదవి నుంచి దించడమే లక్ష్యంగా భారాస, భాజపా కార్పొరేటర్లు ఒక్కటయ్యారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు కావాల్సిన మెజార్టీ సభ్యుల కోసం వ్యూహరచన చేస్తున్నారు.
ఏకతాటిపైకి భారాస, భాజపా కార్పొరేటర్లు
కార్పొరేషన్, న్యూస్టుడే
గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణిని పదవి నుంచి దించడమే లక్ష్యంగా భారాస, భాజపా కార్పొరేటర్లు ఒక్కటయ్యారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు కావాల్సిన మెజార్టీ సభ్యుల కోసం వ్యూహరచన చేస్తున్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఉప మేయర్ ఛాంబరులో జరిగిన భారాస, భాజపా కార్పొరేటర్ల అంతర్గత సమావేశం అవిశ్వాసం దిశగా సాగుతున్న ప్రయత్నాలకు బలం చేకూర్చుతోంది. వరంగల్ తూర్పు, పశ్చిమ, విలీన గ్రామాలకు చెందిన కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల భర్తలు సమావేశంలో పాల్గొన్నారు. మేయర్పై అవిశ్వాసం, గ్రేటర్ వరంగల్ 2024-25 ఆర్థిక సంవత్సరం పద్దు(బడ్జెట్) ఆమోదం, ప్రత్యేక కౌన్సిల్ సమావేశం, డివిజన్ల అభివృద్ధి పనులకు నిధులు తదితర అంశాలపై చర్చించారు. మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కార్పొరేటర్లు చెబుతున్నా సమస్యలు పట్టించుకోవడం లేదని, రెండేళ్లుగా డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా మేయర్ను దించేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లతో చర్చలు జరపాలని తీర్మానించారు.
సంఖ్యాబలంపై దృష్టి
మేయర్పై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చేందుకు తగిన సంఖ్యా బలం కోసం భారాస, భాజపాకు చెందిన ముఖ్య కార్పొరేటర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. భారాస నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన పదిమంది కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
ఇదీ లెక్క..
- గ్రేటర్ వరంగల్లో 66 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్, భారాసకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు 10 మంది వరకు ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటుహక్కు కోసం నమోదు చేసుకునే అవకాశాలున్నాయి.
- 66 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు కలిస్తే మొత్తం 76 అవుతుంది. హనుమకొండ జిల్లా కలెక్టర్కు అవిశ్వాసం నోటీసు ఇవ్వాలంటే 38 మంది సభ్యులు సంతకాలు చేయాలి. భాజపా, భారాస కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు అందరూ కలిస్తే 34 మంది ఉంటారు. మరో నలుగురు సభ్యుల మద్దతుపై దృష్టి సారించారు.
- మేయర్ సుధారాణిపై పార్టీలకతీతంగా కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. తొలుత అవిశ్వాసం పెట్టి దించేసి.. కొత్త మేయర్ ఎవరనేది తర్వాత ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు..
చివరి నిమిషంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు దూరం
మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు హాజరవుతారని అంతా భావించారు. తీరా చూస్తే అందరూ దూరంగా ఉన్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమకు చెందిన ఇద్దరు, ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు అంతర్గతంగా భారాస, భాజపా కార్పొరేటర్లతో మాట్లాడారని తెలిసింది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు రావడంతో హస్తం కార్పొరేటర్లు చివరి నిమిషంలో సమావేశానికి గైర్హాజరైనట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
[ 29-06-2024]
వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. -
మీ మాట.. గుర్తు చేసుకుందాం!
[ 29-06-2024]
రాష్ట్రంలో రాజధాని తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంది. అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కీలక పరిశ్రమలు, అనేక అభివృద్ధి పనులు పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో వివిధ సందర్భాల్లో 12 నియోజకవర్గాల్లో పర్యటించారు. -
క్రీడాభివృద్ధికి ఓరుగల్లు అనుకూలం
[ 29-06-2024]
క్రీడాభివృద్ధికి నగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఓరుగల్లు స్వల్ప వ్యవధిలోనే గణనీయమైన ప్రగతి సాధిస్తూ స్పోర్ట్స్ సిటీగా మారుతుందని రాష్ట్ర క్రీడలు, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ పేర్కొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని ఎన్హెచ్ఎం సీనియర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ అన్నారు. ములుగులో డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య అధ్యక్షతన ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం..
[ 29-06-2024]
సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ, కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. -
తాగునీటి సీసా.. తప్పని ప్రయాస
[ 29-06-2024]
గుక్కెడు మంచినీళ్ల కోసం ఆ తండావాసులు ప్లాస్టిక్ సీసాలు పట్టుకొని పిల్లా పాపలతో బోరు వద్దకు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం తీగలతండా గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్యతండా వాసుల నీటి కష్టాలివి. -
ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ
[ 29-06-2024]
భారతదేశ మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణల పితామహుడని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భారతరత్న పీవీ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం అధికారిక ఉత్సవాలు నిర్వహించింది. -
వ్యాపారుల మాయాజాలం
[ 29-06-2024]
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనామ్ విధానాన్ని అమలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం అందుకుంది. అలాంటిది కొంత మంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్ బయట ఖరీదులు నిర్వహిస్తున్నారు. -
ప్రతి నెలా ‘ఆరుద్రోత్సవం’
[ 29-06-2024]
రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చారిత్రక, సాహిత్య నేపథ్యం ఎంతో ఉంది. -
ఆకట్టుకుంటున్న సోమనాథుని స్మృతివనం
[ 29-06-2024]
జనగామ జిల్లా పాలకుర్తి శివారులో ఏడాది క్రితం నిర్మితమైన ప్రాచీన యుగానికి చెందిన తెలుగు కవి పాల్కుర్కి సోమనాథుని స్మృతివనంలో భక్తులు, పర్యాటకులు పాల్గొని సందడి చేస్తున్నారు. -
బ్యాంకు లింకేజీలో ఆదర్శం గీసుకొండ
[ 29-06-2024]
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలను అందుకుని మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలిచిన గీసుకొండ మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. -
మట్టిలో పుట్టిన సీత శిశుగృహకు అప్పగింత
[ 29-06-2024]
‘మట్టిలో పుట్టిన సీత’ శిశువు గృహకు చేరింది. మే 4వ తేదీన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను మట్టిలో పాతిపెట్టగా, ఓ లారీ చోదకుడు గుర్తించి రక్షించిన విషయం తెలిసిందే. -
మొలకెత్తని విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన
[ 29-06-2024]
మొలకెత్తని విత్తనాలు విక్రయించారంటూ వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ దుకాణం ఎదుట రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. దుకాణదారులతో వాగ్వాదానికి దిగారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు
-
ఏపీలో పింఛన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు
-
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును మళ్లీ విచారించండి: ముప్పాళ్ల సుబ్బారావు
-
ఎస్బీఐ ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్ఎస్ఐబీ