మండుటెండల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు..!
ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వాయిదా వేయాలని విజ్ఞప్తులు
కేయూ పరీక్షల విభాగం కార్యాలయం
కేయూ క్యాంపస్, వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారంరోజులుగా 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొద్దిరోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కాకతీయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 6 నుంచి డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ తదితర కోర్సుల్లో రెండు, నాలుగో, ఆరో సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల బాధ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
122 పరీక్ష కేంద్రాలు.. 1.70 లక్ష మందికి పైగా విద్యార్థులు
కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో 1,71,991 మంది విద్యార్థులు డిగ్రీ పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహచారి, అదనపు అధికారిణి డా.ఎం.తిరుమలాదేవి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 45, వరంగల్లో 47, ఖమ్మంలో 30 కేంద్రాలుండగా.. విద్యార్థుల హాల్టికెట్లను సైతం కేయూ వెబ్సైట్లో పెట్టారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల ఆరు నుంచి జూన్ మొదటి వారం వరకు పరీక్షలు ఉంటాయి.
గ్రామీణ విద్యార్థులకు ప్రమాదమే..
గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొందరు 30-40 కి.మీ. నుంచి జిల్లా, మండల కేంద్రాలకు వచ్చి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఎండల్లో రాకపోకలు కష్టమే. మరోవైపు పరీక్ష కేంద్రాల్లో సైతం ఉక్కపోతతో అవస్థలు తప్పేలా లేవు. ఒకవైపు లోక్సభ, పట్టభద్రుల (నల్గొండ-ఖమ్మం-వరంగల్) ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కట్లు తప్పేలా లేవు.
విద్యార్థుల ఆందోళన..
పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ పలు డిగ్రీ కళాశాలల విద్యార్థులు, కేయూలోని విద్యార్థి సంఘాలు రెండురోజులుగా ఆందోళన చేస్తూ.. అధికారులకు వినతిపత్రాలను అందిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని మండలాలను ప్రభుత్వం రెడ్జోన్గా ప్రకటించింది. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలని విద్యావేత్తలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎండల తీవ్రత వల్ల విద్యార్థులకు ఏదైనా జరిగితే వర్సిటీ అధికారులే బాధ్యత వహించాలని విద్యార్థుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఉస్మానియాలో వాయిదా..
ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా జూన్ 7 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కేయూతో పోల్చితే ఓయూలో డిగ్రీ చదివే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన సమాధానపత్రాల మూల్యాంకనం, ఫలితాలు విడుదల, సర్టిఫికెట్లు అందించడానికి కార్యాచరణ రూపొందించారు. మరోవైపు కేయూ అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు.
తప్పడం లేదు..: ఆచార్య పి.మల్లారెడ్డి, కేయూ రిజిస్ట్రార్
ఎండల తీవ్రత ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. జులై నుంచి బీఈడీ, ఐసెట్, పీజీసెట్, లాసెట్ తదితర పోటీ పరీక్షల్లో ప్రవేశాలు ప్రారంభమవుతాయి. త్వరితగతిన పరీక్షలు నిర్వహించి, ఫలితాలను విడుదల చేయాలనే ఉద్దేశంతోనే ఈ షెడ్యూల్ ప్రకటించాం. వాయిదా వేస్తే పీజీ, ఐసెట్ తదితర కోర్సుల్లో సీట్లు పొందే విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉంది. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలను వాయిదా వేయడం కుదరదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
[ 29-06-2024]
వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. -
మీ మాట.. గుర్తు చేసుకుందాం!
[ 29-06-2024]
రాష్ట్రంలో రాజధాని తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంది. అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కీలక పరిశ్రమలు, అనేక అభివృద్ధి పనులు పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో వివిధ సందర్భాల్లో 12 నియోజకవర్గాల్లో పర్యటించారు. -
క్రీడాభివృద్ధికి ఓరుగల్లు అనుకూలం
[ 29-06-2024]
క్రీడాభివృద్ధికి నగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఓరుగల్లు స్వల్ప వ్యవధిలోనే గణనీయమైన ప్రగతి సాధిస్తూ స్పోర్ట్స్ సిటీగా మారుతుందని రాష్ట్ర క్రీడలు, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ పేర్కొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని ఎన్హెచ్ఎం సీనియర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ అన్నారు. ములుగులో డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య అధ్యక్షతన ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
[ 29-06-2024]
జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం..
[ 29-06-2024]
సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ, కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. -
తాగునీటి సీసా.. తప్పని ప్రయాస
[ 29-06-2024]
గుక్కెడు మంచినీళ్ల కోసం ఆ తండావాసులు ప్లాస్టిక్ సీసాలు పట్టుకొని పిల్లా పాపలతో బోరు వద్దకు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం తీగలతండా గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్యతండా వాసుల నీటి కష్టాలివి. -
ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ
[ 29-06-2024]
భారతదేశ మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణల పితామహుడని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భారతరత్న పీవీ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం అధికారిక ఉత్సవాలు నిర్వహించింది. -
వ్యాపారుల మాయాజాలం
[ 29-06-2024]
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనామ్ విధానాన్ని అమలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం అందుకుంది. అలాంటిది కొంత మంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్ బయట ఖరీదులు నిర్వహిస్తున్నారు. -
ప్రతి నెలా ‘ఆరుద్రోత్సవం’
[ 29-06-2024]
రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చారిత్రక, సాహిత్య నేపథ్యం ఎంతో ఉంది. -
ఆకట్టుకుంటున్న సోమనాథుని స్మృతివనం
[ 29-06-2024]
జనగామ జిల్లా పాలకుర్తి శివారులో ఏడాది క్రితం నిర్మితమైన ప్రాచీన యుగానికి చెందిన తెలుగు కవి పాల్కుర్కి సోమనాథుని స్మృతివనంలో భక్తులు, పర్యాటకులు పాల్గొని సందడి చేస్తున్నారు. -
బ్యాంకు లింకేజీలో ఆదర్శం గీసుకొండ
[ 29-06-2024]
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలను అందుకుని మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలిచిన గీసుకొండ మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. -
మట్టిలో పుట్టిన సీత శిశుగృహకు అప్పగింత
[ 29-06-2024]
‘మట్టిలో పుట్టిన సీత’ శిశువు గృహకు చేరింది. మే 4వ తేదీన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను మట్టిలో పాతిపెట్టగా, ఓ లారీ చోదకుడు గుర్తించి రక్షించిన విషయం తెలిసిందే. -
మొలకెత్తని విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన
[ 29-06-2024]
మొలకెత్తని విత్తనాలు విక్రయించారంటూ వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ దుకాణం ఎదుట రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. దుకాణదారులతో వాగ్వాదానికి దిగారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు
-
ఏపీలో పింఛన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు
-
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును మళ్లీ విచారించండి: ముప్పాళ్ల సుబ్బారావు