logo

Rajoli: ఘనంగా ప్రారంభమైన వైకుంఠనారాయణ స్వామి ఉత్సవాలు

మండలకేంద్రమైన రాజోలిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీ లక్ష్మీ వైకుంఠనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

Published : 17 Jun 2024 16:24 IST

రాజోలి: మండలకేంద్రమైన రాజోలిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీ లక్ష్మీ వైకుంఠనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, అర్చకులు గోపీనాథ్ ఆధ్వర్యంలో ఉదయం స్వామికి బిందెసేవ, ఆలయశుద్ధి, ప్రత్యేక అభిషేకాలు, పంచామృతాభిషేకం, అలంకరణ సేవ, మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం ఉత్సవాల అంకురార్పణ, పుణ్యహవచన, సాయంత్రం స్వామికి పల్లకీ సేవ ఏర్పాటు చేశారు. ఉత్సవాలలో భాగంగా మంగళవారం గరుడసేవ, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ, ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని