జేఎన్టీయూ గురజాడకు మకిలి
వెంకట సుబ్బయ్య ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. చదివాడు. నేనే అతన్ని ఉపకులపతిగా ఎంపిక చేశాను. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసినప్పుడు మంచి పేరుంది.
గతంలో ఉప కులపతిని తానే నియమించానన్న బొత్స
తాజాగా వీసీ వెంకట సుబ్బయ్య రాజీనామా
నిర్మాణంలో ఉన్న పరిపాలనా భవనం
వెంకట సుబ్బయ్య ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. చదివాడు. నేనే అతన్ని ఉపకులపతిగా ఎంపిక చేశాను. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసినప్పుడు మంచి పేరుంది. మీరు చెప్పినంత వరకూ అతనిది రాయలసీమని తెలియదు.
- అప్పట్లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్న మాటలివి.
న్యూస్టుడే, విజయనగరం విద్యావిభాగం: మంత్రి బొత్స వ్యాఖ్యలే జేఎన్టీయూ గురజాడ-విజయనగరం ఉప కులపతి వెంకట సుబ్బయ్యపై వైకాపా ముద్రపడేలా చేశాయి. 2023 ఫిబ్రవరి 10న ఉప కులపతిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా పనిచేశారు. జేఎన్టీయూ అనుబంధ ఇంజినీరింగ్, కురుపాం ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆచార్యులు, అసోసియేట్ ఆచార్యులు, సహాయ ఆచార్యుల నియామకాలకు సంబంధించి 135 పోస్టులకు 2023 అక్టోబరు 30న ప్రకటన విడుదల చేశారు. జేఎన్టీయూకు చెందిన 51 మంది ఫ్యాకల్టీతో పాటు ఇతరులు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగ ప్రకటన, రిజర్వేషను ఖరారుపై న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలవ్వడంతో దరఖాస్తులే స్వీకరించాలని, ప్రొవిజల్ జాబితా జారీ ప్రక్రియ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. జేఎన్టీయూలో వాటిని తుంగలోకి తొక్కారన్న ఆరోపణపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
- తొలిసారిగా 2022-23 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయ స్థాయిలో పరీక్షలు నిర్వహించినపుడు పాత ప్రశ్నపత్రాలే మళ్లీ ఇవ్వడం, లీకేజీలు, ధ్రువపత్రాల జారీలో జాప్యంపై అపవాదులు వచ్చాయి. విద్యార్థులు యూజీసీ, ఏఐసీటీయూకి ఫిర్యాదు చేశారు. 2023-24లో సెమిస్టర్ పరీక్షల్లో ప్రైవేటు కళాశాలలకు ఒక పేపరు బదులు ఇంకొకటి ఇచ్చి.. సిలబస్లో లేకపోవడంతో అప్పటికప్పుడు ఇంకో ప్రశ్నపత్రాన్ని ఇచ్చి పరీక్ష నిర్వహించారు. 2022-23 వార్షిక పరీక్షల్లో విశాఖ జిల్లాలో బి.ఫార్మసీ ద్వితీయ సంవత్సరం ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది.
- పొరుగు సేవల కింద ప్రస్తుతం 67 మంది పనిచేస్తుండగా.. టెండర్పై సెక్యూరిటీగా 60, హౌస్ కీపింగ్లో 60 మందిని తీసుకున్నారు. సెక్యూరిటీ సేవలను విద్యాలయం విభాగాల్లో ఉపయోగిస్తున్నారు. పొరుగు సేవల విభాగంలో సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ ఉద్యోగాలకు కాసులివ్వని వారిని తొలగించినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి.
నాణ్యతెంత..?
విశ్వవిద్యాలయానికి ముందే అకడమిక్ బ్లాక్-3 మంజూరైంది. విశ్వవిద్యాలయం హోదా వచ్చిన తర్వాత పరిపాలనా భవనంగా మార్చారు. రూ.20 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. నాణ్యత నియంత్రణ విభాగం తనిఖీలు లేకుండా రూ.7 కోట్ల మేర బిల్లులు చెల్లించినట్లు ఆరోపణలు వర్సిటీ పాలనలో లోపాలను వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధైర్యంగా వెళ్లొచ్చు.. ఇసుక తెచ్చుకోవచ్చు
[ 05-07-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు
[ 05-07-2024]
నాడు- నేడు పథకం ద్వారా బడుల రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం.. విద్యార్థులకు కష్టాలనే మిగిల్చింది. పాఠశాలల్లో అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
జగనన్న.. భూభాగోతం
[ 05-07-2024]
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట గత ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భారీగా అవినీతి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. -
సొసైటీలనూ ముంచేశారు
[ 05-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) నిస్తేజంగా మారాయి. కనీస నిధులు ఇవ్వకపోవడం, బకాయిల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో రైతులకు సేవలు అందలేదు. -
కొట్టుకుపోయిన కాలువ గట్టు
[ 05-07-2024]
తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాల్తేరు వద్ద పడిన గండి పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
[ 05-07-2024]
అల్లూరి పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. -
ప్రసూతి మరణాలు సంభవిస్తే చర్యలు
[ 05-07-2024]
జిల్లాలో ఒక్క ప్రసూతి మరణం సంభవించినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. -
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
[ 05-07-2024]
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి నిద్ర లేకుండా చేసి, భరతమాత విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని జేసీ శోభిక అన్నారు. -
‘వైకాపా కార్యాలయ భవనం అక్రమమే’
[ 05-07-2024]
పార్వతీపురంలోని వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమ నిర్మాణంగా భావిస్తూ రెండో నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు. -
కొండలపై రోడ్ల నిర్మాణానికి పెద్దపీట
[ 05-07-2024]
గిరిజన ప్రాంతాల్లోని మారుమూల కొండలపైనున్న గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. -
అతిసారం.. అప్రమత్తత అవసరం
[ 05-07-2024]
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం ఒకటి. దీన్ని డయేరియా అని కూడా అంటారు. పిల్లల్లో మరణాలకు ఇది ప్రధాన కారణం. -
దిగుబడులు తగ్గాయి.. ధరలు పెరిగాయి
[ 05-07-2024]
అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి. -
గిరిజన విశ్వవిద్యాలయ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు
[ 05-07-2024]
కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన కొండపోరంబోకు భూముల్లో కొందరు కంకర (గ్రావెల్)ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. -
తొమ్మిదేళ్లుగా బాలారిష్టాలు
[ 05-07-2024]
కొత్తవలసలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కల్యాణ మండపానికి బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. -
సేవలు కొనసాగించాలని నిరసన
[ 05-07-2024]
గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సవర భాషా వాలంటీర్ల సేవలు కొనసాగించాలని ఐటీడీఏ కార్యాలయం ముందు వాలంటీర్లు నిరసన తెలిపారు. -
‘అందుకే మంత్రి పదవి రాలేదేమో’
[ 05-07-2024]
కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బేబినాయన గురువారం విద్యా సామగ్రి కిట్లు పంపిణీ చేశారు. -
ఉద్యోగోన్నతులు వచ్చినా పోస్టింగులు లేవు
[ 05-07-2024]
జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 కింద ఉద్యోగోన్నతులు లభించి మూడు నెలలైనా ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకపోవడంపై ఎదురు చూపులు చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్...39 మందికి అస్వస్థత
-
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
-
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ