చేతులెత్తేసిన రాక్రీట్
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేదలకు గుంకలాం వద్ద నిర్మిస్తున్న జగనన్న కాలనీ లేఅవుట్లో థర్డ్ ఆప్షన్ కింద రాక్రీట్ సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
అసంపూర్తిగా గుంకలాం కాలనీ ఇళ్లు
ఇంకా పునాదుల్లోనే నిర్మాణాలు
ఈనాడు, విజయనగరం: విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేదలకు గుంకలాం వద్ద నిర్మిస్తున్న జగనన్న కాలనీ లేఅవుట్లో థర్డ్ ఆప్షన్ కింద రాక్రీట్ సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలోనే మూడో అతి పెద్దదైన ఈ కాలనీని నాలుగేళ్లలో పూర్తి చేయడంలో విఫలమైంది.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఈ లేఅవుట్లో 397.02 ఎకరాల్లో 12,301 ప్లాట్లు వేసి 12,149 మందికి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. వీరిలో ఆప్షన్ - 1, 2 కింద 4,420 మంది లబ్ధిదారులు, ఆప్షన్ - 3 కింద 5,761 మందికి కలిపి 1,0181 గృహాలు మంజూరు చేశారు. ఇందులో 10,139 మంది లబ్ధిదారుల వివరాలు హౌసింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేశారు. వైకాపా పెద్దల అండతో సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేని 5,097 మందివి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ ఆదేశాల మేరకు అప్పట్లో రాక్రీట్ సంస్థకు అప్పగించారు. ఆప్షన్ - 3 కింద పనులు చేపట్టిన ఈ సంస్థ ఇప్పటి వరకు ప్లింత్ భీం స్థాయిలో 4,234, పునాదుల దశలో 483, లింటల్ స్థాయిలో 13, పైకప్పు స్థాయిలో 170, స్లాబు స్థాయిలో 64 పూర్తి చేసింది. ఇంకా 133 ఇళ్ల పనులు ప్రారంభించాల్సి ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మూడున్నరేళ్లలో పనులు వేగవంతం చేయలేకపోవడం, గడువులోగా పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేయడంతో రాక్రీట్ సంస్థ తాజాగా చేతులెత్తేసింది. ఇళ్ల నిర్మాణ పనులన్నీ అసంపూర్తిగా నిలిపివేసింది.
నాణ్యతపై నోటీసులిచ్చాం
రాక్రీట్ సంస్థ నిర్మిస్తున్న కొన్ని గృహాలు నాసిరకంగా ఉన్నాయని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిందని జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ వి.శ్రీనివాస్ తెలిపారు. పనుల నాణ్యతపై విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులతో తనిఖీలు చేయించి నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. గత నెల 27న ‘గూడు పుఠాణి’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. సకాలంలో పూర్తి చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో గతంలో 664 గృహాలను ఇతర సంస్థలకు, నైపుణ్యం కలిగిన తాపీ మేస్త్రీలకు లబ్ధిదారుల అంగీకారంపై అప్పగించామని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినతులు స్వీకరించిన మంత్రి
[ 05-07-2024]
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం విజయనగరం జిల్లా పరిషత్ అతిథి గృహంలో సందర్శకులను కలిశారు. -
విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ
[ 05-07-2024]
విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించడమే సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ లక్ష్యమని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు. -
ట్యాంక్ చుట్టూ ఉన్న మురుగు తొలగించాలి
[ 05-07-2024]
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కుమ్మరిగుంట గ్రామంలో రక్షిత మంచి నీటి ట్యాంక్ చుట్టూ మురుగునీరు చేరింది. -
సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే
[ 05-07-2024]
దిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబును పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర కలిశారు. -
ధైర్యంగా వెళ్లొచ్చు.. ఇసుక తెచ్చుకోవచ్చు
[ 05-07-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు
[ 05-07-2024]
నాడు- నేడు పథకం ద్వారా బడుల రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం.. విద్యార్థులకు కష్టాలనే మిగిల్చింది. పాఠశాలల్లో అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
జగనన్న.. భూభాగోతం
[ 05-07-2024]
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట గత ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భారీగా అవినీతి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. -
సొసైటీలనూ ముంచేశారు
[ 05-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) నిస్తేజంగా మారాయి. కనీస నిధులు ఇవ్వకపోవడం, బకాయిల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో రైతులకు సేవలు అందలేదు. -
కొట్టుకుపోయిన కాలువ గట్టు
[ 05-07-2024]
తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాల్తేరు వద్ద పడిన గండి పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
[ 05-07-2024]
అల్లూరి పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. -
ప్రసూతి మరణాలు సంభవిస్తే చర్యలు
[ 05-07-2024]
జిల్లాలో ఒక్క ప్రసూతి మరణం సంభవించినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. -
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
[ 05-07-2024]
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి నిద్ర లేకుండా చేసి, భరతమాత విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని జేసీ శోభిక అన్నారు. -
‘వైకాపా కార్యాలయ భవనం అక్రమమే’
[ 05-07-2024]
పార్వతీపురంలోని వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమ నిర్మాణంగా భావిస్తూ రెండో నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు. -
కొండలపై రోడ్ల నిర్మాణానికి పెద్దపీట
[ 05-07-2024]
గిరిజన ప్రాంతాల్లోని మారుమూల కొండలపైనున్న గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. -
అతిసారం.. అప్రమత్తత అవసరం
[ 05-07-2024]
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం ఒకటి. దీన్ని డయేరియా అని కూడా అంటారు. పిల్లల్లో మరణాలకు ఇది ప్రధాన కారణం. -
దిగుబడులు తగ్గాయి.. ధరలు పెరిగాయి
[ 05-07-2024]
అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి. -
గిరిజన విశ్వవిద్యాలయ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు
[ 05-07-2024]
కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన కొండపోరంబోకు భూముల్లో కొందరు కంకర (గ్రావెల్)ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. -
తొమ్మిదేళ్లుగా బాలారిష్టాలు
[ 05-07-2024]
కొత్తవలసలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కల్యాణ మండపానికి బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. -
సేవలు కొనసాగించాలని నిరసన
[ 05-07-2024]
గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సవర భాషా వాలంటీర్ల సేవలు కొనసాగించాలని ఐటీడీఏ కార్యాలయం ముందు వాలంటీర్లు నిరసన తెలిపారు. -
‘అందుకే మంత్రి పదవి రాలేదేమో’
[ 05-07-2024]
కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బేబినాయన గురువారం విద్యా సామగ్రి కిట్లు పంపిణీ చేశారు. -
ఉద్యోగోన్నతులు వచ్చినా పోస్టింగులు లేవు
[ 05-07-2024]
జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 కింద ఉద్యోగోన్నతులు లభించి మూడు నెలలైనా ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకపోవడంపై ఎదురు చూపులు చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో 16మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
-
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
-
ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్
-
‘సింగింగ్’ చాయ్వాలా..! పాటలు పాడుతూ.. టీ చేస్తూ..
-
హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
-
నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ