మీసేవలు ఎలా ఉన్నాయ్..?
ఉమ్మడి జిల్లాలో మీసేవ కేంద్రాల నిర్వహణపై అధికారులు గడిచిన రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో కేంద్రాల తనిఖీ
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో మీసేవ కేంద్రాల నిర్వహణపై అధికారులు గడిచిన రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సేవలు అమలవుతున్న తీరు? ఏ సేవకు ఎంతెంత మొత్తం వసూలు చేస్తున్నారు? ప్రభుత్వానికి ఏ మేరకు జమ చేస్తున్నారో? పరిశీలిస్తున్నారు. సచివాలయాలు రాకముందు మీసేవ కేంద్రాల ద్వారానే ప్రజలకు సేవలందేవి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 2022 జనవరి 26 నుంచి 549 రకాల ఈ-సేవలను గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇవి క్షేత్రస్థాయిలో అందేది అంతంత మాత్రమే. విజయనగరం, పార్వతీపురం మన్యం రెండు జిల్లాల్లో చూసుకుంటే గరిష్ఠంగా 222 సేవలు అందుతున్నట్లు అధికారిక గణాంకాలు బట్టి తెలుస్తోంది. గతంలో ఉమ్మడి జిల్లాలో 593 మీసేవ కేంద్రాలుండేవి. గత అయిదేళ్లలో సుమారు 50 వరకు మూతపడినట్లు అంచనా.
సచివాలయాల్లో సేవలు తొలుత ఉచితమని తర్వాత మీసేవలు తరహాలోనే ధరలు నిర్దేశించడంతో ఆశించిన ప్రయోజనం లేకుండా పోయింది. అమలైన వాటిలో సగం దరఖాస్తులు కుల, ఆదాయ, ఓబీసీ, ధ్రువీకరణ పత్రాలవే ఉంటున్నాయి. ఆర్ఓఆర్1బి, ఆధార్ నమోదు, అప్డేట్, బయోమెట్రిక్, చరవాణి అనుసంధానం, మ్యూటేషన్ తప్పుల సవరణ, బదిలీ, కంప్యూటరైజేషన్ అడంగల్ ప్రధానమైనవి. ఇతర శాఖలకు సంబంధించి వృద్ధుల పింఛను, బియ్యం కార్డులు, విద్యుత్తు బిల్లులు చెల్లింపు వంటివి సేవలను కొందరు వినియోగించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ సేవలు గతేడాది జూన్ నుంచి అమల్లోకి తెచ్చారు. కార్యదర్శి, డిజిటల్ సహాయకులకు ఆరు నెలలు శిక్షణ ఇచ్చి మూడు విడతలుగా సేవలను అన్ని సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్టోబరులో కార్యదర్శులకు సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పిస్తూ గజిట్ ఉత్తర్వులిచ్చినా, అమలు చేసేందుకు తగిన సిబ్బంది, పరికరాలు లేవు. స్కానర్లు, ఐరిష్ మిషన్లు, డాక్యుమెంట్ స్కానర్లు లేకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. జారీ చేస్తున్న ధ్రువపత్రాల్లో తప్పులు దొర్లడంతో సరిచేసేందుకు ఎమ్మార్వో, ఆర్డీవో లాగిన్లలో చేయాలి. గతేడాది ఆగస్టులో నిర్వహించిన జగనన్న సురక్ష శిబిరాల్లో సుమారు ఆరు లక్షల మందికి కుల, ఆదాయ ధ్రువపత్రాలు ఆరు లక్షల మందికి ధ్రువపత్రాలు జారీ చేశారు. వీటిలో తప్పులు రావడంతో ఎక్కువ మంది మళ్లీ మీసేవ కేంద్రాలను ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నామని ఉమ్మడి జిల్లాల సచివాలయాల అధికారులు నిర్మలాకుమారి, రామచంద్రరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధైర్యంగా వెళ్లొచ్చు.. ఇసుక తెచ్చుకోవచ్చు
[ 05-07-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు
[ 05-07-2024]
నాడు- నేడు పథకం ద్వారా బడుల రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం.. విద్యార్థులకు కష్టాలనే మిగిల్చింది. పాఠశాలల్లో అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
జగనన్న.. భూభాగోతం
[ 05-07-2024]
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట గత ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భారీగా అవినీతి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. -
సొసైటీలనూ ముంచేశారు
[ 05-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) నిస్తేజంగా మారాయి. కనీస నిధులు ఇవ్వకపోవడం, బకాయిల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో రైతులకు సేవలు అందలేదు. -
కొట్టుకుపోయిన కాలువ గట్టు
[ 05-07-2024]
తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాల్తేరు వద్ద పడిన గండి పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
[ 05-07-2024]
అల్లూరి పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. -
ప్రసూతి మరణాలు సంభవిస్తే చర్యలు
[ 05-07-2024]
జిల్లాలో ఒక్క ప్రసూతి మరణం సంభవించినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. -
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
[ 05-07-2024]
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి నిద్ర లేకుండా చేసి, భరతమాత విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని జేసీ శోభిక అన్నారు. -
‘వైకాపా కార్యాలయ భవనం అక్రమమే’
[ 05-07-2024]
పార్వతీపురంలోని వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమ నిర్మాణంగా భావిస్తూ రెండో నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు. -
కొండలపై రోడ్ల నిర్మాణానికి పెద్దపీట
[ 05-07-2024]
గిరిజన ప్రాంతాల్లోని మారుమూల కొండలపైనున్న గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. -
అతిసారం.. అప్రమత్తత అవసరం
[ 05-07-2024]
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం ఒకటి. దీన్ని డయేరియా అని కూడా అంటారు. పిల్లల్లో మరణాలకు ఇది ప్రధాన కారణం. -
దిగుబడులు తగ్గాయి.. ధరలు పెరిగాయి
[ 05-07-2024]
అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి. -
గిరిజన విశ్వవిద్యాలయ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు
[ 05-07-2024]
కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన కొండపోరంబోకు భూముల్లో కొందరు కంకర (గ్రావెల్)ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. -
తొమ్మిదేళ్లుగా బాలారిష్టాలు
[ 05-07-2024]
కొత్తవలసలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కల్యాణ మండపానికి బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. -
సేవలు కొనసాగించాలని నిరసన
[ 05-07-2024]
గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సవర భాషా వాలంటీర్ల సేవలు కొనసాగించాలని ఐటీడీఏ కార్యాలయం ముందు వాలంటీర్లు నిరసన తెలిపారు. -
‘అందుకే మంత్రి పదవి రాలేదేమో’
[ 05-07-2024]
కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బేబినాయన గురువారం విద్యా సామగ్రి కిట్లు పంపిణీ చేశారు. -
ఉద్యోగోన్నతులు వచ్చినా పోస్టింగులు లేవు
[ 05-07-2024]
జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 కింద ఉద్యోగోన్నతులు లభించి మూడు నెలలైనా ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకపోవడంపై ఎదురు చూపులు చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్యాపింగ్ కేసులో... మరో మలుపు!
-
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
-
‘అంతా మీరే చేశారు’.. కాదు మీ వల్లే జిల్లాలో పార్టీ నాశనమైంది
-
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
-
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
-
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ