అధ్వాన రోడ్లకు త్వరలో మోక్షం
ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఒక గుంతను పూడ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రీయ రహదారుల నుంచి గ్రామీణ ప్రాంత దారుల వరకు అన్నీ అధ్వానంగా దర్శనం ఇస్తున్నాయి.
రూ.80 కోట్లతో ప్రతిపాదనలు
మరమ్మతులకు గురైన రామభద్రపురం- బొబ్బిలి రహదారి
న్యూస్టుడే, బొబ్బిలి: ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఒక గుంతను పూడ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రీయ రహదారుల నుంచి గ్రామీణ ప్రాంత దారుల వరకు అన్నీ అధ్వానంగా దర్శనం ఇస్తున్నాయి. ఈ గోతుల్లో పడి వాహన చోదకులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు అనేకం. ఇప్పుడు వాటికి మోక్షం కలిగే రోజులొచ్చాయి. రోడ్ల పరిస్థితిపై నివేదికలు ఇవ్వాలని కొత్త ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో పడ్డారు. బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలోని బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల పరిధిలో కొన్ని ముఖ్య రహదారుల మరమ్మతులకు రూ.80 కోట్లతో తాజాగా ప్రతిపాదనలు పంపారు.
మేజర్ జిల్లా రహదారులు (ఎండీఆర్) బొబ్బిలి సబ్ డివిజన్లో 35 ఉన్నాయి. వాటన్నింటికి మరమ్మతులు చేయాల్సి ఉందని ఇంజినీర్లు స్పష్టం చేశారు. వీటిలో ఉన్న 5 రాష్ట్రీయ రహదారులను పూరిస్థాయిలో ఆధునికీకరించాల్సి ఉందని పేర్కొన్నారు. వీటిలో కొన్ని రహదారుల విస్తరణ కూడా చేపట్టనున్నారు. మరికొన్ని చోట్ల కల్వర్టుల మరమ్మతులకు దస్త్రాలు సిద్ధం చేసి, నివేదించారు. అత్యవసర పనుల కింద నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రతిపాదిత పనుల్లో కొన్ని..
- తెర్లాం-బొబ్బిలి రహదారి విస్తరణ, మరమ్మతులు: రూ.30 కోట్లు
- ఆకులకట్ట- పినపెంకి రోడ్డు విస్తరణ, మరమ్మతులు: రూ.15 కోట్లు
- ఉత్తరావల్లి- లచ్చయ్యపేట (సీఆర్ఆర్) మధ్య దారి మరమ్మతులు: రూ.10 కోట్లు
- పెంట రోడ్డు విస్తరణ, మరమ్మతులు: రూ.20 కోట్లు
- ఇతర మార్గాల మరమ్మతులకు మరో రూ.10 కోట్లు నిధులు అవసరమని నివేదించారు.
కల్వర్టులపై దృష్టి
- బొబ్బిలి- పారాది మధ్య నిర్మాణానికి రూ.2.5 లక్షలు,
- బొబ్బిలి- మెట్టవలస మధ్య రూ.45 లక్షలు,
- బొబ్బిలి-తెర్లాం కల్వర్టుకు రూ.8.1 లక్షలు.
తాజా అంచనాలు పంపాం
గత ప్రభుత్వంలో రహదారుల మరమ్మతులకు నిధులు కోరుతూ అంచనాలు పంపాం. నిధులు రాలేదు. ఇప్పుడు మళ్లీ రోడ్ల దుస్థితిపై నివేదికలు ఇవ్వాలని ఉన్నతాధికారులు కోరారు. దీంతో కొత్తగా అంచనాలు వేసి, పంపాం. ఒక్క బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలో రూ.80 కోట్లకు ప్రతిపాదనలు పంపాం. ఇక్కడ రహదారులు అన్నీ పాడయ్యాయి. కల్వర్టులు కూడా శిథిలావస్థకు చేరాయి.
- అప్పలరాజు, ర.భ.శాఖ ఏఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధైర్యంగా వెళ్లొచ్చు.. ఇసుక తెచ్చుకోవచ్చు
[ 05-07-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు
[ 05-07-2024]
నాడు- నేడు పథకం ద్వారా బడుల రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం.. విద్యార్థులకు కష్టాలనే మిగిల్చింది. పాఠశాలల్లో అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
జగనన్న.. భూభాగోతం
[ 05-07-2024]
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట గత ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భారీగా అవినీతి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. -
సొసైటీలనూ ముంచేశారు
[ 05-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) నిస్తేజంగా మారాయి. కనీస నిధులు ఇవ్వకపోవడం, బకాయిల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో రైతులకు సేవలు అందలేదు. -
కొట్టుకుపోయిన కాలువ గట్టు
[ 05-07-2024]
తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాల్తేరు వద్ద పడిన గండి పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
[ 05-07-2024]
అల్లూరి పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. -
ప్రసూతి మరణాలు సంభవిస్తే చర్యలు
[ 05-07-2024]
జిల్లాలో ఒక్క ప్రసూతి మరణం సంభవించినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. -
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
[ 05-07-2024]
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి నిద్ర లేకుండా చేసి, భరతమాత విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని జేసీ శోభిక అన్నారు. -
‘వైకాపా కార్యాలయ భవనం అక్రమమే’
[ 05-07-2024]
పార్వతీపురంలోని వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమ నిర్మాణంగా భావిస్తూ రెండో నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు. -
కొండలపై రోడ్ల నిర్మాణానికి పెద్దపీట
[ 05-07-2024]
గిరిజన ప్రాంతాల్లోని మారుమూల కొండలపైనున్న గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. -
అతిసారం.. అప్రమత్తత అవసరం
[ 05-07-2024]
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం ఒకటి. దీన్ని డయేరియా అని కూడా అంటారు. పిల్లల్లో మరణాలకు ఇది ప్రధాన కారణం. -
దిగుబడులు తగ్గాయి.. ధరలు పెరిగాయి
[ 05-07-2024]
అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి. -
గిరిజన విశ్వవిద్యాలయ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు
[ 05-07-2024]
కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన కొండపోరంబోకు భూముల్లో కొందరు కంకర (గ్రావెల్)ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. -
తొమ్మిదేళ్లుగా బాలారిష్టాలు
[ 05-07-2024]
కొత్తవలసలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కల్యాణ మండపానికి బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. -
సేవలు కొనసాగించాలని నిరసన
[ 05-07-2024]
గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సవర భాషా వాలంటీర్ల సేవలు కొనసాగించాలని ఐటీడీఏ కార్యాలయం ముందు వాలంటీర్లు నిరసన తెలిపారు. -
‘అందుకే మంత్రి పదవి రాలేదేమో’
[ 05-07-2024]
కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బేబినాయన గురువారం విద్యా సామగ్రి కిట్లు పంపిణీ చేశారు. -
ఉద్యోగోన్నతులు వచ్చినా పోస్టింగులు లేవు
[ 05-07-2024]
జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 కింద ఉద్యోగోన్నతులు లభించి మూడు నెలలైనా ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకపోవడంపై ఎదురు చూపులు చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ
-
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
-
పెద్ద అంబర్పేట సమీపంలో పోలీసుల కాల్పులు