4.26 లక్షల మందికి రూ.283.59 కోట్లు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. విజయనగరం జిల్లాలో 2,81,713 మందికి రూ.186.89 కోట్లు, మన్యంలో 1,44,518 మందికి రూ.96.70 కోట్లు అందించనున్నారు.
నేడు లబ్ధిదారులకు పింఛను నగదు పంపిణీ
సీఎం సంతకంతో పింఛనుదారులకు లేఖ
విజయనగరం మయూరికూడలి, గ్రామీణం, ఉడాకాలనీ, రాజాం, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. విజయనగరం జిల్లాలో 2,81,713 మందికి రూ.186.89 కోట్లు, మన్యంలో 1,44,518 మందికి రూ.96.70 కోట్లు అందించనున్నారు. శనివారం బ్యాంకుల్లో నగదు పడగా.. ఇప్పటికే సచివాలయాల కార్యదర్శులు విత్డ్రా చేశారు. నగదుతో పాటు, రసీదు, సీఎం చంద్రబాబు నాయుడు పేరిట ఉన్న కరపత్రాన్ని ఇస్తారు. సోమవారం ఆరు గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు సచివాలయాల సిబ్బంది వెళ్లనున్నారు. పలుచోట్ల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ కల్యాణ్ చక్రవర్తి ‘న్యూస్టుడే’కు తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామని, డీఆర్డీఏ జిల్లా కేంద్ర కార్యాలయంలో కాల్ సెంటర్ పెట్టామన్నారు.
5,422 మందికి బాధ్యత
పింఛన్లకు సంబంధించిన నగదును శనివారమే ఉద్యోగులకు అందజేశారు. పుర కమిషనర్లు, ఎంపీడీవోల పర్యవేక్షణలో సచివాలయాలు, గ్రామాల్లోని వివిధ సంస్థల ఉద్యోగులు అందించనున్నారు. ఒక్కొక్కరు 50 మందికి ఇచ్చేలా మొత్తం 5,422 మందికి బాధ్యత అప్పగించారు. ప్రక్రియలో పాత పింఛను పుస్తకాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు.
పింఛన్ల పెంపు చరిత్రాత్మకం.. ఉడాకాలనీ, న్యూస్టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతుందని, మొదటి రోజే శతశాతం అందజేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులతో.. విజయనగరం వ్యవసాయ విభాగం, న్యూస్టుడే: సచివాలయాల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కలిపి 5422 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లనున్నారని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. ఒక్కొక్కరూ 50 నుంచి 60 మందికి నగదు అందజేస్తారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులు ఆరగింపు.. వైద్య కళాశాలకు గ్రహణం
[ 03-07-2024]
వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని గొప్పలు చెప్పుకొన్న వైకాపా ప్రభుత్వం వైద్య కళాశాలల నిర్మాణానికి నాబార్డు (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) మంజూరు చేసిన నిధులను మళ్లించింది. -
జేఎన్టీయూ గురజాడకు మకిలి
[ 03-07-2024]
వెంకట సుబ్బయ్య ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. చదివాడు. నేనే అతన్ని ఉపకులపతిగా ఎంపిక చేశాను. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసినప్పుడు మంచి పేరుంది. -
చేతులెత్తేసిన రాక్రీట్
[ 03-07-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేదలకు గుంకలాం వద్ద నిర్మిస్తున్న జగనన్న కాలనీ లేఅవుట్లో థర్డ్ ఆప్షన్ కింద రాక్రీట్ సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. -
మీసేవలు ఎలా ఉన్నాయ్..?
[ 03-07-2024]
ఉమ్మడి జిల్లాలో మీసేవ కేంద్రాల నిర్వహణపై అధికారులు గడిచిన రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
అధ్వాన రోడ్లకు త్వరలో మోక్షం
[ 03-07-2024]
ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఒక గుంతను పూడ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రీయ రహదారుల నుంచి గ్రామీణ ప్రాంత దారుల వరకు అన్నీ అధ్వానంగా దర్శనం ఇస్తున్నాయి. -
అశోక్ను కలిసిన సభాపతి
[ 03-07-2024]
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి మంగళవారం సాయంత్రం పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. -
లాజిస్టిక్స్ ఆదాయంలో ముందంజ
[ 03-07-2024]
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేవలం ప్రయాణికులను గమ్యస్థానానికి తరలించడమే కాకుండా, లాజిస్టిక్స్ సేవలనూ అందిస్తోంది. -
ఈఎస్ఐ సేవలు అందేదెప్పుడో?
[ 03-07-2024]
గత ప్రభుత్వం నిస్తేజంగా మార్చిన వ్యవస్థల్లో ఈఎస్ఐ విభాగం ఒకటి. ఈఎస్ఐ కార్డుదారులకు వైద్యం అందించేందుకు ఇది పనిచేస్తోంది -
విద్యుత్తు బిల్లులు ఇలా కట్టేయొచ్చు
[ 03-07-2024]
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఫోన్పే, గూగుల్పే తదితర యాప్లలో విద్యుత్తు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి -
జేఎన్టీయూ పరిధిలో 20,310 ఇంజినీరింగ్ సీట్లు
[ 03-07-2024]
ఇంజినీరింగ్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడపాలని ప్రతిపాదన
-
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్