రైతులు కోరిన విత్తనాలే ఇస్తాం
ఖరీఫ్ సీజన్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్పాల్ తెలిపారు.
జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్పాల్
ఖరీఫ్ సీజన్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్పాల్ తెలిపారు. రైతులకు కావాల్సిన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. అధిక దిగుబడులు సాధించేలా రైతులను సన్నద్ధం చేస్తున్నట్లు ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో వెల్లడించారు. ఈ ఖరీఫ్లో సన్నద్ధత వివరాలు ఆయన మాటల్లో..
న్యూస్టుడే, పార్వతీపురం పట్టణం
1.78 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో ఖరీఫ్లో 1.78 లక్షల ఎకరాల్లో వరి వేసేందుకు అనుకూలంగా ఉంది. ఈ ఏడాది 32,439 మంది రైతులకు కోరిన వరి విత్తనాలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 19,108 క్వింటాళ్లు అందజేశాం. 1064, 1121, ఆర్జీఎల్2537 (శ్రీకాకుళం సన్నాలు), సోనామసూరి 3291, ఇంద్ర 1061, స్వర్ణ 7029, సాంబమసూరి 5204, తెలంగాణ సన్నాలు 15048, ఎన్ఎల్ఆర్ 4001, నెల్లూరు మసూరి 34449, ఆర్ఎన్ఆర్ 15048, ఎంటీయు 1318 రకాలను అందుబాటులో ఉంచాం. 25,324 క్వింటాళ్ల (అపరాలు, చోడి, వేరుశనగ, వరి) విత్తనాలు 90 శాతం రాయితీపై గిరిజనులకు అందించేలా ఆర్బీకేల్లో సిద్ధం చేశాం.
11 మందికి డ్రోన్ శిక్షణ
జిల్లాలో ఆధునిక వ్యవసాయ విధానం అభివృద్ధి చేసేందుకు 11 మందికి డ్రోన్ శిక్షణ ఇప్పించాం. పెద్ద పరిమాణంలో ఉన్న డ్రోన్లు తెప్పించే క్రమంలో కొంత జాప్యం జరిగింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రైతులకు గతంలో రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించేవారు. కొన్నాళ్లుగా అవి మంజూరు కాలేదు. డిమాండు మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం.
42 వేల టన్నుల ఎరువులు
ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాం. 45,277 టన్నుల ఎరువులు రావాల్సి ఉండగా గత నెల నుంచే ఆర్బీకేలకు తరలిస్తున్నాం. మార్క్ఫెడ్ గోదాముల్లో అన్ని రకాల ఎరువులు నిల్వ చేశాం. ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా 19,549 టన్నులు పంపిణీ చేపట్టాం. ప్రస్తుతం మరో 15,466 టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.
భూసార పరీక్షలు
ఖరీఫ్ సాగు సన్నద్ధతపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సాగు పద్ధతులు, అధిక దిగుబడి సాధించే విధానాలు, చీడపీడల నిర్మూలన, ఎరువులు, యంత్రాల వినియోగం, ప్రభుత్వ రాయితీ పథకాల గురించి రైతులకు తెలియజేస్తున్నాం. రైతులకు మేలు చేసేలా భూసార పరీక్షలు చేస్తున్నాం. 2024-25 ఏడాదికి సంబంధించి 12,800 నమూనాలు పరీక్షించాల్సి ఉండగా ఇప్పటి వరకు 8,407 నమూనాలు విశాఖ ల్యాబ్కు పంపించాం.
నకిలీలకు ముకుతాడు
నకిలీ విత్తనాలతో ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే ఆలోచనతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. విత్తన పరీక్షలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. 2024-25 ఏడాదికి సంబంధించి అగ్రిల్యాబ్ల్లో విత్తన నాణ్యత పరీక్షలు చేస్తున్నాం. ఆర్బీకేల ద్వారా 205 శాంపిళ్లు పరీక్షించాం. ఇతర ప్రాంతాల నుంచి 29, రైతుల నుంచి 14 శాంపిళ్లు అందాయి. వాటిని పరీక్షించాల్సి ఉంది.
ఆకుమడులు సిద్ధం
ప్రస్తుతం పడుతున్న వర్షాలు ఖరీఫ్ సీజన్కు ఎంతో మేలు చేస్తాయి. ఇప్పటికే పాచిపెంట, సాలూరు, పార్వతీపురం, భామిని తదితర మండలాల్లో ఆకుమడులు సిద్ధం చేశారు. భూమిలో వేడి ఎక్కువగా ఉన్నందున మొలకలు రావడం లేదు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు సిద్ధం అవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4.26 లక్షల మందికి రూ.283.59 కోట్లు
[ 01-07-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. విజయనగరం జిల్లాలో 2,81,713 మందికి రూ.186.89 కోట్లు, మన్యంలో 1,44,518 మందికి రూ.96.70 కోట్లు అందించనున్నారు. -
పంచాయతీలకు ఊపిరి
[ 01-07-2024]
వైకాపా పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. నిధుల లేమితో పల్లెల్లో సమస్యలు రాజ్యమేలాయి. సుపరిపాలనకు దూరమయ్యాయి. పంచాయతీ పాలకవర్గ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయి. -
డిగ్రీ కళాశాలల్లో క్రీడల్లేవ్
[ 01-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏళ్లు గడుస్తున్నా విద్యార్థులకు వ్యాయామ విద్య అందని ద్రాక్షగా మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతకు వ్యాయామ విద్య ఆవశ్యకత ఎంతైనా ఉంది. -
విద్యాసంస్థల్లో వ్యాపారానికి ముకుతాడు
[ 01-07-2024]
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పుస్తక వ్యాపారానికి కొత్త ప్రభుత్వం ముకుతాడు వేసింది. వీరి దోపిడీకి తెరదించుతూ కొరడా ఝుళిపిస్తోంది. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.