ప్రాజెక్టులకు భూసేకరణ
జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు.
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో సాగునీటి ప్రాజెక్టులు, భోగాపురం విమానాశ్రయం, జాతీయ రహదారులు, రైల్వేలైన్ల పనులపై సమీక్షించారు. నిధులు లేకపోవడంతో కొన్నిచోట్ల భూసేకరణ ఆగిపోయిందని నీటి పారుదల శాఖ అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. మంజూరు చేయాలని కోరుతూ సంబంధిత కార్యదర్శికి లేఖ రాస్తానని కలెక్టర్ చెప్పారు. కొన్నిచోట్ల భూసమస్యలు ఉన్నాయని అధికారులు చెప్పగా, రైతులతో మాట్లాడి పరిష్కరించేలా చూడాలని జేసీ కార్తీక్, ఆర్డీవో శశికళను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయం రన్వే, అప్రోచ్ రోడ్డు పనులు పురోభివృద్ధిలో ఉన్నాయని, ఆర్అండ్ఆర్ సమస్యల్లేవని ఆర్డీవో వివరించారు. రైల్వేకు అవసరమైన భూమిని సేకరించి, చెల్లింపుల కోసం నిధులు కోరుతూ ఉన్నతాధికారులు లేఖలు రాయాలని కలెక్టర్ తెలిపారు. పెదమానాపురం, పురిటిపెంట, కోమటిపల్లి తదితర గ్రామాల వద్ద భూములు అవసరమని రైల్వే అధికారులు ప్రస్తావించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎస్.డి.అనిత, ఉప కలెక్టర్లు ప్రమీల, మురళీ, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4.26 లక్షల మందికి రూ.283.59 కోట్లు
[ 01-07-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. విజయనగరం జిల్లాలో 2,81,713 మందికి రూ.186.89 కోట్లు, మన్యంలో 1,44,518 మందికి రూ.96.70 కోట్లు అందించనున్నారు. -
పంచాయతీలకు ఊపిరి
[ 01-07-2024]
వైకాపా పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. నిధుల లేమితో పల్లెల్లో సమస్యలు రాజ్యమేలాయి. సుపరిపాలనకు దూరమయ్యాయి. పంచాయతీ పాలకవర్గ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయి. -
డిగ్రీ కళాశాలల్లో క్రీడల్లేవ్
[ 01-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏళ్లు గడుస్తున్నా విద్యార్థులకు వ్యాయామ విద్య అందని ద్రాక్షగా మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతకు వ్యాయామ విద్య ఆవశ్యకత ఎంతైనా ఉంది. -
విద్యాసంస్థల్లో వ్యాపారానికి ముకుతాడు
[ 01-07-2024]
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పుస్తక వ్యాపారానికి కొత్త ప్రభుత్వం ముకుతాడు వేసింది. వీరి దోపిడీకి తెరదించుతూ కొరడా ఝుళిపిస్తోంది. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.