నిధులివ్వకుండా .. ఆడిట్టా?
గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు శాఖావర్గాలు పేర్కొంటున్నాయి.
ఆడిట్ నిర్వహిస్తున్న సభ్యులు
ఉమ్మడి జిల్లాలో పాఠశాలలకు కాంపోజిట్ నిధులు ఇవ్వకుండా ఆడిట్ నిర్వహించడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారంతా ఆడిట్ నిమిత్తం జిల్లా కేంద్రాల్లో మండల వనరుల కేంద్రానికి రావాల్సి వస్తోంది. మంగళవారం విజయనగరం ఎమ్మార్సీలో గంట్యాడ, డెంకాడ, ఎస్.కోట, ఎల్.కోట, గజపతినగరం మండలాల్లోని పాఠశాలలకు సంబంధించి ఆడిట్ నిర్వహించారు.
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు శాఖావర్గాలు పేర్కొంటున్నాయి. ఉపాధ్యాయులు తీసుకొస్తున్న నగదు పుస్తకం, బ్యాంకు స్టేట్మెంట్, ప్రభుత్వం నిధులపై ఇచ్చిన నమూనాలో జీరో నిల్వలే ఉన్నాయి. ఆడిట్ బృందం వాటికి సంబంధించిన ఒక సెట్ను తీసుకుని, రెండో సెట్పై ఆడిట్ చేసినట్లుగా సంతకం చేసి, స్టాంప్ వేసి ఇస్తున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దీని వల్ల బోధన సమయం వృథా తప్పా ఒరిగిందేమీ లేదని చెబుతున్నారు.
గతేడాదిలో నిలిపివేత
ఉమ్మడి జిల్లాలో 2,760 పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో బోధనకు అవసరమైన సామగ్రి, గ్రంథాలయం, ప్రయోగశాల, స్టేషనరీ విద్యుత్తు, పరీక్షల నిర్వహణకు ఏటా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా విద్యార్థుల సంఖ్యను బట్టి గ్రాంట్లు మంజూరవుతాయి. రూ.10 వేల నుంచి లక్ష రూపాయిల వరకు కేటాయిస్తారు. ఈ నిధులు తెదేపా ప్రభుత్వంలో ఏకకాలంలో విడుదలయ్యేవి. ఆలస్యమైనా ఉపాధ్యాయులు ఖర్చు చేసిన వాటికి బిల్లులు పెట్టుకునేవారు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేకపోవడంతో సొంత డబ్బులు పెట్టుకున్నారు. కొందరు అప్పులు చేసి ఖర్చు చేశారు. 2021-22లో రూ.6.94 కోట్లు నిధులు కేటాయించారు. కొన్ని పాఠశాలలకు సాంకేతిక, ఇతరత్రా కారణాలతో నేటికీ నిధులు రాని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. 2022-23లో రూ.7.5 కోట్లకు 32.53 శాతమే నిధులు విడుదలయ్యాయి. 2023-24లో పైసా కూడా రాలేదు. దీంతో ప్రధానోపాధ్యాయులు సుద్దముక్కలు, రిజిస్టర్లు, డస్టర్లు ఇతర సామగ్రి కొనుగోలుకు జేబులో డబ్బులు పెట్టుకోవాల్సి వస్తోంది. గడిచిన విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడులకు విద్యుత్తు బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. పాఠశాలలకిచ్చే కాంపోజిట్ గ్రాంట్లతో గతంలో ఈ బిల్లులు చెల్లించేవారు. గత విద్యా సంవత్సరంలో ఈ నిధులు పూర్తిగా నిలిచిపోవడంతో అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రస్థాయిలో నేరుగా విద్యుత్తు బిల్లులు చెల్లిస్తామని ప్రకటించడంతో కొందరు కట్టని పరిస్థితి ఉంది. సగటున ప్రాథమిక పాఠశాలకు రూ.500, యూపీకి రూ.1,500, ఉన్నత పాఠశాలలకు రూ.2 వేలు విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. నాడు - నేడు పనులతో బడుల్లో ఫ్యాన్లు, ఇంటరాక్టివ్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీల ఏర్పాటుతో వినియోగం గతం కన్నా అధికమైనట్లు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంఎస్ఎంఈ పార్కుకు అడుగులు
[ 29-06-2024]
ఎన్నాళ్ల నుంచో శృంగవరపుకోట ప్రాంతంలో అదిగో ఇదిగో జిందాల్ పరిశ్రమ ఏర్పాటవుతుందని ఊరిస్తున్నారు. -
అధికార అండ.. కరిగింది కొండ
[ 29-06-2024]
ఒక వైపు సముద్ర తీరం.. మరోవైపు కొబ్బరి, మామిడి, జీడిమామిడి తోటలు.. వాటి చుట్టూ అందమైన పచ్చని కొండలు.. పిల్లగాలులతో ఆహ్లాదకర వాతావరణం. -
రైతులు కోరిన విత్తనాలే ఇస్తాం
[ 29-06-2024]
ఖరీఫ్ సీజన్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్పాల్ తెలిపారు. -
ప్రాజెక్టులకు భూసేకరణ
[ 29-06-2024]
జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. -
వైకాపా కార్యాలయంలపై శ్రద్ధ.. ప్రజా భవనాలపై అశ్రద్ధ?
[ 29-06-2024]
గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవను వదిలి సొంత కార్యక్రమాలపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలను ప్రారంభించింది. -
ప్రక్షాళన ప్రారంభం
[ 29-06-2024]
సహకార రంగంలో ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. ప్రస్తుతమున్న కమిటీల స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కదిలారు
[ 29-06-2024]
విజయనగరం రాజీవ్నగర్ కాలనీ మొదటిలైన్లో ఉన్న మాన్సాస్ స్థలంలో వైకాపా నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాన్ని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు శుక్రవారం తొలగించారు. -
కోరలు చాస్తూ.. ప్రాణాలు తీస్తున్నాయ్!!
[ 29-06-2024]
గుర్ల మండలం గుజ్జంగివలసకు చెందిన లక్ష్మి(58) కిరాణా దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. -
ప్రయోగాల వేదికపై ప్రశంసలు
[ 29-06-2024]
జాతీయస్థాయి భౌతికశాస్త్ర కార్యశాల వేదికపై జిల్లాకు చెందిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు జోగా చంద్రశేఖర్ ప్రశంసలు దక్కించు కున్నారు. -
కలెక్టర్కు ఏపీజీఈఏ శుభాకాంక్షలు
[ 29-06-2024]
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అంబేడ్కర్ను శుక్రవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరమణ ఆధ్వర్యంలో నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM