Andhra News: సినీఫక్కీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అపహరణ
తెర్లాం మండలం కునాయవలసకు చెందిన తెర్లి ఈశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈయన శుక్రవారం ఉదయపు నడక కోసం గ్రామ శివారులోని రాయిపల్లివారి చెరువు వద్దకు వచ్చారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు
పోలీసులకు వివరాలు చెబుతున్న బాధితుడు ఈశ్వరరావు
‘మీ ఇంటికి ఫోన్ చేసి రూ.50 లక్షలు తెమ్మని చెప్పాలంటూ తీవ్రంగా కొట్టారు. సొమ్ము తేకుంటే మా పెద్ద సారుకు అప్పగిస్తామని, ఆయన నీ శరీర అవయవాలు అమ్మేస్తాడని భయపెట్టారు.’ ఇంతలో ఉద్యోగి కేకలు వేయడంతో స్థానికులు విని దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎస్.కోటలో చోటుచేసుకుంది.
శృంగవరపుకోట, తెర్లాం, న్యూస్టుడే తెర్లాం మండలం కునాయవలసకు చెందిన తెర్లి ఈశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈయన శుక్రవారం ఉదయపు నడక కోసం గ్రామ శివారులోని రాయిపల్లివారి చెరువు వద్దకు వచ్చారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి కారు ఆగిపోయింది, సహకరించాలని కోరగా వెనుక నుంచి కారు నెడుతున్న ఈశ్వరరావుపై కర్రతో దాడి చేసి, కాళ్లు, చేతులు కట్టేశారు. నలుగురిలో ఒకరు అక్కడ ఉండిపోయి ముగ్గురు వ్యక్తులు అదే కారులో ఎస్.కోట మండలం ధర్మవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణం పక్కన ఉన్న వాటర్ ప్లాంటు వద్దకు తీసుకొచ్చారు. లోపలికి ఈశ్వరరావును తీసుకెళ్తుండగా రక్షించండంటూ కేకలు వేశాడు. స్థానికులు చేరుకుని ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఒకరు పరారయ్యాడు. పారిపోయిన వ్యక్తి వాటర్ ప్లాంటు నిర్వహిస్తున్న ఎస్.కోట మండలం రేవళ్లపాలేనికి చెందిన రాజశేఖర్గా, పట్టుబడిన వారు ఇతని వద్ద వాహన చోదకులు రేవళ్లపాలేనికి చెందిన గేదెల సత్యనారాయణ, ఎస్.కోటకు చెందిన అంబటి మోహనరావుగా గుర్తించామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.
అపహరణకు వినియోగించిన కారు
డబ్బుల కోసమే...
కునాయవలసలో తన ఇంటికి సమీపంలో ఉంటున్న కరుణాకర్ స్నేహితులతో కలసి డబ్బుల కోసమే ఈ పథకం పన్నాడని బాధితుడు చెప్పినట్లు ఎస్సై తెలిపారు. తీవ్ర గాయాలైన ఈశ్వరరావును ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స చేయించగా వైద్యులు విజయనగరం రిఫర్ చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఘటన తెర్లాం పోలీసు స్టేషను పరిధిలో జరగడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడికి కేసు బదిలీ చేయాలా, లేక ఇక్కడే దర్యాప్తు చేయాలా అన్నది నిర్ణయిస్తామని ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంఎస్ఎంఈ పార్కుకు అడుగులు
[ 29-06-2024]
ఎన్నాళ్ల నుంచో శృంగవరపుకోట ప్రాంతంలో అదిగో ఇదిగో జిందాల్ పరిశ్రమ ఏర్పాటవుతుందని ఊరిస్తున్నారు. -
అధికార అండ.. కరిగింది కొండ
[ 29-06-2024]
ఒక వైపు సముద్ర తీరం.. మరోవైపు కొబ్బరి, మామిడి, జీడిమామిడి తోటలు.. వాటి చుట్టూ అందమైన పచ్చని కొండలు.. పిల్లగాలులతో ఆహ్లాదకర వాతావరణం. -
రైతులు కోరిన విత్తనాలే ఇస్తాం
[ 29-06-2024]
ఖరీఫ్ సీజన్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్పాల్ తెలిపారు. -
ప్రాజెక్టులకు భూసేకరణ
[ 29-06-2024]
జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. -
వైకాపా కార్యాలయంలపై శ్రద్ధ.. ప్రజా భవనాలపై అశ్రద్ధ?
[ 29-06-2024]
గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవను వదిలి సొంత కార్యక్రమాలపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలను ప్రారంభించింది. -
ప్రక్షాళన ప్రారంభం
[ 29-06-2024]
సహకార రంగంలో ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. ప్రస్తుతమున్న కమిటీల స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కదిలారు
[ 29-06-2024]
విజయనగరం రాజీవ్నగర్ కాలనీ మొదటిలైన్లో ఉన్న మాన్సాస్ స్థలంలో వైకాపా నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాన్ని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు శుక్రవారం తొలగించారు. -
కోరలు చాస్తూ.. ప్రాణాలు తీస్తున్నాయ్!!
[ 29-06-2024]
గుర్ల మండలం గుజ్జంగివలసకు చెందిన లక్ష్మి(58) కిరాణా దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. -
ప్రయోగాల వేదికపై ప్రశంసలు
[ 29-06-2024]
జాతీయస్థాయి భౌతికశాస్త్ర కార్యశాల వేదికపై జిల్లాకు చెందిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు జోగా చంద్రశేఖర్ ప్రశంసలు దక్కించు కున్నారు. -
కలెక్టర్కు ఏపీజీఈఏ శుభాకాంక్షలు
[ 29-06-2024]
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అంబేడ్కర్ను శుక్రవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరమణ ఆధ్వర్యంలో నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’.. భాజపా పోస్ట్ వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
హరిహర వీరమల్లు.. పవన్ షూటింగ్ పార్ట్ ఎన్ని రోజులంటే?
-
మ్యాచ్ను ‘బ్రాడ్కాస్టింగ్’ గెలిపించదు కదా..: మైకెల్ వాన్కు గంగూలీ కౌంటర్
-
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల లేటెస్ట్ ధరలు ఇవే..
-
ఏఐ వాయిస్తో లేడీ మాయ.. మహిళ నుంచి రూ.6 లక్షలు దోపిడీ