Vizianagaram: వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
ప్రస్తుత వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రభుత్వ శాఖలు నిరంతరం అప్రమత్తంగా వుంటూ జిల్లాలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా అధికారులను ఆదేశించారు.
విజయనగరం గ్రామీణం: ప్రస్తుత వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రభుత్వ శాఖలు నిరంతరం అప్రమత్తంగా వుంటూ జిల్లాలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా అధికారులను ఆదేశించారు. కాలానుగుణ వ్యాధుల నియంత్రణపై బుధవారం మంత్రి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వర్షాకాలంలో జనావాసాల మధ్య నీటి నిల్వలు లేకుండా చూడటం, తాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు చేపట్టడం, నీటి వనరులు క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయడం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి చర్యలపై దృష్టి సారించి వ్యాధుల నియంత్రణకు సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలన్నారు.
సమావేశంలో ఆర్.డి.ఓ.లు బి.శాంతి, ఎం.వి.సూర్యకళ, ఇన్ఛార్జి ఆర్.డి.ఓ.మురళీకృష్ణ, జి.జి.హెచ్. సూపరింటెండెంట్ డా.ఎస్.అప్పల నాయుడు, డి.సి.హెచ్.ఎస్. డా.గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా మదిలో మీరు.. మీ స్ఫూర్తికి జోహారు
[ 28-06-2024]
‘భారతీయ పత్రికా రంగాన్ని మలుపుతిప్పిన ప్రజ్ఞాశాలి.. సినీరంగంలో తనదైన శైలిలో అద్భుతాలను ఆవిష్కరించిన ఘనాపాఠి.. ప్రపంచమే గర్వించే స్థాయిలో అతిపెద్ద సినీ స్టూడియో నిర్మించిన దార్శనికుడు.. పారిశ్రామిక రంగంలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్లిన విజేత.. కలం బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పి.. ప్రజా సమస్యల పరిష్కారానికి వెన్నుదన్నుగా నిలిచిన ధీశాలి.. రామోజీరావు.’.. అంటూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కొనియాడారు. -
వినిపించలేదు.. కనిపించలేదు
[ 28-06-2024]
తోటపల్లి జలాశయం నుంచి ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సంబంధించి నీటి విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. చివరి ఆయకట్టు వరకు జలాలు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది. -
కాల్వలకు మోక్షం.. కర్షకులకు సుభిక్షం
[ 28-06-2024]
పంట కాలువలకు మోక్షం కలగనుంది. ప్రస్తుత ఖరీఫ్లోనే పనులు చేసేందుకు ప్రతిపాదనలు యుద్ధప్రాతిపదికన ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇంజినీర్లు సమాయత్తమయ్యారు. -
విమానాశ్రయ అభివృద్ధికి తొలి అడుగు
[ 28-06-2024]
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావడం అభినందనీయమని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. -
అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవు
[ 28-06-2024]
వైకాపా హయాంలో జిల్లా కార్యాలయాల పేరుతో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇదే ఆ పార్టీ విధానమని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. -
ప్రతి ఎకరాకూ సాగునీరు
[ 28-06-2024]
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టుకూ నీరందించే ప్రణాళికతో ముందుకెళ్లాలని జల నవరుల శాఖ అధికారులను కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. -
కొలంబో, దుబాయ్లకు విమాన సేవల పునరుద్ధరణకు వినతి
[ 28-06-2024]
విశాఖపట్నం నుంచి కొలంబో, దుబాయ్లకు విమాన సర్వీసులను పునరుద్ధరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుకు విజ్ఞప్తి చేశారు. -
పింఛను.. ఇంటికొస్తోంది!!
[ 28-06-2024]
వచ్చే నెల నుంచి పింఛను నగదు లబ్ధిదారుల ఇంటికే చేరనుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జులై 1న సోమవారం ఉదయమే పూర్తిస్థాయిలో పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఆ ఫోన్కాల్స్పై అప్రమత్తత అవసరం
[ 28-06-2024]
కొన్ని కొరియర్ సర్వీసుల పేర్లతో వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దీపిక ఎం.పాటిల్ కోరారు. -
గిరిజనుల గుండెల్లో గోస్తనీ గుబులు
[ 28-06-2024]
వంతెన సౌకర్యం లేక గంట్యాడ మండలం దిగువ కొండపర్తి పంచాయతీ పరిధిలోని గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. -
ఎడ్సెట్లో మెరుపులు
[ 28-06-2024]
ఎడ్సెట్-24 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జీవశాస్త్రంలో విజయనగరానికి చెందిన ఇంజమూరి వెంకటసాయి మణికంఠ రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించాడు. -
అక్షరయోధునికి నివాళి
[ 28-06-2024]
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి తీరని లోటని ప్రముఖ చిత్రకారుడు పూర్ణారావు అన్నారు. -
కక్షతో చంపేంత పనిచేశారు
[ 28-06-2024]
శ్రీకాకుళం జిల్లా గుజరాతీపేటకు చెందిన గౌతమ్పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘పథకాల పేరుతో జగన్ మోసం చేశారు’
[ 28-06-2024]
అక్కచెల్లెమ్మలను ఆదుకుంటామని చెప్పి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేయూత పథకం లబ్ధిదారులను మోసం చేశారని పలువురు మహిళలు వాపోయారు. -
26.90 మి.మీ. సరాసరి వర్షపాతం నమోదు
[ 28-06-2024]
అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ సాగులో మరో ముందడుగు పడింది.
తాజా వార్తలు (Latest News)
-
భూ కుంభకోణం కేసులో బెయిల్.. హేమంత్ సోరెన్ విడుదల
-
ఫీల్డింగ్ మెడల్ ఎవరికి?ఎవరిచ్చారంటే?
-
షాద్నగర్లోని పరిశ్రమలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం
-
ఒక సీఎంకు 986 మందితో భద్రతా?: చంద్రబాబు ఆశ్చర్యం
-
రైతులు, ఉద్యోగుల కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటా: సోమిరెడ్డి
-
నాన్న చనిపోయాడని కట్టుకథ.. అమెరికాలో భారత విద్యార్థి బహిష్కరణ