గిరి ప్రదక్షిణ భక్తులకు.. సౌకర్యవంతంగా ఏర్పాట్లు
ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యే సింహగిరి ప్రదక్షిణకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు.
దేవస్థానం అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్
న్యూస్టుడే, సింహాచలం: ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యే సింహగిరి ప్రదక్షిణకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, జేసీ మయూర్ అశోక్తో కలిసి సింహాచలం తొలిపావంచా వద్ద ఏర్పాట్లపై సమీక్షించారు. సింహాచలం దేవస్థానం ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు గిరిప్రదక్షిణ రూట్మ్యాప్పై కలెక్టర్కు వివరించారు. తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఆ ప్రదేశంలో ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు మరమ్మతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు దీపాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, సముద్ర స్నానాలు చేసే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు వంటివి జీవీఎంసీ నిర్వహించాలని; భక్తులకు సాఫీగా దర్శనాలు కలిగేలా చూడాలని దేవస్థానం అధికారులకు సూచించారు. అనంతరం అడివివరం, సింహగిరి రెండో ఘాట్రోడ్డు, లుంబినీ పార్కు, సీతమ్మధార, తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ వి.సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణంరాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేశ్కుమార్, డీడీహెచ్ దామోదర్, ఎస్ఈలు రవి, వినయ్కుమార్, రామ్మోహనరావు, వేణుగోపాల్, జెడ్సీలు శైలజవల్లి, విజయలక్ష్మీ, హేమావతి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరంలో కిడ్నీ ముఠాలు
[ 07-07-2024]
పేదల ఆర్థిక అవసరాల బలహీనతను ఆసరాగా చేసుకుని కిడ్నీలు కొట్టేసే ముఠాలు నగరంలో పాగా వేశాయి. ఈ ముఠాలతో వైద్య రంగంలోని కొందరు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ఉచిత ఇసుకతో ఊరట!
[ 07-07-2024]
కూటమి ప్రభుత్వం ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనుంది. దీంతో మరో ఎన్నికల హామీని అమలు చేసినట్లే. -
జిల్లా ఖజానా కార్యాలయంలో సంచాలకుల విచారణ
[ 07-07-2024]
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లా ఖజానా శాఖ పనితీరుపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై ఆశాఖ సంచాలకులు ఎన్.మోహన్రావు శనివారం విచారణ జరిపారు. -
ఉచిత ఇసుక పంపిణీకి చర్యలు: కలెక్టర్
[ 07-07-2024]
ఈనెల 8 నుంచి చేపట్టే ఉచిత ఇసుక పంపిణీకి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. -
సీఎం రమేశ్పై దాడి కేసులో బాధ్యులను శిక్షించాలి
[ 07-07-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం రమేశ్పై దాడికి పాల్పడిన కేసులో బాధ్యులను శిక్షించాలని సినీ నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ డిమాండ్ చేశారు. -
మీ సేవకుడిగా పనిచేస్తా: సీఎం రమేశ్
[ 07-07-2024]
తనను ఎంతో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన మీకు సేవకుడిలా పనిచేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. -
ముఖ్యమంత్రి మాటలు బేఖాతరు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు వ్యవహరించినట్టు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించొద్దు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సాధారణ వ్యక్తుల్లాగే వెళ్లండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నా కూటమి నాయకులు ఆయన మాటలను పెడచెవిన పెడుతున్నారు -
నిర్వాసితులకు ఉపాధిపై దృష్టి
[ 07-07-2024]
హోం మంత్రి అనితను జిల్లా నూతన కలెక్టర్ విజయ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని మంత్రి నివాసంలో ఆమెను కలిసి మొక్క అందించారు. -
ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తాం
[ 07-07-2024]
ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. శనివారం నిర్వహించిన కూటమి సమావేశంలో ఆయన మాట్లాడారు -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
ఓటీటీలో ఫహద్ ఫాజిల్ ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?