పాఠశాల ఆటోలు భద్రంసుమా!
ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని తీసుకువెళ్తున్న ఆటోలు కూడా వాహనచట్టం ప్రకారం నిబంధనలు పాటించాలి. అటువంటి ఆటోల వివరాలను సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు ముందుగా నమోదు చేసుకోవాలి.
పాఠశాల ఆటోను తనిఖీ చేస్తున్న రవాణాశాఖ అధికారి (పాతచిత్రం)
ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని తీసుకువెళ్తున్న ఆటోలు కూడా వాహనచట్టం ప్రకారం నిబంధనలు పాటించాలి. అటువంటి ఆటోల వివరాలను సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు ముందుగా నమోదు చేసుకోవాలి. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఆటోల్లో ప్రయాణించే విద్యార్థులు, డ్రైవర్ చిరునామాతో పాటు, పూర్తి వివరాలను యాజమాన్యాలు తప్పక కలిగి ఉండాలి.
మాధవధార, న్యూస్టుడే: నగరంలో మొత్తం 200లకు పైగా ప్రైవేటు పాఠశాలలకు వివిధ ప్రాంతాల నుంచి 4వేల ఆటోల్లో దాదాపుగా 15 వేల మంది విద్యార్థులు ప్రతి రోజు ప్రయాణిస్తున్నట్లుగా రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇటువంటి ఆటోలు చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లుగా రవాణా, పోలీస్ శాఖ అధికారులు గుర్తించారు.
పాఠశాల ఆటోకు ఉండవలసిన నిబంధనలు ఇవీ..
- రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోలకు ముందు, వెనుక ‘పాఠశాల ఆటో’ అని బోర్డు రాయాలి.
- పన్నెండేళ్ల లోపు పిల్లలైతే ఆరుగురిని, ఎనిమిది నుంచి పదేళ్లలోపు పిల్లలైతే ఎనిమిది మందికి మించి తీసుకువెళ్లకూడదు. ఒకవేళ ఆటో తక్కువకు వస్తోందని ఎక్కువ మందిని తీసుకెళ్తామంటే తల్లిదండ్రులు ప్రోత్సహించకూడదు.
- ఆటోకు రెండు వైపులా పిల్లలు చేతులు బయటకు పెట్టకుండా గ్రిల్స్ను ఏర్పాటు చేయాలి.
- ఆటోలకు ఇష్టానుసారంగా పిల్లల బ్యాగులు వేలాడదీయకూడదు.
- ఆటో ఫిట్నెస్ కలిగి ఉండి, పన్నులు సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి.
- ఆటోకు పోలీస్ శాఖ కేటాయించిన నంబర్ తప్పనిసరి.
- ఆటో డ్రైవర్ లైసెన్స్, బ్యాడ్జీ కలిగి ఉండాలి. యూనిఫాం ధరించాలి.
- కనీసం మూడేళ్ల నుంచి ఆటో నడుపుతూ ఉండాలి.
- ఏ ఏ పాఠశాలలకు ఏ మార్గంలో పిల్లలను తీసుకుని వెళ్తున్నారనే విషయాల్ని ఆటోలోని బోర్డులో ప్రదర్శించాలి.
- ఏ కారణం చేతనైనా ఒక వేళ డ్రైవర్ రాకపోతే మరో డ్రైవర్ను పంపించినప్పుడు, అతని వ్యక్తిగత వివరాలను తల్లిదండ్రులకు, యాజమాన్యానికి తెలియజేయాలి.
- డ్రైవర్ ఫోన్ నెంబర్, లైసెన్సు నెంబర్, వ్యక్తిగత వివరాలు ఆటోలో ఉండేటట్లుగా బోర్డును ఏర్పాటు చేయాలి.
తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఇలా చేయండి
- ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాలలకు మాత్రమే ఆటోలో పిల్లలను పంపించాలి.
- పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు కలిసి తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.
- డ్రైవర్ చిరునామా, కుటుంబ నేపథ్యం, గతంలో ప్రమాదాలు చేసిన సంఘటనలు ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలి.
- పాఠశాల యాజమాన్యం నెలకోసారి ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేయాలి. నిబంధనలపై అవగాహన కల్పించేలా రవాణా, పోలీస్ శాఖలకు వారి వివరాలను తెలియజేయాలి.
పాఠశాల ఆటోలపై కేసుల నమోదు
నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న పాఠశాల ఆటోలపై నిరంతరం నిఘాను ఏర్పాటు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. గత ఏడాది నుంచి పిల్లలను తీసుకువెళ్తున్న ఆటోలకు సంబంధించిన పూర్తి వివరాలను పాఠశాలల యాజమాన్యం తప్పసరిగా నమోదు చేయాలని ఉత్తర్వులు ఇచ్చాం. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, కమిటీని ఏర్పాటు చేసుకుని ఆటోలను నియమించుకోవాలని సూచించాం. ఈ మేరకు ప్రతి పాఠశాలకు నోటీసులు కూడా జారీ చేశాం. గత వారం రోజుల నుంచి ఆటోలపై 25 కేసులు నమోదు చేసి, ఒక ఆటోను సీజ్ చేశాం.
జి.సి.రాజారత్నం, డీటీఓ, విశాఖ జిల్లా.
పాఠశాల ఆటోలపై ప్రతి ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండే ఆటోలపై కేసులు నమోదు చేస్తారు. గత రెండేళ్లలో కేసుల నమోదు ఇలా...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
[ 07-07-2024]
వరకట్న వేధింపులతో ఇటీవల మృతి చెందిన ఎం.పద్మిని(25) తన భర్త చేతిలో అనుభవించిన చిత్రహింసలు వర్ణనాతీతం. గాజువాక సనత్నగర్కు చెందిన సోమేశ్కు 2018లో అనకాపల్లికి చెందిన పద్మినితో పెద్దల సమక్షంలో వివాహమైంది -
చిప్పాడలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 07-07-2024]
భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ నమ్మివానిపాలెం వద్ద దాదాపు రూ.5 కోట్ల విలువైన 1.94 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది -
విశాఖను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
[ 07-07-2024]
విశాఖ జిల్లాను మాదకద్రవ్యాలు, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దటానికి విస్తృత చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు అన్నారు -
‘బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు మరో బీచ్ పరిశీలన!
[ 07-07-2024]
బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు విశాఖలో మరో బీచ్ను అధికారులు పరిశీలించారు. ఇప్పటికే రుషికొండ బీచ్కు ఈ గుర్తింపు ఉంది. ఫలితంగా దేశ, విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. -
ఘనంగా వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
[ 07-07-2024]
అల్లిపురం దరి శ్రీలక్ష్మీ వారాహి సహిత రాజశ్యామల అమ్మవారి ఆలయంలో శనివారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి -
నగరంలో కిడ్నీ ముఠాలు
[ 07-07-2024]
పేదల ఆర్థిక అవసరాల బలహీనతను ఆసరాగా చేసుకుని కిడ్నీలు కొట్టేసే ముఠాలు నగరంలో పాగా వేశాయి. ఈ ముఠాలతో వైద్య రంగంలోని కొందరు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ఉచిత ఇసుకతో ఊరట!
[ 07-07-2024]
కూటమి ప్రభుత్వం ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనుంది. దీంతో మరో ఎన్నికల హామీని అమలు చేసినట్లే. -
జిల్లా ఖజానా కార్యాలయంలో సంచాలకుల విచారణ
[ 07-07-2024]
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లా ఖజానా శాఖ పనితీరుపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై ఆశాఖ సంచాలకులు ఎన్.మోహన్రావు శనివారం విచారణ జరిపారు. -
ఉచిత ఇసుక పంపిణీకి చర్యలు: కలెక్టర్
[ 07-07-2024]
ఈనెల 8 నుంచి చేపట్టే ఉచిత ఇసుక పంపిణీకి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. -
సీఎం రమేశ్పై దాడి కేసులో బాధ్యులను శిక్షించాలి
[ 07-07-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం రమేశ్పై దాడికి పాల్పడిన కేసులో బాధ్యులను శిక్షించాలని సినీ నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ డిమాండ్ చేశారు. -
మీ సేవకుడిగా పనిచేస్తా: సీఎం రమేశ్
[ 07-07-2024]
తనను ఎంతో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన మీకు సేవకుడిలా పనిచేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. -
ముఖ్యమంత్రి మాటలు బేఖాతరు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు వ్యవహరించినట్టు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించొద్దు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సాధారణ వ్యక్తుల్లాగే వెళ్లండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నా కూటమి నాయకులు ఆయన మాటలను పెడచెవిన పెడుతున్నారు -
నిర్వాసితులకు ఉపాధిపై దృష్టి
[ 07-07-2024]
హోం మంత్రి అనితను జిల్లా నూతన కలెక్టర్ విజయ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని మంత్రి నివాసంలో ఆమెను కలిసి మొక్క అందించారు. -
ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తాం
[ 07-07-2024]
ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. శనివారం నిర్వహించిన కూటమి సమావేశంలో ఆయన మాట్లాడారు -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం