ఎలాగైనా పాగా వేయాలని..!!
తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో నిన్న మొన్నటి వరకు ఆయనదే పెత్తనం. వైకాపా ప్రభుత్వంలో కీలకమైన డైరెక్టర్గా నియమితులై పార్టీ నేతలతో అంటకాగారనే ఆరోపణలున్నాయి.
నాడు వైకాపాకు అంటకాగి... ప్రస్తుతం తెదేపా నేతల చెంతకు
ఈపీడీసీఎల్లో పట్టుకు తాజా మాజీ డైరెక్టర్ వ్యూహాలు
ఈనాడు, విశాఖపట్నం: తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో నిన్న మొన్నటి వరకు ఆయనదే పెత్తనం. వైకాపా ప్రభుత్వంలో కీలకమైన డైరెక్టర్గా నియమితులై పార్టీ నేతలతో అంటకాగారనే ఆరోపణలున్నాయి. తెదేపా కూటమి సర్కారు వచ్చాక గతంలో నియమితులైన డైరెక్టర్లంతా రాజీనామాలు చేయగా...ఈయనా చేశారు. అయితే...మళ్లీ ఈపీడీసీఎల్లో పాగా వేయడానికి తనకు సమీప బంధువైన తెదేపా నేతతో మంతనాలు సాగిస్తున్నారు. గతంలో చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా పనిచేసిన ఈయన పదవీ విరమణకు ఆరు సంవత్సరాల ముందే వీఆర్ఎస్ తీసుకున్నారు. తరువాత డైరెక్టర్గా వచ్చేశారు. వైకాపా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి మౌఖిక పరీక్షల ద్వారా నియమించినా శ్రీకాకుళానికి చెందిన వైకాపా ముఖ్యనేత అండదండలతోనే పదవి వచ్చినట్లు సంబంధితశాఖలో చర్చసాగింది. నాటి నుంచి ఈపీడీసీఎల్లో ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఈయనే చక్కబెడుతూ వచ్చారు. తనకంటే పైస్థాయి వారిని మచ్చిక చేసుకొని... దిగువ స్థాయి అధికారులను తన కనుసన్నల్లో పనిచేయించుకునేవారు. గత ప్రభుత్వంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు ఎక్కువ ఆర్డర్లు ఇవ్వడం, వారికి వెంటవెంటనే బిల్లులు అయ్యేలా చూసేవారనే ఆరోపణలున్నాయి. స్మార్ట్ మీటర్లు, ఫీడర్ల వర్గీకరణ, భూగర్భ విద్యుత్తు పనులు, జగనన్న కాలనీల విద్యుదీకరణ పనులకు సంబంధించిన టెండర్లను వైకాపా పెద్దలు చెప్పిన గుత్తేదారు సంస్థలకు దక్కేలా చేయడంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. టెండర్లలో పేర్కొన్నవాటికి భిన్నంగా అంచనాలు పెంచి గుత్తేదారులకు బిల్లులు దోచిపెట్టినట్లు తెలిసింది. ప్రభుత్వం మారిన వెంటనే ఈయన తనకు బంధువైన శ్రీకాకుళానికి చెందిన తెదేపా నేత చెంతకు చేరిపోయారు. మరోసారి ఈపీడీసీఎల్లో పాగా వేయటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
[ 07-07-2024]
వరకట్న వేధింపులతో ఇటీవల మృతి చెందిన ఎం.పద్మిని(25) తన భర్త చేతిలో అనుభవించిన చిత్రహింసలు వర్ణనాతీతం. గాజువాక సనత్నగర్కు చెందిన సోమేశ్కు 2018లో అనకాపల్లికి చెందిన పద్మినితో పెద్దల సమక్షంలో వివాహమైంది -
చిప్పాడలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 07-07-2024]
భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ నమ్మివానిపాలెం వద్ద దాదాపు రూ.5 కోట్ల విలువైన 1.94 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది -
విశాఖను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
[ 07-07-2024]
విశాఖ జిల్లాను మాదకద్రవ్యాలు, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దటానికి విస్తృత చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు అన్నారు -
‘బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు మరో బీచ్ పరిశీలన!
[ 07-07-2024]
బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు విశాఖలో మరో బీచ్ను అధికారులు పరిశీలించారు. ఇప్పటికే రుషికొండ బీచ్కు ఈ గుర్తింపు ఉంది. ఫలితంగా దేశ, విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. -
ఘనంగా వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
[ 07-07-2024]
అల్లిపురం దరి శ్రీలక్ష్మీ వారాహి సహిత రాజశ్యామల అమ్మవారి ఆలయంలో శనివారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి -
నగరంలో కిడ్నీ ముఠాలు
[ 07-07-2024]
పేదల ఆర్థిక అవసరాల బలహీనతను ఆసరాగా చేసుకుని కిడ్నీలు కొట్టేసే ముఠాలు నగరంలో పాగా వేశాయి. ఈ ముఠాలతో వైద్య రంగంలోని కొందరు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ఉచిత ఇసుకతో ఊరట!
[ 07-07-2024]
కూటమి ప్రభుత్వం ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనుంది. దీంతో మరో ఎన్నికల హామీని అమలు చేసినట్లే. -
జిల్లా ఖజానా కార్యాలయంలో సంచాలకుల విచారణ
[ 07-07-2024]
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లా ఖజానా శాఖ పనితీరుపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై ఆశాఖ సంచాలకులు ఎన్.మోహన్రావు శనివారం విచారణ జరిపారు. -
ఉచిత ఇసుక పంపిణీకి చర్యలు: కలెక్టర్
[ 07-07-2024]
ఈనెల 8 నుంచి చేపట్టే ఉచిత ఇసుక పంపిణీకి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. -
సీఎం రమేశ్పై దాడి కేసులో బాధ్యులను శిక్షించాలి
[ 07-07-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం రమేశ్పై దాడికి పాల్పడిన కేసులో బాధ్యులను శిక్షించాలని సినీ నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ డిమాండ్ చేశారు. -
మీ సేవకుడిగా పనిచేస్తా: సీఎం రమేశ్
[ 07-07-2024]
తనను ఎంతో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన మీకు సేవకుడిలా పనిచేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. -
ముఖ్యమంత్రి మాటలు బేఖాతరు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు వ్యవహరించినట్టు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించొద్దు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సాధారణ వ్యక్తుల్లాగే వెళ్లండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నా కూటమి నాయకులు ఆయన మాటలను పెడచెవిన పెడుతున్నారు -
నిర్వాసితులకు ఉపాధిపై దృష్టి
[ 07-07-2024]
హోం మంత్రి అనితను జిల్లా నూతన కలెక్టర్ విజయ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని మంత్రి నివాసంలో ఆమెను కలిసి మొక్క అందించారు. -
ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తాం
[ 07-07-2024]
ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. శనివారం నిర్వహించిన కూటమి సమావేశంలో ఆయన మాట్లాడారు -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?