అల్లూరి పోరాట స్ఫూర్తితో యువత ముందడుగు
అల్లూరి సీతారామరాజు పోరాటస్ఫూర్తి అన్ని తరాలకూ ఆదర్శమని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
శాసన సభాపతి అయ్యన్న పిలుపు
నందనవనంలో సీతారామరాజు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న స్పీకర్ అయ్యన్న, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, కలెక్టర్ రవి, జేసీ జాహ్నవి తదితరులు
కృష్ణదేవిపేట, న్యూస్టుడే: అల్లూరి సీతారామరాజు పోరాటస్ఫూర్తి అన్ని తరాలకూ ఆదర్శమని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అల్లూరి 127వ జయంతి వేడుకలు గురువారం కృష్ణదేవిపేటలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కలెక్టర్ రవి, క్షత్రియ సంఘం నాయకులతో కలిసి స్థానిక నందనవనంలోని సీతారామరాజు సమాధి వద్ద నివాళులర్పించారు. అగ్గిపిడుగు జీవిత చరిత్రకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జాతీయ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఏర్పాటు చేసిన చిత్రకళా కేంద్రాన్ని ప్రారంభించారు. అందులోని చిత్రాలను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న మాట్లాడుతూ సీతారామరాజు పోరాట స్ఫూర్తితో యువత విప్లవ భావాలు, నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పరితపించాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం అల్లూరి స్మారక మందిరాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. నందనవనంలో సమాధుల పైకప్పు పెచ్చులూడిపోయిందని, సందర్శకులకు కనీస వసతులు లేవన్నారు. తక్షణం వీటి మరమ్మతులకు అంచనాలు తయారుచేసి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రవి, పర్యటక శాఖ అధికారి మల్లికార్జునరావును ఆదేశించారు. ఎంపీ సీఎం రమేశ్ నందనవనం పార్కు అభివృద్ధికి తన నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, అందుకు రెట్టింపు నిధులు రప్పించి ఈ ప్రాంతాన్ని పర్యటకంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. తొలుత అయ్యన్నపాత్రుడు అతిథులతో కలిసి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, జిల్లా సంయుక్త కలెక్టర్ జాహ్నవి, ఎస్పీ మురళీకృష్ణ, నర్సీపట్నం ఆర్డీఓ జయరామ్, గొలుగొండ జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిటికెల తారకవేణుగోపాల్, మండల తెదేపా అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, తెదేపా సీనియర్ నాయకులు సాంబమూర్తి, గోపాలకృష్ణ, కొల్లు రాంబాబు, బొడ్డు జమీలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
[ 07-07-2024]
వరకట్న వేధింపులతో ఇటీవల మృతి చెందిన ఎం.పద్మిని(25) తన భర్త చేతిలో అనుభవించిన చిత్రహింసలు వర్ణనాతీతం. గాజువాక సనత్నగర్కు చెందిన సోమేశ్కు 2018లో అనకాపల్లికి చెందిన పద్మినితో పెద్దల సమక్షంలో వివాహమైంది -
చిప్పాడలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 07-07-2024]
భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ నమ్మివానిపాలెం వద్ద దాదాపు రూ.5 కోట్ల విలువైన 1.94 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది -
విశాఖను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
[ 07-07-2024]
విశాఖ జిల్లాను మాదకద్రవ్యాలు, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దటానికి విస్తృత చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు అన్నారు -
‘బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు మరో బీచ్ పరిశీలన!
[ 07-07-2024]
బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు విశాఖలో మరో బీచ్ను అధికారులు పరిశీలించారు. ఇప్పటికే రుషికొండ బీచ్కు ఈ గుర్తింపు ఉంది. ఫలితంగా దేశ, విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. -
ఘనంగా వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
[ 07-07-2024]
అల్లిపురం దరి శ్రీలక్ష్మీ వారాహి సహిత రాజశ్యామల అమ్మవారి ఆలయంలో శనివారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి -
నగరంలో కిడ్నీ ముఠాలు
[ 07-07-2024]
పేదల ఆర్థిక అవసరాల బలహీనతను ఆసరాగా చేసుకుని కిడ్నీలు కొట్టేసే ముఠాలు నగరంలో పాగా వేశాయి. ఈ ముఠాలతో వైద్య రంగంలోని కొందరు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ఉచిత ఇసుకతో ఊరట!
[ 07-07-2024]
కూటమి ప్రభుత్వం ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనుంది. దీంతో మరో ఎన్నికల హామీని అమలు చేసినట్లే. -
జిల్లా ఖజానా కార్యాలయంలో సంచాలకుల విచారణ
[ 07-07-2024]
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లా ఖజానా శాఖ పనితీరుపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై ఆశాఖ సంచాలకులు ఎన్.మోహన్రావు శనివారం విచారణ జరిపారు. -
ఉచిత ఇసుక పంపిణీకి చర్యలు: కలెక్టర్
[ 07-07-2024]
ఈనెల 8 నుంచి చేపట్టే ఉచిత ఇసుక పంపిణీకి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. -
సీఎం రమేశ్పై దాడి కేసులో బాధ్యులను శిక్షించాలి
[ 07-07-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం రమేశ్పై దాడికి పాల్పడిన కేసులో బాధ్యులను శిక్షించాలని సినీ నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ డిమాండ్ చేశారు. -
మీ సేవకుడిగా పనిచేస్తా: సీఎం రమేశ్
[ 07-07-2024]
తనను ఎంతో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన మీకు సేవకుడిలా పనిచేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. -
ముఖ్యమంత్రి మాటలు బేఖాతరు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు వ్యవహరించినట్టు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించొద్దు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సాధారణ వ్యక్తుల్లాగే వెళ్లండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నా కూటమి నాయకులు ఆయన మాటలను పెడచెవిన పెడుతున్నారు -
నిర్వాసితులకు ఉపాధిపై దృష్టి
[ 07-07-2024]
హోం మంత్రి అనితను జిల్లా నూతన కలెక్టర్ విజయ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని మంత్రి నివాసంలో ఆమెను కలిసి మొక్క అందించారు. -
ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తాం
[ 07-07-2024]
ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. శనివారం నిర్వహించిన కూటమి సమావేశంలో ఆయన మాట్లాడారు -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
-
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం