నచ్చినోళ్లకు.. నిధులు కుమ్మరింత!
వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు.
ఐదేళ్లలో రూ.680 కోట్లు ఖర్చు చేసిన వీఎంఆర్డీఏ
‘ఒక సెంటు’ లేఅవుట్లలో ఇష్టానుసారంగా పనులు
కొందరికే టెండర్లు దక్కేలా చక్రం తిప్పిన వైకాపా నేతలు
ఈనాడు, విశాఖపట్నం
వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. ఒక సెంటు లేఅవుట్లలో అభివృద్ధి పనులు చేపట్టగా...
భారీగా నిధులు పక్కదారి పట్టినట్లు సమాచారం.
ఐదేళ్లలో ఈ పనులకు వీఎంఆర్డీఏ దాదాపు రూ.680 కోట్లు వ్యయం చేయగా... గుత్తేదారులకు టెండర్లు కట్టబెట్టడం నుంచి బిల్లుల చెల్లింపులు వరకు అన్నీ కొందరు వైకాపా నేతల కనుసన్నల్లోనే జరిగాయి. బిల్లుల చెల్లింపు ప్రక్రియలో కొందరి పట్ల చాలా ఉదారంగా వ్యవహరించారు. పనుల్లో నాణ్యతా లోపాలు, టెండర్ విధానాలు, ఆడిట్ అంశాలపై కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.
వైకాపా ప్రభుత్వం విశాఖలో ‘ఒక సెంటు ప్లాట్ల’కు 4,828 ఎకరాలు సమీకరించింది. రూ.175 కోట్ల ఖర్చుతో 83 లేఅవుట్లలో 1,41,654 ‘ఒక సెంటు ప్లాట్ల’ను అభివృద్ధి చేశారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం, పరవాడ, పెదగంట్యాడ, అనకాపల్లి మండలాల్లో ఈ లేఅవుట్లు ఉన్నాయి. తాత్కాలిక వసతుల కోసం మొదట బోర్లు తవ్వకం, సిమెంటు గోదాంల నిర్మాణం, అప్రోచ్ రోడ్లు, విద్యుత్తు సౌకర్యాలు, సీసీ కాలువలు, కల్వర్టులు, బీటీ రోడ్లుకు ప్రణాళిక చేశారు. అనంతరం పరిహారంగా ఇచ్చిన ప్లాట్లలో పనులకు నిధులు భారీగా ఖర్చు చేశారు. మొదటి దశలో రూ.200 కోట్లు, రెండో దశలో రూ.305 కోట్లతో పనులు ప్రారంభించారు. చాలా చోట్ల ఈ పనులు తూతూమంత్రంగా చేశారు. అనకాపల్లి, ఆనందపురం, పద్మనాభం, సబ్బవరం, పరవాడ మండలాల్లో చేపట్టిన పనులు అప్పుడే దెబ్బతిన్నాయి. ఒక సెంటు లేఅవుట్ల అభివృద్ధి పనుల్లో కొందరు గుత్తేదారులు ఒక్కటై పనులు దక్కించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రివర్స్ టెండరింగు పేరుతో వారికి లబ్ధి కలిగేలా చేశారు. గతంలో వీఎంఆర్డీఏ టెండర్లు పిలిస్తే కనీసం 5 శాతం నుంచి 15 శాతం తక్కువకు కోట్ చేసేవారు. పాల్గొనే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. వైకాపా ప్రభుత్వంలో దీనికి భిన్నంగా జరిగింది.
- పలు లేఅవుట్లలో కాలువలు, కల్వర్టు పనులను 0.30 శాతం నుంచి 0.78 శాతం తక్కువకే గుత్తేదారులు దక్కించుకున్నారు. అనకాపల్లి, ఆనందపురం మండలాల్లో పనులకు ఓ గుత్తేదారు అర శాతం కన్నా తక్కువకు పాడినా రద్దు చేయకుండా కట్టబెట్టారు. పెందుర్తి మండలం ముదపాకలో ఓ పనికి 0.10 శాతం తక్కువకు అప్పగించారు. ఇవన్నీ అప్పటి ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరిగాయి.
- చాలా పనులకు టెండర్లు పిలిస్తే పోటీ లేకపోయినా అప్పగించేశారు. ఆనందపురం మండలంలోని పది చోట్ల రోడ్ల నిర్మాణానికి రూ.2 కోట్లతో టెండరు పిలిస్తే ఓ గుత్తేదారు అర శాతం కన్నా తక్కువకే ఆ పనులు దక్కించుకున్నారు. ఇదే మండలంలోని తంగుడుబిల్లిలో, పద్మనాభం మండలం తునివలసలో అలానే జరిగింది.
- భీమిలిలోని నిడిగట్టు, జేవీఅగ్రహారం, కొత్తవలసల్లో భూసమీకరణ చేసిన చోట్ల రోడ్లు, కాలువల తవ్వకానికి టెండర్లు పిలిస్తే అన్నింటినీ ఒకే గుత్తేదారుకు కట్టబెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
[ 07-07-2024]
వరకట్న వేధింపులతో ఇటీవల మృతి చెందిన ఎం.పద్మిని(25) తన భర్త చేతిలో అనుభవించిన చిత్రహింసలు వర్ణనాతీతం. గాజువాక సనత్నగర్కు చెందిన సోమేశ్కు 2018లో అనకాపల్లికి చెందిన పద్మినితో పెద్దల సమక్షంలో వివాహమైంది -
చిప్పాడలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 07-07-2024]
భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ నమ్మివానిపాలెం వద్ద దాదాపు రూ.5 కోట్ల విలువైన 1.94 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది -
విశాఖను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
[ 07-07-2024]
విశాఖ జిల్లాను మాదకద్రవ్యాలు, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దటానికి విస్తృత చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు అన్నారు -
‘బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు మరో బీచ్ పరిశీలన!
[ 07-07-2024]
బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు విశాఖలో మరో బీచ్ను అధికారులు పరిశీలించారు. ఇప్పటికే రుషికొండ బీచ్కు ఈ గుర్తింపు ఉంది. ఫలితంగా దేశ, విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. -
ఘనంగా వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
[ 07-07-2024]
అల్లిపురం దరి శ్రీలక్ష్మీ వారాహి సహిత రాజశ్యామల అమ్మవారి ఆలయంలో శనివారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి -
నగరంలో కిడ్నీ ముఠాలు
[ 07-07-2024]
పేదల ఆర్థిక అవసరాల బలహీనతను ఆసరాగా చేసుకుని కిడ్నీలు కొట్టేసే ముఠాలు నగరంలో పాగా వేశాయి. ఈ ముఠాలతో వైద్య రంగంలోని కొందరు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ఉచిత ఇసుకతో ఊరట!
[ 07-07-2024]
కూటమి ప్రభుత్వం ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనుంది. దీంతో మరో ఎన్నికల హామీని అమలు చేసినట్లే. -
జిల్లా ఖజానా కార్యాలయంలో సంచాలకుల విచారణ
[ 07-07-2024]
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లా ఖజానా శాఖ పనితీరుపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై ఆశాఖ సంచాలకులు ఎన్.మోహన్రావు శనివారం విచారణ జరిపారు. -
ఉచిత ఇసుక పంపిణీకి చర్యలు: కలెక్టర్
[ 07-07-2024]
ఈనెల 8 నుంచి చేపట్టే ఉచిత ఇసుక పంపిణీకి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. -
సీఎం రమేశ్పై దాడి కేసులో బాధ్యులను శిక్షించాలి
[ 07-07-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం రమేశ్పై దాడికి పాల్పడిన కేసులో బాధ్యులను శిక్షించాలని సినీ నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ డిమాండ్ చేశారు. -
మీ సేవకుడిగా పనిచేస్తా: సీఎం రమేశ్
[ 07-07-2024]
తనను ఎంతో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన మీకు సేవకుడిలా పనిచేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. -
ముఖ్యమంత్రి మాటలు బేఖాతరు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు వ్యవహరించినట్టు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించొద్దు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సాధారణ వ్యక్తుల్లాగే వెళ్లండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నా కూటమి నాయకులు ఆయన మాటలను పెడచెవిన పెడుతున్నారు -
నిర్వాసితులకు ఉపాధిపై దృష్టి
[ 07-07-2024]
హోం మంత్రి అనితను జిల్లా నూతన కలెక్టర్ విజయ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని మంత్రి నివాసంలో ఆమెను కలిసి మొక్క అందించారు. -
ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తాం
[ 07-07-2024]
ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. శనివారం నిర్వహించిన కూటమి సమావేశంలో ఆయన మాట్లాడారు -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఒలింపిక్స్లో వారిద్దరూ ఆడతారు’.. ద్రవిడ్ వ్యాఖ్యలకు కోహ్లీ ఫన్నీ రియాక్షన్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత
-
సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్ఆర్ ఆంజనేయులు చక్కర్లు
-
ఆ విషయంలో ప్రియదర్శిపై నాకు అసూయ: విష్వక్ సేన్
-
కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కలలు కన్నారు: జూపల్లి కృష్ణారావు
-
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి