చేయి చేయి కలిపే... గుర్తింపు సాధించే..!
జీవీఎంసీ పరిధిలో వందలాది కాలనీలు ఉన్నా... 87వ వార్డు తిరుమలనగర్ కాలనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి నివాసితులు ఐక్యంగా, పట్టుదలతో పని చేస్తూ.. కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దారు. దీంతో అనేక అవార్డులు వచ్చాయి.
తిరుమలనగర్ నివాసిత సంఘానికి ప్రత్యేక అవార్డులు
న్యూస్టుడే, కూర్మన్నపాలెం(తిరుమలనగర్)
జీవీఎంసీ పరిధిలో వందలాది కాలనీలు ఉన్నా... 87వ వార్డు తిరుమలనగర్ కాలనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి నివాసితులు ఐక్యంగా, పట్టుదలతో పని చేస్తూ.. కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దారు. దీంతో అనేక అవార్డులు వచ్చాయి.
కూర్మన్నపాలెం సమీపంలో సుమారు 30 ఎకరాల్లో ఉన్న కాలనీలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇక్కడి సమస్యలపై కాలనీవాసులు ఎంతో శ్రద్ధగా జీవీఎంసీ అధికారులకు విన్నవించి.. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
కాలనీలో మొత్తం అయిదు పార్కులు ఉండగా, వాటిల్లో రెండింటిని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు తిరుమలనగర్ సంక్షేమ సంఘం సభ్యులు జీవీఎంసీతో చేతులు కలిపారు. పార్కులో పచ్చదనం పెంపు, చిన్నపిల్లలకు అవసరమైన క్రీడా పరికరాలు అందుబాటులో ఉంచారు.
ప్రత్యేక అవగాహన ఇలా..: కాలనీలో పరిశుభ్రతతో పాటు ప్లాస్టిక్ నియంత్రణ, వస్త్ర, నార సంచుల వినియోగం, మొక్కల పెంపకం, సేంద్రీయ ఎరువు తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా అంశాలపై అవగాహన కల్పించేలా ‘తిరుమలనగర్ ఆర్డబ్ల్యూఏ’ యూట్యూబ్ ఛానల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. బీ ఏటా జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో కాలనీ సభ్యులు పాల్గొంటూ అవార్డులు సొంతం చేసుకుంటున్నారు. దేశవ్యాప్త స్వచ్ఛ పోటీల్లో జీవీఎంసీకి మంచి ర్యాంకులు రావడానికి కూడా ఇక్కడి కార్యక్రమాలు దోహదపడుతున్నాయి.
ఇంకుడు గుంతలు- పచ్చదనం
భూగర్భ జలాల పెంపుపై కాలనీ సంఘం దృష్టి సారించింది. నీటి ఎద్దడిని అధిగమించేందుకు ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంకల్పించింది. పార్కులు, ఇంటి అవరణలో, రహదారుల పక్కన సుమారు 166 ఇంకుడు గుంతలు తవ్వి జల సంరక్షణకు చర్యలు చేపట్టారు. దీంతో ఇటీవల 50- 60 అడుగుల లోతులోనే నీటి లభ్యత జరుగుతుందని సంఘం ప్రతినిధి ఎం.పరమానందం తెలిపారు.
కాలనీలో కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటి పెంచుతున్నారు. అలాగే సేంద్రీయ ఎరువు తయారీపైనా దృష్టి సారించారు.
ఇవీ పురస్కారాలు..
- ‘ఉత్తమ నివాసిత సంక్షేమ సంఘం(ఆర్డబ్ల్యూఏ)’ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అందించింది.
- దేశవ్యాప్తంగా ఆర్డబ్ల్యూఏ విభాగంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిల్లీ, బెంగళూరుల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో నాలుగు సార్లు ఉత్తమ ఆర్డబ్ల్యూఏ అవార్డులు వచ్చాయి.
- జల సంరక్షణకు చర్యలు చేపట్టడంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘నేషనల్ వాటర్ హీరో’ అవార్డు, విశాఖ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ‘నీటి సంరక్షణ అవార్డు’ దక్కాయి.
- ఆనంద్ సిటిజెన్ అవార్డుతో పాటు, జిల్లా, జోనల్ స్థాయిలో 18 అవార్డులు సంఘానికి దక్కాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
[ 07-07-2024]
వరకట్న వేధింపులతో ఇటీవల మృతి చెందిన ఎం.పద్మిని(25) తన భర్త చేతిలో అనుభవించిన చిత్రహింసలు వర్ణనాతీతం. గాజువాక సనత్నగర్కు చెందిన సోమేశ్కు 2018లో అనకాపల్లికి చెందిన పద్మినితో పెద్దల సమక్షంలో వివాహమైంది -
చిప్పాడలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 07-07-2024]
భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ నమ్మివానిపాలెం వద్ద దాదాపు రూ.5 కోట్ల విలువైన 1.94 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది -
విశాఖను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
[ 07-07-2024]
విశాఖ జిల్లాను మాదకద్రవ్యాలు, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దటానికి విస్తృత చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు అన్నారు -
‘బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు మరో బీచ్ పరిశీలన!
[ 07-07-2024]
బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు విశాఖలో మరో బీచ్ను అధికారులు పరిశీలించారు. ఇప్పటికే రుషికొండ బీచ్కు ఈ గుర్తింపు ఉంది. ఫలితంగా దేశ, విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. -
ఘనంగా వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
[ 07-07-2024]
అల్లిపురం దరి శ్రీలక్ష్మీ వారాహి సహిత రాజశ్యామల అమ్మవారి ఆలయంలో శనివారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి -
నగరంలో కిడ్నీ ముఠాలు
[ 07-07-2024]
పేదల ఆర్థిక అవసరాల బలహీనతను ఆసరాగా చేసుకుని కిడ్నీలు కొట్టేసే ముఠాలు నగరంలో పాగా వేశాయి. ఈ ముఠాలతో వైద్య రంగంలోని కొందరు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ఉచిత ఇసుకతో ఊరట!
[ 07-07-2024]
కూటమి ప్రభుత్వం ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనుంది. దీంతో మరో ఎన్నికల హామీని అమలు చేసినట్లే. -
జిల్లా ఖజానా కార్యాలయంలో సంచాలకుల విచారణ
[ 07-07-2024]
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లా ఖజానా శాఖ పనితీరుపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై ఆశాఖ సంచాలకులు ఎన్.మోహన్రావు శనివారం విచారణ జరిపారు. -
ఉచిత ఇసుక పంపిణీకి చర్యలు: కలెక్టర్
[ 07-07-2024]
ఈనెల 8 నుంచి చేపట్టే ఉచిత ఇసుక పంపిణీకి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. -
సీఎం రమేశ్పై దాడి కేసులో బాధ్యులను శిక్షించాలి
[ 07-07-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం రమేశ్పై దాడికి పాల్పడిన కేసులో బాధ్యులను శిక్షించాలని సినీ నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ డిమాండ్ చేశారు. -
మీ సేవకుడిగా పనిచేస్తా: సీఎం రమేశ్
[ 07-07-2024]
తనను ఎంతో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన మీకు సేవకుడిలా పనిచేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. -
ముఖ్యమంత్రి మాటలు బేఖాతరు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు వ్యవహరించినట్టు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించొద్దు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సాధారణ వ్యక్తుల్లాగే వెళ్లండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నా కూటమి నాయకులు ఆయన మాటలను పెడచెవిన పెడుతున్నారు -
నిర్వాసితులకు ఉపాధిపై దృష్టి
[ 07-07-2024]
హోం మంత్రి అనితను జిల్లా నూతన కలెక్టర్ విజయ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని మంత్రి నివాసంలో ఆమెను కలిసి మొక్క అందించారు. -
ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తాం
[ 07-07-2024]
ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. శనివారం నిర్వహించిన కూటమి సమావేశంలో ఆయన మాట్లాడారు -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రోహిత్కే సారథ్యం: జైషా
-
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
-
జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
-
మైనర్ల చేతిలో అశ్లీల కంటెంట్.. అడ్డుకట్టకు స్పెయిన్ వినూత్న ఆలోచన!
-
‘భారతీయుడు 2’.. నేను అలా అనలేదు: కమల్ హాసన్ క్లారిటీ
-
అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో పేలిన బాయిలర్.. 20 మందికి గాయాలు