డ్వాక్రా రుణాలు గుటుక్కు
అనకాపల్లిలోని వెలుగు కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న వీఓఏల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి.
బ్యాంకు సిబ్బంది, వీఏఓల కుమ్మక్కు
అనకాపల్లి పట్టణం, కొత్తూరు, న్యూస్టుడే: అనకాపల్లిలోని వెలుగు కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న వీఓఏల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. సత్యనారాయణపురంలో వీఓఏగా పనిచేసిన మంగతాయారు, డ్వాక్రా సంఘ మహిళలను మోసం చేసి రుణాలు తీసుకుని ఇవి కట్టకుండా పరారైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరుగుతున్నా ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ తరహా మోసమే కొత్తూరు పంచాయతీ ఎన్జీవో కాలనీలో జరిగింది. ఈ కాలనీకి చెందిన డ్వాక్రా సంఘాల మహిళలకు తెలియకుండానే వారి పేరుతో వీఓఏ నసీమా రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఇలా మూడు డ్వాక్రా సంఘాల్లోని 30 మంది గ్రూపు సభ్యుల పేరిట రూ. 52 లక్షల రుణాన్ని బ్యాంకు ఆఫ్ ఇండియా అనకాపల్లి బ్రాంచి నుంచి ఆమె తీసుకున్నారు. రుణాలు సక్రమంగా చెల్లించపోవడంతో ఇటీవల బ్యాంకు మేనేజర్ డ్వాక్రా సంఘాల మహిళలకు నోటీసులు పంపారు. తాము ఎలాంటి రుణం తీసుకోకుండా నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ మహిళలు బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
వెలుగు అధికారులకు బీఎం ఫిర్యాదు
డ్వాక్రా సంఘాల సభ్యులకు తెలియకుండా వారి పేర్లమీద బ్యాంకు రుణాలు తీసుకుని వీఓఏ నసీమా మోసగించారంటూ పట్టణ పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. తాను ఇద్దరి పేర్లమీద రుణం తీసుకున్నానని, ఇవి చెల్లించేస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం. చాలామంది పేర్లమీద వారికి తెలియకుండా బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నట్లు తేలడంతో వెలుగు అధికారులకు బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేశారు.
అన్నీ అక్రమాలే
వెలుగు కార్యాలయంలో పరిధిలో పనిచేస్తున్న వీఓఏల్లో కొంత మంది బ్యాంకుల నుంచి డ్వాక్రా సంఘాల మహిళల పేరుతో రుణాలు తీసుకుని వాటిని కట్టకుండా మోసం చేస్తున్నారు. బ్యాంకు ఆఫ్ ఇండియాలో 2022 జనవరి నుంచి 2023 మార్చి వరకు సుమారు రూ. 3.32 కోట్లు రుణాలను 22 గ్రూపులకు మంజారు చేశారు. వీటిలో చాలా వరకు ఆయా గ్రూపు సభ్యులకు తెలియకుండానే రుణాలు మంజూరుచేశారు. ఇవి సక్రమంగా కట్టకపోవడంతో బ్యాంకు మేనేజర్ మహిళలకు నోటీసులు ఇస్తున్నారు. దీనిపై బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ బి.శ్రీనివాసరావును వివరణ కోరగా 2022 జనవరి నుంచి 2023 మార్చి వరకు రూ. 3.32 కోట్ల రుణాలను 22 డ్వాక్రా సంఘాలకు అప్పట్లో పనిచేసిన మేనేజర్ రుణాలు మంజూరు చేశారన్నారు. చెల్లింపులు సరిగా లేకపోవడంతో నోటీసులు పంపాన్నారు. ఈ విషయంపై డీఆర్డీఏ అధికారులకు తాము ఫిర్యాదు చేశామన్నారు. రుణాల మంజూరులో జరిగిన అవకతవకలపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేస్తారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరంలో కిడ్నీ ముఠాలు
[ 07-07-2024]
పేదల ఆర్థిక అవసరాల బలహీనతను ఆసరాగా చేసుకుని కిడ్నీలు కొట్టేసే ముఠాలు నగరంలో పాగా వేశాయి. ఈ ముఠాలతో వైద్య రంగంలోని కొందరు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ఉచిత ఇసుకతో ఊరట!
[ 07-07-2024]
కూటమి ప్రభుత్వం ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనుంది. దీంతో మరో ఎన్నికల హామీని అమలు చేసినట్లే. -
జిల్లా ఖజానా కార్యాలయంలో సంచాలకుల విచారణ
[ 07-07-2024]
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లా ఖజానా శాఖ పనితీరుపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై ఆశాఖ సంచాలకులు ఎన్.మోహన్రావు శనివారం విచారణ జరిపారు. -
ఉచిత ఇసుక పంపిణీకి చర్యలు: కలెక్టర్
[ 07-07-2024]
ఈనెల 8 నుంచి చేపట్టే ఉచిత ఇసుక పంపిణీకి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. -
సీఎం రమేశ్పై దాడి కేసులో బాధ్యులను శిక్షించాలి
[ 07-07-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం రమేశ్పై దాడికి పాల్పడిన కేసులో బాధ్యులను శిక్షించాలని సినీ నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ డిమాండ్ చేశారు. -
మీ సేవకుడిగా పనిచేస్తా: సీఎం రమేశ్
[ 07-07-2024]
తనను ఎంతో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన మీకు సేవకుడిలా పనిచేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. -
ముఖ్యమంత్రి మాటలు బేఖాతరు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు వ్యవహరించినట్టు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించొద్దు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సాధారణ వ్యక్తుల్లాగే వెళ్లండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నా కూటమి నాయకులు ఆయన మాటలను పెడచెవిన పెడుతున్నారు -
నిర్వాసితులకు ఉపాధిపై దృష్టి
[ 07-07-2024]
హోం మంత్రి అనితను జిల్లా నూతన కలెక్టర్ విజయ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని మంత్రి నివాసంలో ఆమెను కలిసి మొక్క అందించారు. -
ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తాం
[ 07-07-2024]
ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. శనివారం నిర్వహించిన కూటమి సమావేశంలో ఆయన మాట్లాడారు -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
ఓటీటీలో ఫహద్ ఫాజిల్ ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?