అన్నదాతలకు అండగా.. ఆదివాసీలకు తోడుగా..
ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. సమస్య నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యమని కర్షకులకు ఆర్డీఎస్ఎస్ కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. ఆ సంస్థసీఈవో గాడి శ్రీను అలియాస్ బాలు కిసాన్ మిత్రా హెల్ప్లైన్ ప్రారంభించారు.
ఈనాడు, పాడేరు
పెట్టుబడులు పెరిగిపోవడం.. దిగుబడులు తగ్గిపోవడం.. ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోవడం.. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అప్పులపాలై రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు.
ఇలాంటి రైతు కుటుంబాలకు ఆదుకునేందుకు రూరల్ డెవలెప్మెంట్ సర్వీస్ సొసైటీ (ఆర్డీఎస్ఎస్) అనే స్వచ్ఛంద సంస్థ తోడుగా నిలుస్తోంది. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట కేంద్రంగా సేవలందిస్తున్న ఈ సంస్థ కష్టాల్లో ఉన్న కర్షకుల కుటుంబాలకు జీవనోపాధిని చూపిస్తోంది. బాల బడులతో ఆదివాసీ బిడ్డలకు అక్షరాలను దగ్గర చేస్తోంది.
ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. సమస్య నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యమని కర్షకులకు ఆర్డీఎస్ఎస్ కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. ఆ సంస్థసీఈవో గాడి శ్రీను అలియాస్ బాలు కిసాన్ మిత్రా హెల్ప్లైన్ ప్రారంభించారు. రైతులు తాము ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా 94909 00800కు కాల్ చేస్తే వాటికి ఆర్డీఎస్ఎస్ తరఫున పరిష్కారం చూపుతున్నారు. పంట యాజమాన్య పద్ధతుల నుంచి పంట రుణాలు ఇప్పించడం, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా సాయపడుతున్నారు. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వారికి పాడి పశువులను అందించి జీవనోపాధికి దారి చూపిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న 26 రైతు కుటుంబాలకు పాడి ఆవులను అందించి రూ.2 వేల నుంచి 10 వేల వరకు ఆర్థిక సాయం చేశారు. రైతు స్వరాజ్య వేదిక పేరుతో కౌలు రైతుల సమస్యలపై అధ్యయనం చేసి, నివేదికలను ప్రభుత్వాలకు అందిస్తున్నారు.
ఆదివాసీ పిల్లల కోసం బాలబడులు..
మన్యం మారుమూల గ్రామాల్లో సర్కారీ బడుల్లేక పిల్లలు పలకా బలపానికి దూరమైతున్నారు. అలాంటి వారి కోసం 2014 నుంచి బాలబడులు ఏర్పాటు చేసి చిన్నారులకు ఆంగ్ల అక్షరాలను నేర్పిస్తున్నారు.
చింతపల్లి మండలం తరుబొంగులు, కోట్లగరు, జి.మాడుగల మండలం వలసపాడు, పెదపొర్లు, కొత్త ఎస్.పెదబయలు, బర్సింగిమెట్ట, మూగమర్రి, తోకరాయి వంటి గ్రామాల్లో ఆర్డీఎస్ఎస్ తరఫున బాలబడులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో కోందు భాష మాత్రమే మాట్లాడుతుంటారు.. వారి కోసం ఆ భాష తెలిసిన స్థానిక చదువుకున్న యువతను గుర్తించి వారికి బోధనపై శిక్షణ ఇచ్చి బోధకులుగా నియమిస్తున్నారు. ముందు కోందు భాషలో మొదలుపెట్టి తెలుగు, ఆంగ్ల పదాలు నేర్పించి చదువుపట్ల ఆసక్తిని పెంచుతున్నారు. మూడో తరగతి వరకు బాలబడిలో ఉంచి నాలుగో తరగతి నుంచి ఆ పిల్లాడిని ఆశ్రమ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఈ పదేళ్లలో సుమారు 2 వేలమంది పైగా పిల్లలకు బాలబడుల ద్వారా విద్యాభ్యాసం చేయించారు. రైతులు, గిరిజన పిల్లలకు అందించే సేవలకు గుర్తింపుగా 2021లో గాంధీ సెంటర్ వ్యవస్థాపకులు, స్వాతంత్య్ర సమరయోధుడు కేఎస్ శాస్త్రి జ్ఞాపకార్థం శ్రీనుకు ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డుని అందించారు. అంతకు ముందు పలు సంస్థల నుంచి ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
[ 07-07-2024]
వరకట్న వేధింపులతో ఇటీవల మృతి చెందిన ఎం.పద్మిని(25) తన భర్త చేతిలో అనుభవించిన చిత్రహింసలు వర్ణనాతీతం. గాజువాక సనత్నగర్కు చెందిన సోమేశ్కు 2018లో అనకాపల్లికి చెందిన పద్మినితో పెద్దల సమక్షంలో వివాహమైంది -
చిప్పాడలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 07-07-2024]
భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ నమ్మివానిపాలెం వద్ద దాదాపు రూ.5 కోట్ల విలువైన 1.94 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది -
విశాఖను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
[ 07-07-2024]
విశాఖ జిల్లాను మాదకద్రవ్యాలు, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దటానికి విస్తృత చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు అన్నారు -
‘బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు మరో బీచ్ పరిశీలన!
[ 07-07-2024]
బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు విశాఖలో మరో బీచ్ను అధికారులు పరిశీలించారు. ఇప్పటికే రుషికొండ బీచ్కు ఈ గుర్తింపు ఉంది. ఫలితంగా దేశ, విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. -
ఘనంగా వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
[ 07-07-2024]
అల్లిపురం దరి శ్రీలక్ష్మీ వారాహి సహిత రాజశ్యామల అమ్మవారి ఆలయంలో శనివారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి -
నగరంలో కిడ్నీ ముఠాలు
[ 07-07-2024]
పేదల ఆర్థిక అవసరాల బలహీనతను ఆసరాగా చేసుకుని కిడ్నీలు కొట్టేసే ముఠాలు నగరంలో పాగా వేశాయి. ఈ ముఠాలతో వైద్య రంగంలోని కొందరు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ఉచిత ఇసుకతో ఊరట!
[ 07-07-2024]
కూటమి ప్రభుత్వం ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనుంది. దీంతో మరో ఎన్నికల హామీని అమలు చేసినట్లే. -
జిల్లా ఖజానా కార్యాలయంలో సంచాలకుల విచారణ
[ 07-07-2024]
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లా ఖజానా శాఖ పనితీరుపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై ఆశాఖ సంచాలకులు ఎన్.మోహన్రావు శనివారం విచారణ జరిపారు. -
ఉచిత ఇసుక పంపిణీకి చర్యలు: కలెక్టర్
[ 07-07-2024]
ఈనెల 8 నుంచి చేపట్టే ఉచిత ఇసుక పంపిణీకి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. -
సీఎం రమేశ్పై దాడి కేసులో బాధ్యులను శిక్షించాలి
[ 07-07-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం రమేశ్పై దాడికి పాల్పడిన కేసులో బాధ్యులను శిక్షించాలని సినీ నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ డిమాండ్ చేశారు. -
మీ సేవకుడిగా పనిచేస్తా: సీఎం రమేశ్
[ 07-07-2024]
తనను ఎంతో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన మీకు సేవకుడిలా పనిచేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. -
ముఖ్యమంత్రి మాటలు బేఖాతరు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు వ్యవహరించినట్టు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించొద్దు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సాధారణ వ్యక్తుల్లాగే వెళ్లండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నా కూటమి నాయకులు ఆయన మాటలను పెడచెవిన పెడుతున్నారు -
నిర్వాసితులకు ఉపాధిపై దృష్టి
[ 07-07-2024]
హోం మంత్రి అనితను జిల్లా నూతన కలెక్టర్ విజయ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని మంత్రి నివాసంలో ఆమెను కలిసి మొక్క అందించారు. -
ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తాం
[ 07-07-2024]
ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. శనివారం నిర్వహించిన కూటమి సమావేశంలో ఆయన మాట్లాడారు -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత
-
సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్ఆర్ ఆంజనేయులు చక్కర్లు
-
ఆ విషయంలో ప్రియదర్శిపై నాకు అసూయ: విష్వక్ సేన్
-
కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కలలు కన్నారు: జూపల్లి కృష్ణారావు
-
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
-
హైదరాబాద్లో భారీగా బంగారం పట్టివేత