అల్లూరి స్మారకాల అభివృద్ధిపై ఆశలు
మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో చెదరని స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. గిరిజనులతో కలిసి విల్లంబులు, బాణాలతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు ఆయన.
నేడు విప్లవవీరుడి జయంతి వేడుకలు
అధికారికంగా నిర్వహణకు భారీ ఏర్పాట్లు
న్యూస్టుడే, కృష్ణదేవిపేట, కొయ్యూరు
మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో చెదరని స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. గిరిజనులతో కలిసి విల్లంబులు, బాణాలతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు ఆయన. అల్లూరితోపాటు ఆయన అనుచరుడు గంటందొరను కృష్ణదేవిపేటలో సమాధి చేశారు. ఇక్కడ అల్లూరి పేరిట నందనవనాన్ని గతంలో అయ్యన్నపాత్రుడు హయాంలో అభివృద్ధి చేశారు.
కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సీతారామరాజు 127వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించనున్నారు. కృష్ణదేవిపేటలో జరిగే వేడుకలకు శాసన సభాపతి అయ్యన్న ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇందుకోసం నందనవనంలో పాడుబడ్డ షెల్టర్లు తొలగించారు. గోడలకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. అయ్యన్న ఆదేశాల మేరకు నర్సీపట్నం ఆర్డీఓ జయరాం రెండు రోజులుగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్థానిక కూటమి నాయకులు చిటికెల తారకవేణుగోపాల్తోపాటు జనసేన, భాజపా నాయకులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్తోపాటు కేంద్ర పర్యటకశాఖ మంత్రి వచ్చే అవకాశం ఉందని కూటమి నాయకులు చెబుతున్నారు.
అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఆధ్వర్యంలో విప్లవ వీరుడి జీవిత చరిత్రకు సంబంధించి నందనవనంలో చిత్ర కళాప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నారు. స్థానిక అల్లూరి సీతారామరాజు మైత్రి గ్రంథాలయంలో సీతారామరాజు విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంపీ సీఎం రమేశ్, అయ్యన్నపాత్రుడు పోలీసు ఉన్నతాధికారులు ఆవిష్కరించనున్నారు. నర్సీపట్నం డీఎస్పీ పర్యవేక్షణలో గ్రామీణ సీఐ హరి, పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
వైకాపా హయాంలో తీరని నిర్లక్ష్యం..: వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాల అభివృద్ధిని కనీసం పట్టించుకోలేదు. ఆయన పోరాటానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచిన ప్రాంతాలను పర్యటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలను పక్కనపెట్టేసింది. సరికదా.. అంతకుముందు తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులు కనీసం మరమ్మతులు చేసేందుకూ అణాపైసా మంజూరు చేయలేదు. పోరాట యోధుడి జ్ఞాపకాలు శిథిలావస్థలో ఉన్నా.. అప్పటి పాలకులు కనీసం కన్నెత్తి చూడలేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అల్లూరి స్మారకాల అభివృద్ధిపై కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి.
నెరవేరని హామీలు : కొయ్యూరు మండలం మంప, రాజేంద్రపాలెం స్మారక ఉద్యానాల అభివృద్ధికి గతంలో అప్పటి రాజ్యసభ సభ్యుడు సురేష్ప్రభు రూ. 50 లక్షల చొప్పున కేటాయించారు. మంప చెరువులో పూడిక తీసి చుట్టూ గట్టు ఏర్పాటు చేశారు. సమావేశాలు జరుపుకోవడానికి స్టేజీ, ప్రధాన ద్వారాన్ని నిర్మించారు. రాజేంద్రపాలెంలో ఆ నిధులు ప్రహరీ నిర్మించడానికే సరిపోయాయి. ఆ తర్వాత మంపలో 2022 మే 7న అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యానాల్లో ఉపాధి హామీ పథకం కింద సిమెంట్ రోడ్లు, పూల మొక్కలు, కూర్చొనేందుకు బెంచీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆదిశగా తీసుకున్న చర్యలు శూన్యం. సీతారామరాజు తన అనుచరులతో కలిసి పోరాటాల సమావేశాలకు స్థావరంగా ఏర్పాటు చేసుకున్న మంప సమీపంలోని ఉర్లకొండ గుహ అభివృద్ధి జాడేలేదు. మంపలోని ఉద్యానాన్ని క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. రాజేంద్రపాలెం ఉద్యానం కళాహీనంగా దర్శనమిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
[ 07-07-2024]
వరకట్న వేధింపులతో ఇటీవల మృతి చెందిన ఎం.పద్మిని(25) తన భర్త చేతిలో అనుభవించిన చిత్రహింసలు వర్ణనాతీతం. గాజువాక సనత్నగర్కు చెందిన సోమేశ్కు 2018లో అనకాపల్లికి చెందిన పద్మినితో పెద్దల సమక్షంలో వివాహమైంది -
చిప్పాడలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 07-07-2024]
భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ నమ్మివానిపాలెం వద్ద దాదాపు రూ.5 కోట్ల విలువైన 1.94 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది -
విశాఖను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
[ 07-07-2024]
విశాఖ జిల్లాను మాదకద్రవ్యాలు, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దటానికి విస్తృత చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు అన్నారు -
‘బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు మరో బీచ్ పరిశీలన!
[ 07-07-2024]
బ్లూఫ్లాగ్’ గుర్తింపునకు విశాఖలో మరో బీచ్ను అధికారులు పరిశీలించారు. ఇప్పటికే రుషికొండ బీచ్కు ఈ గుర్తింపు ఉంది. ఫలితంగా దేశ, విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. -
ఘనంగా వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
[ 07-07-2024]
అల్లిపురం దరి శ్రీలక్ష్మీ వారాహి సహిత రాజశ్యామల అమ్మవారి ఆలయంలో శనివారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి -
నగరంలో కిడ్నీ ముఠాలు
[ 07-07-2024]
పేదల ఆర్థిక అవసరాల బలహీనతను ఆసరాగా చేసుకుని కిడ్నీలు కొట్టేసే ముఠాలు నగరంలో పాగా వేశాయి. ఈ ముఠాలతో వైద్య రంగంలోని కొందరు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ఉచిత ఇసుకతో ఊరట!
[ 07-07-2024]
కూటమి ప్రభుత్వం ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనుంది. దీంతో మరో ఎన్నికల హామీని అమలు చేసినట్లే. -
జిల్లా ఖజానా కార్యాలయంలో సంచాలకుల విచారణ
[ 07-07-2024]
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లా ఖజానా శాఖ పనితీరుపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై ఆశాఖ సంచాలకులు ఎన్.మోహన్రావు శనివారం విచారణ జరిపారు. -
ఉచిత ఇసుక పంపిణీకి చర్యలు: కలెక్టర్
[ 07-07-2024]
ఈనెల 8 నుంచి చేపట్టే ఉచిత ఇసుక పంపిణీకి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. -
సీఎం రమేశ్పై దాడి కేసులో బాధ్యులను శిక్షించాలి
[ 07-07-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం రమేశ్పై దాడికి పాల్పడిన కేసులో బాధ్యులను శిక్షించాలని సినీ నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ డిమాండ్ చేశారు. -
మీ సేవకుడిగా పనిచేస్తా: సీఎం రమేశ్
[ 07-07-2024]
తనను ఎంతో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన మీకు సేవకుడిలా పనిచేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. -
ముఖ్యమంత్రి మాటలు బేఖాతరు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు వ్యవహరించినట్టు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించొద్దు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సాధారణ వ్యక్తుల్లాగే వెళ్లండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నా కూటమి నాయకులు ఆయన మాటలను పెడచెవిన పెడుతున్నారు -
నిర్వాసితులకు ఉపాధిపై దృష్టి
[ 07-07-2024]
హోం మంత్రి అనితను జిల్లా నూతన కలెక్టర్ విజయ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని మంత్రి నివాసంలో ఆమెను కలిసి మొక్క అందించారు. -
ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తాం
[ 07-07-2024]
ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. శనివారం నిర్వహించిన కూటమి సమావేశంలో ఆయన మాట్లాడారు -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు