ఇసుక నిల్వలపై అక్రమార్కుల కన్ను
నక్కపల్లిలో ఏర్పాటు చేసిన ఇసుక యార్డులోని భారీ నిల్వలపై అక్రమార్కుల కన్ను పడింది. గత ప్రభుత్వ హయాంలో నక్కపల్లిలో యార్డు ఏర్పాటు చేసి నిర్దేశిత ధరలకు ఓ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వమే ఇసుక అమ్మకాలు చేయించింది.
'నక్కపల్లి, న్యూస్టుడే: నక్కపల్లిలో ఏర్పాటు చేసిన ఇసుక యార్డులోని భారీ నిల్వలపై అక్రమార్కుల కన్ను పడింది. గత ప్రభుత్వ హయాంలో నక్కపల్లిలో యార్డు ఏర్పాటు చేసి నిర్దేశిత ధరలకు ఓ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వమే ఇసుక అమ్మకాలు చేయించింది. దీంతో ట్రాక్టరు లోడు రూ. 7 వేలకుపైమాటే పలికింది. ఇది పేద, మధ్య తరగతి వర్గీయులకు చాలా భారంగా మారింది. దీంతో ఇళ్ల నిర్మాణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. గతనెల 4న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వ జయకేతనం ఎగురవేసిన వెంటనే యార్డుల్లో విక్రయాలు నిలిపేసింది. ఇదే అక్రమార్కులకు అవకాశంగా మారింది.
ఎన్నికల ఫలితాల సందడి, ఇతరత్రా హడావుడిలో నేతలు, అధికారులు నిమగ్నమై ఉంటే కొందరు స్వార్థపరులు యార్డుల్లో ఇసుకను గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో తరలించేశారు. పదుల సంఖ్యలో వాహనాల్లో దారి మళ్లించారు. దీంతో ఆలస్యంగా మేల్కొన్న అధికార యంత్రాంగం డిపో చుట్టూ యంత్రాలతో కందకాలు తవ్వించింది. రాత్రుళ్లు కాపలాదారులు లేకపోవడంతో ఇప్పటికీ రక్షణ కరవైంది. ప్రస్తుతం నక్కపల్లి యార్డులో సుమారు 30 వేల టన్నులకు పైగా నిల్వలు ఉన్నాయని గుర్తించారు. ఇసుక నూతన పాలసీ ఈనెల 8 నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఉచితంగా అందరికీ ఇసుక అందుబాటులోకి తెస్తామని ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇలాంటి సమయంలో నక్కపల్లి యార్డు వద్ద మంగళవారం గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తరలించే యత్నంపై కొంత అలజడి రేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాత్రుళ్లు గట్టి నిఘా ఉంటే తప్ప, ఈ నిల్వలను కాపాడలేరు. దీనిపై తహసీల్దారు శ్రీకాంత్ మాట్లాడుతూ ఇసుక నిల్వలున్న ప్రాంతంలో తమ సిబ్బందిని ఏర్పాటు చేశామని, అదేవిధంగా మైనింగ్ అధికారులతో మాట్లాడితే వారూ పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లా ఖజానా కార్యాలయంలో సంచాలకుల విచారణ
[ 07-07-2024]
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లా ఖజానా శాఖ పనితీరుపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై ఆశాఖ సంచాలకులు ఎన్.మోహన్రావు శనివారం విచారణ జరిపారు. -
ఉచిత ఇసుక పంపిణీకి చర్యలు: కలెక్టర్
[ 07-07-2024]
ఈనెల 8 నుంచి చేపట్టే ఉచిత ఇసుక పంపిణీకి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. -
సీఎం రమేశ్పై దాడి కేసులో బాధ్యులను శిక్షించాలి
[ 07-07-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం రమేశ్పై దాడికి పాల్పడిన కేసులో బాధ్యులను శిక్షించాలని సినీ నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ డిమాండ్ చేశారు. -
మీ సేవకుడిగా పనిచేస్తా: సీఎం రమేశ్
[ 07-07-2024]
తనను ఎంతో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన మీకు సేవకుడిలా పనిచేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. -
ముఖ్యమంత్రి మాటలు బేఖాతరు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు వ్యవహరించినట్టు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించొద్దు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సాధారణ వ్యక్తుల్లాగే వెళ్లండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నా కూటమి నాయకులు ఆయన మాటలను పెడచెవిన పెడుతున్నారు -
నిర్వాసితులకు ఉపాధిపై దృష్టి
[ 07-07-2024]
హోం మంత్రి అనితను జిల్లా నూతన కలెక్టర్ విజయ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని మంత్రి నివాసంలో ఆమెను కలిసి మొక్క అందించారు. -
ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తాం
[ 07-07-2024]
ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. శనివారం నిర్వహించిన కూటమి సమావేశంలో ఆయన మాట్లాడారు -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
ఓటీటీలో ఫహద్ ఫాజిల్ ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?