logo

అయోధ్యకి చేరిన సైకిల్‌యాత్ర

పొట్టిదొరపాలెం గ్రామానికి చెందిన కొళ్లిమళ్ల పెంటారావు అయోధ్యకి సైకిల్‌యాత్ర చేసి బుధవారం శ్రీరాముడి దర్శనం చేసుకున్నారు.

Published : 04 Jul 2024 01:59 IST

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: పొట్టిదొరపాలెం గ్రామానికి చెందిన కొళ్లిమళ్ల పెంటారావు అయోధ్యకి సైకిల్‌యాత్ర చేసి బుధవారం శ్రీరాముడి దర్శనం చేసుకున్నారు. ఈయన గతనెల 21న పొట్టిదొరపాలెం నుంచి సైకిల్‌పై బయలుదేరారు. సుమారు 1300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అయోధ్య చేరారు. పెంటారావు పుట్టుకతోనే చెవిటి, మూగవాడు. బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈయన జనసేన పార్టీకి వీరాభిమాని. పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే అయోధ్యకి వెళ్తానని మొక్కుకున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని