తప్పుల తడకగా ధ్రువపత్రాలు..!
గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా చేయించిన కులగణన తప్పుల తడకగా ఉంది. ప్రస్తుతం ఆ సమాచారంతోనే ధ్రువపత్రాలు జారీచేయాలంటూ వచ్చిన ఆదేశాలతో కిందిస్థాయి అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
సరైన ఆధారాలు లేకుండా ఆన్లైన్లో నమోదు ఫలితం
ఎంవీపీకాలనీ, న్యూస్టుడే: గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా చేయించిన కులగణన తప్పుల తడకగా ఉంది. ప్రస్తుతం ఆ సమాచారంతోనే ధ్రువపత్రాలు జారీచేయాలంటూ వచ్చిన ఆదేశాలతో కిందిస్థాయి అధికారులు ఇబ్బంది పడుతున్నారు. నాడు జరిగిన కులగణన లోపభూయిష్టంగా ఉందని.. సరిచేసిన తర్వాత జారీచేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో కులగణన పేరిట వాలంటీర్లను ఇంటింటికి పంపించి నివాసితుల కులం, ఇతర సమాచారాన్ని సేకరించగా.. అనేక మంది తప్పుడు వివరాలు అందించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వారు చెప్పిన సమాచారాన్ని పూర్తిగా ధ్రువీకరించుకోకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. తరువాత ఎన్నికలు రావటంతో సమాచార సేకరణ, ధ్రువపత్రాల జారీ నిలిచిపోయింది.
- కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయా కుల ధ్రువపత్రాలు గ్రామ సచివాలయ సిబ్బంది లాగిన్లోకి వచ్చి ఉన్నాయి. వీటిలో అనేక పత్రాలు తప్పుల తడకగా ఉన్నాయి. అయితే కుల ధ్రువపత్రాలు అడుగుతున్న వారికి నాడు సేకరించిన సమాచారం ఆధారంగానే జారీచేయాలంటూ ఇటీవల కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. వాటిని రెవెన్యూ అధికారులు పరిశీలించగా.. చాలా వరకు చిరునామాలు, పూర్తి వివరాలు లేకుండా ఉన్నాయి. ప్రస్తుతం వీటిని జారీ చేయాలంటూ ఆదేశాలు రావటంతో కనీసం పరిశీలన లేకుండా ఎలా జారీచేస్తామంటూ సచివాలయ రెవెన్యూ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కలెక్టరేట్కు చెందిన అధికారులు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా వెంటనే జారీ చేయాలన్నారు. దీంతో రెవెన్యూ సిబ్బంది తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పుడు ఎందుకంత తొందర పడుతున్నారో అర్థం కాక అయోమయంలో ఉన్నారు.
- ఈ పరిస్థితిపై సమాచారం అందుకున్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పందించారు. పరిశీలన చేసిన తర్వాతే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కలెక్టరేట్లో ఉన్నతాధికారులను కోరారు. తప్పుడు కుల ధ్రువపత్రం జారీ చేస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వస్తాయని వివరించారు. దీనిపై స్పందించిన అధికారులు పరిశీలించిన తర్వాతే జారీ చేసేలా ఆదేశాలు ఇస్తామన్నారు. ఆచరణలో ఎంత వరకు చేస్తారో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరంలో కిడ్నీ ముఠాలు
[ 07-07-2024]
పేదల ఆర్థిక అవసరాల బలహీనతను ఆసరాగా చేసుకుని కిడ్నీలు కొట్టేసే ముఠాలు నగరంలో పాగా వేశాయి. ఈ ముఠాలతో వైద్య రంగంలోని కొందరు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ఉచిత ఇసుకతో ఊరట!
[ 07-07-2024]
కూటమి ప్రభుత్వం ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనుంది. దీంతో మరో ఎన్నికల హామీని అమలు చేసినట్లే. -
జిల్లా ఖజానా కార్యాలయంలో సంచాలకుల విచారణ
[ 07-07-2024]
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లా ఖజానా శాఖ పనితీరుపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై ఆశాఖ సంచాలకులు ఎన్.మోహన్రావు శనివారం విచారణ జరిపారు. -
ఉచిత ఇసుక పంపిణీకి చర్యలు: కలెక్టర్
[ 07-07-2024]
ఈనెల 8 నుంచి చేపట్టే ఉచిత ఇసుక పంపిణీకి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. -
సీఎం రమేశ్పై దాడి కేసులో బాధ్యులను శిక్షించాలి
[ 07-07-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం రమేశ్పై దాడికి పాల్పడిన కేసులో బాధ్యులను శిక్షించాలని సినీ నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ డిమాండ్ చేశారు. -
మీ సేవకుడిగా పనిచేస్తా: సీఎం రమేశ్
[ 07-07-2024]
తనను ఎంతో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన మీకు సేవకుడిలా పనిచేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. -
ముఖ్యమంత్రి మాటలు బేఖాతరు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు వ్యవహరించినట్టు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించొద్దు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సాధారణ వ్యక్తుల్లాగే వెళ్లండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నా కూటమి నాయకులు ఆయన మాటలను పెడచెవిన పెడుతున్నారు -
నిర్వాసితులకు ఉపాధిపై దృష్టి
[ 07-07-2024]
హోం మంత్రి అనితను జిల్లా నూతన కలెక్టర్ విజయ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని మంత్రి నివాసంలో ఆమెను కలిసి మొక్క అందించారు. -
ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తాం
[ 07-07-2024]
ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. శనివారం నిర్వహించిన కూటమి సమావేశంలో ఆయన మాట్లాడారు -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
ఓటీటీలో ఫహద్ ఫాజిల్ ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?