వాళ్లు ఏడిపించారు..వీళ్లు ఏడువేలిచ్చారు!
కూటమి సర్కారు ఏర్పడి నెలరోజులు గడవకుండానే తొలి సంక్షేమ ఫలం పేదల ఇంటికి చేరింది. అవ్వాతాతలకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే కాదు గత మూడు నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించి ఎన్నికల హామీని ఆచరణలో చూపారు చంద్రబాబు.
కూటమి సర్కారుకు అవ్వాతాతల కృతజ్ఞతలు
-ఈనాడు, అనకాపల్లి, అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే
కూటమి సర్కారు ఏర్పడి నెలరోజులు గడవకుండానే తొలి సంక్షేమ ఫలం పేదల ఇంటికి చేరింది. అవ్వాతాతలకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే కాదు గత మూడు నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించి ఎన్నికల హామీని ఆచరణలో చూపారు చంద్రబాబు. సోమవారం ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. సచివాలయ సిబ్బంది.. కూటమి నేతలు కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ములు చేతికి అందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి నెలలోనే పెంచిన పింఛను సొమ్మును బకాయిలతో కలిపి ఇవ్వడంతో అవ్వాతాతల మోములో ఏడింతల ఆనందం కనిపించింది. అనకాపల్లి, అల్లూరి జిల్లాలో 3.91 లక్షల లబ్ధిదారులకు ఈ నెలలో రూ.262 కోట్లు పింఛను సొమ్మును పంచిపెడుతున్నారు. గత నెల కంటే రూ.156 కోట్లు అదనంగా ఈ నెల ఖర్చుచేస్తున్నారు.
అనకాపల్లిలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండగ వాతావరణంలో నిర్వహించారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సచివాలయం సిబ్బందితో కలిసి పించన్దారుల ఇంటికి వెళ్లి వారికి నగదు అందజేశారు. దీనిపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
ఆడంబరానికి దూరంగా.. అందరికీ అందేలా..
వైకాపా సర్కారు రూ.250 పెంచినప్పుడల్లా హడావిడి చేసేవారు. వారం రోజుల పాటు సభలు, సమావేశాలుపెట్టి లబ్ధిదారులను తరలించి జగన్ భజన చేయించేవారు. కూటమి సర్కారు మాత్రం రూ. వెయ్యి ఒకేసారి పెంచినా ఆడంబరానికి పోలేదు. స్థానిక నేతలే ఇంటింటికి వెళ్లి పింఛను సొమ్ము ఇచ్చి చంద్రబాబు లేఖను అందించారు. ఎన్నికల కోడ్ సమయంలో వైకాపా నేతల చర్యల వల్ల అవ్వాతాతలు పడరాని పాట్లు పడ్డారు. ఈ నెల నుంచి ఇంటికే అందజేస్తుండడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు లేకపోయినా సచివాలయ సిబ్బందితో ఒకేరోజు అందరికీ అందేలా చేయడంలో సఫలమయ్యారు.
తొలిరోజు 94.1 శాతం పైగా పింఛన్ల పంపిణీ
లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్టుడే: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ విజయవంతంగా చేపట్టామని కలెక్టర్ రవి పేర్కొన్నారు. అనకాపల్లి ఉడ్పేట సచివాలయం పరిధిలో పింఛను సొమ్ము అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,64,033 పింఛనుదారులకు రూ.174 కోట్లు మేర పంపిణీ చేపట్టామన్నారు. సబ్బవరం మండలం గొటివాడ సచివాలయం బొండవానిపాలెంలో 409 పింఛన్లకు తొలిరోజు 376 పంపిణీ చేశామన్నారు. తొలిరోజు 94.1 శాతం పైగా పంపిణీ చేశామన్నారు. డీఆర్డీఏ పీడీ శచీదేవి, డీఎల్డీవో మంజులవాణి, ఏపీడీ డైజీ, పెన్షన్ డీపీఎం వెంకటరమణ పాల్గొన్నారు.
మాట నిలుపుకొన్న బాబు..
కూటమి ప్రభుత్వం నేతృత్వంలో పింఛన్ల పంపిణీ ఊరూరా.. ఇంటింటా పండగలా నిర్వహించారు. రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.4 వేలకు పెంచి ఇవ్వడంతో పాటు గత మూడు నెలల బకాయిలు కలిపి రూ. 7 వేల చొప్పున అందించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి ఆనందం పంచుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మా బాబు బంగారం అంటూ కొనియాడారు.
చంద్రబాబు.. పేదల దేవుడయ్యారు
దేవరాపల్లి, న్యూస్టుడే: మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఇద్దరు పిల్లలు. భర్త గొర్లె పైడంనాయుడుతో కలిసి ఉన్న కొద్ది పొలంలో పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నాం. ఐదేళ్ల కిందట పొలంలో పనిచేస్తుండగా ఆయన కుప్పకూలిపోయారు. నోటి మాట రాలేదు. కాలు, చేయి చలనం లేకుండా పోయాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. పక్షవాతం వల్ల మంచానికే పరిమితమయ్యారు. నాటి నుంచి ఒక్కదాన్నే పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. కూటమి ప్రభుత్వం నా భర్తకు పింఛనుగా రూ.15 వేలు మంజూరు చేసి ఉదయాన్నే సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాలాంటి ఎందరో పేదల పాలిట దేవుడయ్యారు. మా కటుంబానికి భరోసా ఇవ్వడం ఆనందంగా ఉంది.
గొర్లె రమణమ్మ, దేవరాపల్లి
రెండు నెలలు బ్యాంకుల చుట్టూ తిరిగాం
- పెంటకోట వరలక్ష్మి, అనకాపల్లి
పింఛన్ నగదు కోసం రెండు నెలల పాటు బ్యాంకుల చుట్టూ తిరిగాం. ఎండల్లో నిరీక్షించాల్సి వచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికే పెంచిన పింఛన్ నగదు పంపుతానని చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు రూ. 7 వేలు ఉదయం ఆరుగంటలకల్లా అందించారు. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని ఎన్నటికీ మరచిపోలేం.
అన్ని అవసరాలు తీరుతాయి
- జె.తేజ, దివ్యాంగుడు నర్సీపట్నం
అందరి దివ్యాంగులతోపాటు నాకు పెంచిన రూ.6 వేలు అందజేశారు. గతంలో ఇచ్చే డబ్బులతో మందులు కొనుక్కోలేకపోయేవాళ్లం. ఇప్పుడు ఈ సొమ్ముతో అన్ని అవసరాలు తీరుతాయి. ఇదివరకు మాలాంటి వారంతా ఏ విషయానికైనా చాలా ఇబ్బందులు పడేవాళ్లు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఇక మాకు ఏ సమస్యలు ఉండవని భావిస్తున్నాం. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం మాకు డబ్బులు పెంచి మాట నిలుబెట్టుకున్నారు. భవిష్యత్తులో మాకు అన్నివిధాలా అండగా ఉంటారన్న నమ్మకం ఏర్పడింది.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా..
- వేగి ధనలక్ష్మి, అనకాపల్లి
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పింఛన్ నగదు ఒకేసారి పెంచి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఒకేసారి రూ.1000 పెంచి నెలకు రూ. 4 వేలు ఇవ్వడం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్ నగదు సచివాలయం సిబ్బందితో ఇంటికి తీసుకొచ్చి అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా సమావేశంలో వర్గపోరు
[ 05-07-2024]
విశాఖ జిల్లా పార్టీ కార్యాలయం సాక్షిగా వైకాపాలో వర్గపోరు రచ్చకెక్కింది. నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఈ సమావేశంలో బహిర్గతమయ్యాయి. -
తీరంలో ఘోరం!
[ 05-07-2024]
ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలు, ఇతర ఉల్లంఘనలపై ఫిబ్రవరి నెలలోనే నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని హైకోర్టుఆదేశించింది. ఏప్రిల్ నెలలో మరోసారి కేసు విచారణకు వచ్చిన సమయంలో తీసుకున్న చర్యల మీద నివేదిక కోరింది. -
జలవనరులశాఖ బకాయిలు.. రూ. 389 కోట్లు
[ 05-07-2024]
ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో జలవనరుల శాఖ ద్వారా చేపట్టిన పనులకు రూ.389.12 కోట్ల మేర బకాయిలున్నట్లు ఆశాఖ నార్త్ కోస్టల్ చీఫ్ ఇంజినీరు (సీఈ) ఎస్.సుగుణాకరరావు తెలిపారు. -
గిరి ప్రదక్షిణ భక్తులకు.. సౌకర్యవంతంగా ఏర్పాట్లు
[ 05-07-2024]
ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యే సింహగిరి ప్రదక్షిణకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. -
మొక్కుబడిగా అల్లూరి జయంతి
[ 05-07-2024]
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి పాండ్రంగి గ్రామంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు అధికారులు ముందుగా ప్రకటించినా ఈ వేడుకలు గురువారం మొక్కుబడిగా జరిగాయి. -
వారిని పంపించేయకుంటే ఉద్యమిస్తాం
[ 05-07-2024]
ఏయూలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ఫ్యాకల్టీలను వెనక్కి పంపించేయకుంటే తామంతా ఉద్యమం చేపడతామని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు స్పష్టం చేశారు. -
పాఠశాల ఆటోలు భద్రంసుమా!
[ 05-07-2024]
ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని తీసుకువెళ్తున్న ఆటోలు కూడా వాహనచట్టం ప్రకారం నిబంధనలు పాటించాలి. అటువంటి ఆటోల వివరాలను సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు ముందుగా నమోదు చేసుకోవాలి. -
ఎలాగైనా పాగా వేయాలని..!!
[ 05-07-2024]
తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో నిన్న మొన్నటి వరకు ఆయనదే పెత్తనం. వైకాపా ప్రభుత్వంలో కీలకమైన డైరెక్టర్గా నియమితులై పార్టీ నేతలతో అంటకాగారనే ఆరోపణలున్నాయి. -
అల్లూరి పోరాట స్ఫూర్తితో యువత ముందడుగు
[ 05-07-2024]
అల్లూరి సీతారామరాజు పోరాటస్ఫూర్తి అన్ని తరాలకూ ఆదర్శమని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. -
జగనన్న భూరక్ష.. రైతులకే శిక్ష!
[ 05-07-2024]
జగనన్న భూరక్ష పేరుతో చేపట్టిన భూముల రీసర్వేతో రైతులకు ఒరిగిందేమీ లేదు. సర్కారు పెద్దలకు సర్వే రాళ్లు కొనుగోలులో కమీషన్లు దక్కాయి.. వాటిని పాతిపెట్టే పనిలో స్థానిక అధికారులకు వాటాలు అందాయి.
తాజా వార్తలు (Latest News)
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
-
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం
-
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి