జీవీఎంసీలో పరాయి అధికారుల పాగా..!
గత వైకాపా ప్రభుత్వ పాలనలో మహా విశాఖ నగరపాలక సంస్థను పరాయి శాఖల అధికారులతో నింపేశారు. కీలకమైన పోస్టుల్లో మున్సిపల్శాఖకు సంబంధంలేని అధికారులను డిప్యుటేషన్పై తీసుకొచ్చి కూర్చోబెట్టారు.
డిప్యుటేషన్పై వచ్చి పాతుకు పోయిన వైనం
వైకాపా పెద్దల అండతో ఇష్టారాజ్యం
కార్పొరేషన్, న్యూస్టుడే: గత వైకాపా ప్రభుత్వ పాలనలో మహా విశాఖ నగరపాలక సంస్థను పరాయి శాఖల అధికారులతో నింపేశారు. కీలకమైన పోస్టుల్లో మున్సిపల్శాఖకు సంబంధంలేని అధికారులను డిప్యుటేషన్పై తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తమకు అనుకూలమైన రీతిలో నిర్ణయాలు వారి చేత అమలు చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నం వికటించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ అధికారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తెదేపా, జనసేన నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇక్కడే కొనసాగేలా పైరవీలు ప్రారంభించారు.
డీపీఓగా వచ్చి... జోనల్ కమిషనర్గా మారి: జోన్-3 జెడ్సీ విజయలక్ష్మి కలెక్టరేట్ ప్రణాళిక విభాగానికి చెందిన అధికారిణి. గత ప్రభుత్వ హయాంలో యూసీడీ డీపీఓ (ఉప పథక అధికారి)గా డిప్యుటేషన్పై వచ్చారు. అనంతరం వైకాపా పెద్దల అనుగ్రహంతో తక్కువ కాలంలోనే నగరంలో కీలకమైన జోన్-3 జోనల్ కమిషనర్గా పోస్టింగ్ తెచ్చుకున్నారు. బీ ఇలా ఇతర శాఖలకు చెందిన అధికారులను జీవీఎంసీకి డిప్యుటేషన్పై తీసుకొచ్చిన గత వైకాపా ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వారిని వెంటనే మాతృ సంస్థలకు పంపించి, ఆ స్థానంలో అర్హులైన మున్సిపల్శాఖ అధికారులను నియమించాలని జీవీఎంసీ ఉద్యోగులు కోరుతున్నారు.
అదనపు కమిషనర్గా జైళ్లశాఖ అధికారి : జైళ్లశాఖ అధికారిగా ఉన్న వి.సన్యాసిరావును వైకాపా ప్రభుత్వం డిప్యుటేషన్పై మహా విశాఖ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ఏడీసీ)గా నియమించింది. మధ్యలో 8నెలలు ఆయన గవర్నర్ వద్ద విధులు నిర్వహించారు. తర్వాత ఓ మాజీ మంత్రి ఆశీస్సులతో తిరిగి జీవీఎంసీకి వచ్చారు. ఏడీసీగా ఉన్న ఆయనకు రెవెన్యూ, ప్రజారోగ్యం వంటి కీలక శాఖలను అప్పగించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో ఆయన మాతృ సంస్థకు వెళతారనే ప్రచారం జరుగుతోంది.
సహకారశాఖ నుంచి జోన్-6 జెడ్సీగా: సహకార శాఖలో విధులు నిర్వహించిన సన్యాసి నాయుడికి మహా విశాఖ నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. వైకాపా ప్రభుత్వంలో ఆయన రెండు సార్లు బదిలీ అయ్యారు. పైస్థాయిలో తనకున్న పరిచయాలతో అతి తక్కువ సమయంలో తిరిగి జీవీఎంసీకి రావడం విశేషం. ఆయన సర్వీసులో అధిక సమయం జీవీఎంసీలోనే విధులు నిర్వహించారు. ఇటీవల ఆయన డిప్యుటేషన్పై ఇక్కడికి రాగా కీలకమైన గాజువాక(జోన్-6) జడ్సీగా బాధ్యతలు అప్పగించారు.
ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కు యూసీడీ పీడీ బాధ్యతలు: ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించే పాపునాయుడిను గత వైకాపా ప్రభుత్వం జీవీఎంసీ యూసీడీ పీడీగా నియమించింది. మహిళా సంఘాల నిర్వహణ, వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం, లబ్ధిదారులకు టిడ్కో గృహాలు కేటాయించడం, మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వడం వంటి విధులు నిర్వహించే పోస్టులో ఆయన్ను నియమించడంపై అప్పట్లో జీవీఎంసీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అందుకు గాను పాపునాయుడు అడుగడుగునా తన స్వామి భక్తిని ప్రదర్శించారు. ఎన్నికల్లో వైకాపా నాయకులకు అనుకూలంగా ప్రచారం నిర్వహించాలని మహిళా సంఘాల సభ్యులను ప్రోత్సహించినట్లు ఆరోపణలు వచ్చాయి. లబ్ధిదారులకు కాకుండా వైకాపా నాయకులు చెప్పిన వారికి టిడ్కో గృహాలు కేటాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయన సెలవుపై వెళ్లడంతో ఇన్ఛార్జిగా ఎంవీడీ ఫణిరాంను నియమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సముద్ర కాలుష్యం.. మత్స్యరాశులకు శాపం
[ 04-07-2024]
చేపలవేట సమయంలో మత్స్యకారులు సముద్రంలో పడేస్తున్న వ్యర్థాలు మత్స్యరాశులకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. -
పోరాట స్ఫూర్తికి... నిలువెత్తు నిదర్శనం
[ 04-07-2024]
భారతావనికి స్వేచ్ఛా వాయువులు అందించడానికి బ్రిటీష్ పాలకులపై విల్లు ఎక్కుపెట్టిన వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆ మహనీయుడు పద్మనాభం మండలంలోని పాండ్రంగి గ్రామంలో 1897 జులై 4వ తేదీన అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు. -
మౌలిక వసతుల కల్పన, భూముల రక్షణకు.. అధిక ప్రాధాన్యం
[ 04-07-2024]
విశాఖను ఐటీ, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అన్నారు. -
నచ్చినోళ్లకు.. నిధులు కుమ్మరింత!
[ 04-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
ఈనెల పంచదార లేనట్టే..!
[ 04-07-2024]
జులై నెల కోటా కింద రేషను కార్డుదారులకు పంచదార అందే పరిస్థితి లేదు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లాలోని పౌరసరఫరాల సంస్థ గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
చేయి చేయి కలిపే... గుర్తింపు సాధించే..!
[ 04-07-2024]
జీవీఎంసీ పరిధిలో వందలాది కాలనీలు ఉన్నా... 87వ వార్డు తిరుమలనగర్ కాలనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి నివాసితులు ఐక్యంగా, పట్టుదలతో పని చేస్తూ.. కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దారు. దీంతో అనేక అవార్డులు వచ్చాయి. -
డ్వాక్రా రుణాలు గుటుక్కు
[ 04-07-2024]
అనకాపల్లిలోని వెలుగు కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న వీఓఏల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. -
అన్నదాతలకు అండగా.. ఆదివాసీలకు తోడుగా..
[ 04-07-2024]
ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. సమస్య నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యమని కర్షకులకు ఆర్డీఎస్ఎస్ కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. ఆ సంస్థసీఈవో గాడి శ్రీను అలియాస్ బాలు కిసాన్ మిత్రా హెల్ప్లైన్ ప్రారంభించారు. -
ఆ ఇళ్ల సంగతేంటి?
[ 04-07-2024]
జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదించాయి. వీటి నిర్మాణాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. జిల్లాలో పునాదుల కోసం గోతులు తవ్విన ఇళ్లే దాదాపు 15,487 వరకు ఉన్నాయి. -
అల్లూరి స్మారకాల అభివృద్ధిపై ఆశలు
[ 04-07-2024]
మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో చెదరని స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. గిరిజనులతో కలిసి విల్లంబులు, బాణాలతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు ఆయన. -
ఇసుక నిల్వలపై అక్రమార్కుల కన్ను
[ 04-07-2024]
నక్కపల్లిలో ఏర్పాటు చేసిన ఇసుక యార్డులోని భారీ నిల్వలపై అక్రమార్కుల కన్ను పడింది. గత ప్రభుత్వ హయాంలో నక్కపల్లిలో యార్డు ఏర్పాటు చేసి నిర్దేశిత ధరలకు ఓ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వమే ఇసుక అమ్మకాలు చేయించింది. -
అయోధ్యకి చేరిన సైకిల్యాత్ర
[ 04-07-2024]
పొట్టిదొరపాలెం గ్రామానికి చెందిన కొళ్లిమళ్ల పెంటారావు అయోధ్యకి సైకిల్యాత్ర చేసి బుధవారం శ్రీరాముడి దర్శనం చేసుకున్నారు. -
సింహగిరిపై వైభవంగా వరద పాయస ఉత్సవం
[ 04-07-2024]
దేశంలో పంటలు బాగా పండేందుకు, అంతా సుభిక్షంగా ఉండేందుకు.. వర్షాలు సమృద్ధిగా కురిపించాలని వైకుంఠ నారాయణనుడిని భక్తులు వేడుకున్నారు. -
పలు రైళ్ల రద్దు..
[ 04-07-2024]
వాల్తేరు డివిజన్ పలాస-విజయనగరం డివిజన్లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
తప్పుల తడకగా ధ్రువపత్రాలు..!
[ 04-07-2024]
గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా చేయించిన కులగణన తప్పుల తడకగా ఉంది. ప్రస్తుతం ఆ సమాచారంతోనే ధ్రువపత్రాలు జారీచేయాలంటూ వచ్చిన ఆదేశాలతో కిందిస్థాయి అధికారులు ఇబ్బంది పడుతున్నారు. -
భీమిలి బీచ్లో అక్రమ నిర్మాణాలపై నివేదిక ఎందుకు ఇవ్వలేదు?
[ 04-07-2024]
విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత నిర్మాణాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలన్న తమ ఆదేశాలకు ఎందుకు కట్టుబడలేదని విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులను హైకోర్టు నిలదీసింది.
తాజా వార్తలు (Latest News)
-
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
-
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ను ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM