మాటల్లో కాదు...చేతల్లో చూపుతా..
‘విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడి సమస్యలు నాకు తెలుసు. క్షేత్రస్థాయిలో అన్ని విభాగాల్లో పరిస్థితులను మెరుగుపరచటానికి ప్రయత్నిస్తా.
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
నా హనీమూన్కు విశాఖకే వచ్చా
నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ
బాధ్యతలు స్వీకరించిన శంఖబ్రత బాగ్చీ
న్యూస్టుడే, ఎం.వి.పి. కాలనీ
‘విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడి సమస్యలు నాకు తెలుసు. క్షేత్రస్థాయిలో అన్ని విభాగాల్లో పరిస్థితులను మెరుగుపరచటానికి ప్రయత్నిస్తా. అయితే మాటల్లో కాకుండా చేతల్లో చూపుతా’నని నగర నూతన పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. సోమవారం ఉదయం పోలీసు కమిషనరేట్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
- జాతీయ వైద్యుల దినోత్సవం రోజున బాధ్యతలు స్వీకరించటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. విశాఖ పోలీసు కమిషనర్గా పనిచేయటం గర్వంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
- విశాఖలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు మొదటి ప్రాధాన్యం ఇస్తా. పోలీసులు ప్రజాసేవ చేయటానికి ఉన్నామని గుర్తించాలి. పోలీసుస్టేషన్కు వచ్చిన వారితో మర్యాదగా వ్యవహరించాలి. సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. నిజాయతీగా పనిచేయాలి.
- నగర పోలీసు కమిషనరేట్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది సంక్షేమంపై దృష్టిసారిస్తా. 24×7 నిర్విరామంగా పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి అన్ని వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తా.
- నగర ప్రజలు తమ సమస్యలు, సమాచారం తెలియజేయాలంటే 79950 95799కి ఫోన్ చేసి చెప్పవచ్చు. రోజంతా ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటాం.
- నాకు వివాహమైన తర్వాత హనీమూన్ ఎక్కడ చేసుకోవాలని అనుకున్న సమయంలో చాలా మంది స్విట్జర్లాండ్ అని సలహా ఇచ్చారు. అయితే విశాఖను ఎంపిక చేసుకున్నా. హిల్ స్టేషన్, సముద్రం ఉన్న చోటుకు తీసుకువెళ్తానని నా భార్యకు మాటిచ్చా.
నగరంలో గంజాయి రవాణా పూర్తిగా అరికట్టాలి
పెదవాల్తేరు, న్యూస్టుడే : నగరంలో గంజాయి రవాణా అరికట్టాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ అధికారులకు ఆదేశించారు. సోమవారం పోలీసు కమిషనరేట్ కాన్ఫరెన్స్హాల్లో పోలీసు అధికారులతో మొదటి సమావేశం నిర్వహించారు. డైనమిక్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి రవాణా అయ్యే పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రౌడీషీటర్లపై తెరిచిన షీట్లు పునఃసమీక్ష చేయాలన్నారు. జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, డీసీపీ సత్తిబాబు, డీసీపీ క్రైమ్ వెంకటరత్నం, ఏసీపీలు, సి.ఐ.లు, ఎస్.ఐ.లు పాల్గొన్నారు.
వైజాగ్ వారియర్స్ జయకేతనం
విశాఖ క్రీడలు, న్యూస్టుడే: ఏపీఎల్(ఆంధ్రా ప్రీమియర్ లీగ్)లో భాగంగా సోమవారం పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో వైజాగ్ వారియర్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో బెజవాడ టైగర్స్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెజవాడ టైగర్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. జి.మనీష్ 44 పరుగులు చేశాడు. వైజార్ వారియర్స్ బౌలర్ కె.సుదర్శన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వైజాగ్ వారియర్స్ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి విజయకేతనం ఎగురవేసింది. కె.ఎస్.భరత్ 46 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అశ్విన్హెబ్బర్ 35 పరుగులు చేశాడు. బెజవాడ టైగర్స్ బౌలర్ శంభుఅఖిల్ రెండు వికెట్లు తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా సమావేశంలో వర్గపోరు
[ 05-07-2024]
విశాఖ జిల్లా పార్టీ కార్యాలయం సాక్షిగా వైకాపాలో వర్గపోరు రచ్చకెక్కింది. నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఈ సమావేశంలో బహిర్గతమయ్యాయి. -
తీరంలో ఘోరం!
[ 05-07-2024]
ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలు, ఇతర ఉల్లంఘనలపై ఫిబ్రవరి నెలలోనే నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని హైకోర్టుఆదేశించింది. ఏప్రిల్ నెలలో మరోసారి కేసు విచారణకు వచ్చిన సమయంలో తీసుకున్న చర్యల మీద నివేదిక కోరింది. -
జలవనరులశాఖ బకాయిలు.. రూ. 389 కోట్లు
[ 05-07-2024]
ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో జలవనరుల శాఖ ద్వారా చేపట్టిన పనులకు రూ.389.12 కోట్ల మేర బకాయిలున్నట్లు ఆశాఖ నార్త్ కోస్టల్ చీఫ్ ఇంజినీరు (సీఈ) ఎస్.సుగుణాకరరావు తెలిపారు. -
గిరి ప్రదక్షిణ భక్తులకు.. సౌకర్యవంతంగా ఏర్పాట్లు
[ 05-07-2024]
ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యే సింహగిరి ప్రదక్షిణకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. -
మొక్కుబడిగా అల్లూరి జయంతి
[ 05-07-2024]
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి పాండ్రంగి గ్రామంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు అధికారులు ముందుగా ప్రకటించినా ఈ వేడుకలు గురువారం మొక్కుబడిగా జరిగాయి. -
వారిని పంపించేయకుంటే ఉద్యమిస్తాం
[ 05-07-2024]
ఏయూలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ఫ్యాకల్టీలను వెనక్కి పంపించేయకుంటే తామంతా ఉద్యమం చేపడతామని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు స్పష్టం చేశారు. -
పాఠశాల ఆటోలు భద్రంసుమా!
[ 05-07-2024]
ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని తీసుకువెళ్తున్న ఆటోలు కూడా వాహనచట్టం ప్రకారం నిబంధనలు పాటించాలి. అటువంటి ఆటోల వివరాలను సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు ముందుగా నమోదు చేసుకోవాలి. -
ఎలాగైనా పాగా వేయాలని..!!
[ 05-07-2024]
తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో నిన్న మొన్నటి వరకు ఆయనదే పెత్తనం. వైకాపా ప్రభుత్వంలో కీలకమైన డైరెక్టర్గా నియమితులై పార్టీ నేతలతో అంటకాగారనే ఆరోపణలున్నాయి. -
అల్లూరి పోరాట స్ఫూర్తితో యువత ముందడుగు
[ 05-07-2024]
అల్లూరి సీతారామరాజు పోరాటస్ఫూర్తి అన్ని తరాలకూ ఆదర్శమని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. -
జగనన్న భూరక్ష.. రైతులకే శిక్ష!
[ 05-07-2024]
జగనన్న భూరక్ష పేరుతో చేపట్టిన భూముల రీసర్వేతో రైతులకు ఒరిగిందేమీ లేదు. సర్కారు పెద్దలకు సర్వే రాళ్లు కొనుగోలులో కమీషన్లు దక్కాయి.. వాటిని పాతిపెట్టే పనిలో స్థానిక అధికారులకు వాటాలు అందాయి.