అక్రమార్కుల బరితెగింపు
ఏపీఐఐసీ రక్షణలో ఉండాల్సిన భూమి కబ్జాదారుల పాలయింది. పారిశ్రామిక అవసరాలకు సేకరించిన భూమి అక్రమార్కులపరమయింది.
ఏపీఐఐసీ భూములు కబ్జా
ఈనాడు-విశాఖపట్నం, కూర్మన్నపాలెం-న్యూస్టుడే: ఏపీఐఐసీ రక్షణలో ఉండాల్సిన భూమి కబ్జాదారుల పాలయింది. పారిశ్రామిక అవసరాలకు సేకరించిన భూమి అక్రమార్కులపరమయింది. వైకాపా హయాంలో ఆక్రమణలకు పాల్పడిన వారికి మంత్రి అమర్నాథ్ అండ ఉందని నాడు అధికారులు చర్యలకు జంకారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ఆక్రమణలు తొలగించక మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో అక్రమార్కులు చెలరేగిపోయారు.
చెరువును పూడ్చి రోడ్డు వేసే పరిస్థితి నెలకొంది. దువ్వాడ వద్ద సర్వే నెంబరు 108/5, 10లలో ఏపీఐఐసీకి ఉన్న భూముల్లో సుమారు 5.49 ఎకరాలు స్టీలు ప్లాంటు అవసరాలకు 1983లో సేకరించారు.
ఇందులో ప్లాంటు అవసరాలకు తీసుకోగా... మిగిలిన కొంత ఏపీఐఐసీకి బదలాయించారు. ఇందులో నాగదేవత గుడి ఎదురుగా ఉన్న సుమారు ఎకరా కబ్జాకు గురైంది. ఈ స్థలం చదును చేసి చుట్టూ ఏకంగా ప్రహరీ నిర్మించారు. సబ్బవరం వెళ్లే వందడుగుల రహదారికి సమీపంలో ఉండడంతో ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.13 కోట్లు వరకు ఉంటుంది. అది ఏపీఐఐసీˆ భూమిగా సర్వే చేసి నిర్ధారించినా ఇప్పటి వరకు ఆక్రమణలను తొలగించకపోవడం గమనార్హం.బీ కబ్జా చేసిన స్థలంలోకి వెళ్లేందుకు సుమారు 25 సెంట్ల ఏపీఐఐసీ చెరువును పూడ్చి రహదారి నిర్మించారు. ఈ రోడ్డు మీదుగానే గ్రావెల్, ప్రహరీ నిర్మాణ సామగ్రి తరలించారు. పూడ్చిన చెరువు స్థలం విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుంది. ఇంత జరుగుతున్నా అధికారులు ఇప్పటికీ చర్యలకు ఉపక్రమించడం లేదు. మాజీ మంత్రి అమర్నాథ్ ఒత్తిళ్లతోనే ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు తొలగింపుల జోలికి వెళ్లలేదన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఈ విలువైన భూమిని అమ్మేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశమవుతోంది. అధికారులు మాత్రం ఇప్పటికీ ఏపీఐఐసీ భూమి కాదనే తీరుగా వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా సమావేశంలో వర్గపోరు
[ 05-07-2024]
విశాఖ జిల్లా పార్టీ కార్యాలయం సాక్షిగా వైకాపాలో వర్గపోరు రచ్చకెక్కింది. నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఈ సమావేశంలో బహిర్గతమయ్యాయి. -
తీరంలో ఘోరం!
[ 05-07-2024]
ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలు, ఇతర ఉల్లంఘనలపై ఫిబ్రవరి నెలలోనే నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని హైకోర్టుఆదేశించింది. ఏప్రిల్ నెలలో మరోసారి కేసు విచారణకు వచ్చిన సమయంలో తీసుకున్న చర్యల మీద నివేదిక కోరింది. -
జలవనరులశాఖ బకాయిలు.. రూ. 389 కోట్లు
[ 05-07-2024]
ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో జలవనరుల శాఖ ద్వారా చేపట్టిన పనులకు రూ.389.12 కోట్ల మేర బకాయిలున్నట్లు ఆశాఖ నార్త్ కోస్టల్ చీఫ్ ఇంజినీరు (సీఈ) ఎస్.సుగుణాకరరావు తెలిపారు. -
గిరి ప్రదక్షిణ భక్తులకు.. సౌకర్యవంతంగా ఏర్పాట్లు
[ 05-07-2024]
ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యే సింహగిరి ప్రదక్షిణకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. -
మొక్కుబడిగా అల్లూరి జయంతి
[ 05-07-2024]
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి పాండ్రంగి గ్రామంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు అధికారులు ముందుగా ప్రకటించినా ఈ వేడుకలు గురువారం మొక్కుబడిగా జరిగాయి. -
వారిని పంపించేయకుంటే ఉద్యమిస్తాం
[ 05-07-2024]
ఏయూలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ఫ్యాకల్టీలను వెనక్కి పంపించేయకుంటే తామంతా ఉద్యమం చేపడతామని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు స్పష్టం చేశారు. -
పాఠశాల ఆటోలు భద్రంసుమా!
[ 05-07-2024]
ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని తీసుకువెళ్తున్న ఆటోలు కూడా వాహనచట్టం ప్రకారం నిబంధనలు పాటించాలి. అటువంటి ఆటోల వివరాలను సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు ముందుగా నమోదు చేసుకోవాలి. -
ఎలాగైనా పాగా వేయాలని..!!
[ 05-07-2024]
తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో నిన్న మొన్నటి వరకు ఆయనదే పెత్తనం. వైకాపా ప్రభుత్వంలో కీలకమైన డైరెక్టర్గా నియమితులై పార్టీ నేతలతో అంటకాగారనే ఆరోపణలున్నాయి. -
అల్లూరి పోరాట స్ఫూర్తితో యువత ముందడుగు
[ 05-07-2024]
అల్లూరి సీతారామరాజు పోరాటస్ఫూర్తి అన్ని తరాలకూ ఆదర్శమని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. -
జగనన్న భూరక్ష.. రైతులకే శిక్ష!
[ 05-07-2024]
జగనన్న భూరక్ష పేరుతో చేపట్టిన భూముల రీసర్వేతో రైతులకు ఒరిగిందేమీ లేదు. సర్కారు పెద్దలకు సర్వే రాళ్లు కొనుగోలులో కమీషన్లు దక్కాయి.. వాటిని పాతిపెట్టే పనిలో స్థానిక అధికారులకు వాటాలు అందాయి.