సింహగిరిపై వరద పాయసం ఉత్సవం రేపు
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలన్న సంకల్పంతో సింహగిరి వైకుంఠవాసుల మెట్టపై బుధవారం వరద పాయసం ఉత్సవం నిర్వహించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు.
సింహాచలం, న్యూస్టుడే: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలన్న సంకల్పంతో సింహగిరి వైకుంఠవాసుల మెట్టపై బుధవారం వరద పాయసం ఉత్సవం నిర్వహించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో వైకుంఠవాసుల మెట్టపై కొలువైన లక్ష్మీనారాయణుల సన్నిధిలో ఈ వేడుక నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఆ క్రమంలో బుధవారం ఉదయం 8గంటల నుంచి ఈ ఉత్సవం నిర్వహించాలని వైదికులు నిర్ణయించినట్లు ఈవో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామి సన్నిధిలో విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, లక్ష్మీనారాయణులకు పంచకలశ పూర్వక అభిషేకం, విరాట పర్వం పారాయణం, వరుణ మంత్ర జపం, పాయసం నివేదన జరుగుతాయని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సముద్ర కాలుష్యం.. మత్స్యరాశులకు శాపం
[ 04-07-2024]
చేపలవేట సమయంలో మత్స్యకారులు సముద్రంలో పడేస్తున్న వ్యర్థాలు మత్స్యరాశులకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. -
పోరాట స్ఫూర్తికి... నిలువెత్తు నిదర్శనం
[ 04-07-2024]
భారతావనికి స్వేచ్ఛా వాయువులు అందించడానికి బ్రిటీష్ పాలకులపై విల్లు ఎక్కుపెట్టిన వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆ మహనీయుడు పద్మనాభం మండలంలోని పాండ్రంగి గ్రామంలో 1897 జులై 4వ తేదీన అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు. -
మౌలిక వసతుల కల్పన, భూముల రక్షణకు.. అధిక ప్రాధాన్యం
[ 04-07-2024]
విశాఖను ఐటీ, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అన్నారు. -
నచ్చినోళ్లకు.. నిధులు కుమ్మరింత!
[ 04-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
ఈనెల పంచదార లేనట్టే..!
[ 04-07-2024]
జులై నెల కోటా కింద రేషను కార్డుదారులకు పంచదార అందే పరిస్థితి లేదు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లాలోని పౌరసరఫరాల సంస్థ గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
చేయి చేయి కలిపే... గుర్తింపు సాధించే..!
[ 04-07-2024]
జీవీఎంసీ పరిధిలో వందలాది కాలనీలు ఉన్నా... 87వ వార్డు తిరుమలనగర్ కాలనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి నివాసితులు ఐక్యంగా, పట్టుదలతో పని చేస్తూ.. కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దారు. దీంతో అనేక అవార్డులు వచ్చాయి. -
డ్వాక్రా రుణాలు గుటుక్కు
[ 04-07-2024]
అనకాపల్లిలోని వెలుగు కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న వీఓఏల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. -
అన్నదాతలకు అండగా.. ఆదివాసీలకు తోడుగా..
[ 04-07-2024]
ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. సమస్య నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యమని కర్షకులకు ఆర్డీఎస్ఎస్ కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. ఆ సంస్థసీఈవో గాడి శ్రీను అలియాస్ బాలు కిసాన్ మిత్రా హెల్ప్లైన్ ప్రారంభించారు. -
ఆ ఇళ్ల సంగతేంటి?
[ 04-07-2024]
జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదించాయి. వీటి నిర్మాణాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. జిల్లాలో పునాదుల కోసం గోతులు తవ్విన ఇళ్లే దాదాపు 15,487 వరకు ఉన్నాయి. -
అల్లూరి స్మారకాల అభివృద్ధిపై ఆశలు
[ 04-07-2024]
మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో చెదరని స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. గిరిజనులతో కలిసి విల్లంబులు, బాణాలతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు ఆయన. -
ఇసుక నిల్వలపై అక్రమార్కుల కన్ను
[ 04-07-2024]
నక్కపల్లిలో ఏర్పాటు చేసిన ఇసుక యార్డులోని భారీ నిల్వలపై అక్రమార్కుల కన్ను పడింది. గత ప్రభుత్వ హయాంలో నక్కపల్లిలో యార్డు ఏర్పాటు చేసి నిర్దేశిత ధరలకు ఓ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వమే ఇసుక అమ్మకాలు చేయించింది. -
అయోధ్యకి చేరిన సైకిల్యాత్ర
[ 04-07-2024]
పొట్టిదొరపాలెం గ్రామానికి చెందిన కొళ్లిమళ్ల పెంటారావు అయోధ్యకి సైకిల్యాత్ర చేసి బుధవారం శ్రీరాముడి దర్శనం చేసుకున్నారు. -
సింహగిరిపై వైభవంగా వరద పాయస ఉత్సవం
[ 04-07-2024]
దేశంలో పంటలు బాగా పండేందుకు, అంతా సుభిక్షంగా ఉండేందుకు.. వర్షాలు సమృద్ధిగా కురిపించాలని వైకుంఠ నారాయణనుడిని భక్తులు వేడుకున్నారు. -
పలు రైళ్ల రద్దు..
[ 04-07-2024]
వాల్తేరు డివిజన్ పలాస-విజయనగరం డివిజన్లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
తప్పుల తడకగా ధ్రువపత్రాలు..!
[ 04-07-2024]
గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా చేయించిన కులగణన తప్పుల తడకగా ఉంది. ప్రస్తుతం ఆ సమాచారంతోనే ధ్రువపత్రాలు జారీచేయాలంటూ వచ్చిన ఆదేశాలతో కిందిస్థాయి అధికారులు ఇబ్బంది పడుతున్నారు. -
భీమిలి బీచ్లో అక్రమ నిర్మాణాలపై నివేదిక ఎందుకు ఇవ్వలేదు?
[ 04-07-2024]
విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత నిర్మాణాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలన్న తమ ఆదేశాలకు ఎందుకు కట్టుబడలేదని విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులను హైకోర్టు నిలదీసింది.
తాజా వార్తలు (Latest News)
-
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా