కేజీహెచ్లో ముగ్గురు సెక్యూరిటీ సూపర్వైజర్లకు స్థానచలనం
కేజీహెచ్ భద్రతా విభాగంలో సూపర్వైజర్లుగా పనిచేస్తున్న శ్రీనివాస్, రామకృష్ణ, శ్రీకాంత్లను నగరంలోని ఈఎన్టీ, ఆర్ఈహెచ్, ఘోషాస్పత్రులకు బదిలీ చేశారు.
వన్టౌన్, న్యూస్టుడే: కేజీహెచ్ భద్రతా విభాగంలో సూపర్వైజర్లుగా పనిచేస్తున్న శ్రీనివాస్, రామకృష్ణ, శ్రీకాంత్లను నగరంలోని ఈఎన్టీ, ఆర్ఈహెచ్, ఘోషాస్పత్రులకు బదిలీ చేశారు. ఇటీవల కాలంలో భద్రతా విభాగ సూపర్వైజర్లపై పలు ఆరోపణలు వచ్చాయి. ఒకరిపై పోలీసుస్టేషన్లో కేసు కూడా నమోదైంది. కొంతమంది సూపర్వైజర్లు పూర్వపు ఏఆర్ఎంఓతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఆయా ఫిర్యాదులపై డీఎంఈ సైతం విచారణ జరిపించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు సూపర్వైజర్లను మార్చాలని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద భద్రతా సంస్థకు సూచించారు. దీంతో ఇక్కడ ఉన్న ముగ్గురిని ఇతర ఆసుపత్రులకు పంపి, వారి స్థానంలో ఇతరులను నియమించారు. బీ ఎవరో ఒకరు తప్పుచేస్తే మిగిలిన వారిని బదిలీ చేయడం సరికాదని పలువురు భద్రతా సిబ్బంది సోమవారం నిరసన తెలిపి ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారిని కలిశారు. సూపర్వైజర్ల బదిలీతో తనకు సంబంధం లేదని, కేజీహెచ్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది. దీంతో వారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను కలిశారు. ప్రస్తుతం భద్రతా విధులు చేపట్టిన సంస్థ కాలపరిమితి మరో రెండు నెలల్లో ముగియనున్నది. తర్వాత టెండర్లు పిలిచి కొత్త గుత్తేదారుడిని ఎంపిక చేయాలని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా సమావేశంలో వర్గపోరు
[ 05-07-2024]
విశాఖ జిల్లా పార్టీ కార్యాలయం సాక్షిగా వైకాపాలో వర్గపోరు రచ్చకెక్కింది. నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఈ సమావేశంలో బహిర్గతమయ్యాయి. -
తీరంలో ఘోరం!
[ 05-07-2024]
ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలు, ఇతర ఉల్లంఘనలపై ఫిబ్రవరి నెలలోనే నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని హైకోర్టుఆదేశించింది. ఏప్రిల్ నెలలో మరోసారి కేసు విచారణకు వచ్చిన సమయంలో తీసుకున్న చర్యల మీద నివేదిక కోరింది. -
జలవనరులశాఖ బకాయిలు.. రూ. 389 కోట్లు
[ 05-07-2024]
ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో జలవనరుల శాఖ ద్వారా చేపట్టిన పనులకు రూ.389.12 కోట్ల మేర బకాయిలున్నట్లు ఆశాఖ నార్త్ కోస్టల్ చీఫ్ ఇంజినీరు (సీఈ) ఎస్.సుగుణాకరరావు తెలిపారు. -
గిరి ప్రదక్షిణ భక్తులకు.. సౌకర్యవంతంగా ఏర్పాట్లు
[ 05-07-2024]
ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యే సింహగిరి ప్రదక్షిణకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. -
మొక్కుబడిగా అల్లూరి జయంతి
[ 05-07-2024]
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి పాండ్రంగి గ్రామంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు అధికారులు ముందుగా ప్రకటించినా ఈ వేడుకలు గురువారం మొక్కుబడిగా జరిగాయి. -
వారిని పంపించేయకుంటే ఉద్యమిస్తాం
[ 05-07-2024]
ఏయూలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ఫ్యాకల్టీలను వెనక్కి పంపించేయకుంటే తామంతా ఉద్యమం చేపడతామని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు స్పష్టం చేశారు. -
పాఠశాల ఆటోలు భద్రంసుమా!
[ 05-07-2024]
ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని తీసుకువెళ్తున్న ఆటోలు కూడా వాహనచట్టం ప్రకారం నిబంధనలు పాటించాలి. అటువంటి ఆటోల వివరాలను సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు ముందుగా నమోదు చేసుకోవాలి. -
ఎలాగైనా పాగా వేయాలని..!!
[ 05-07-2024]
తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో నిన్న మొన్నటి వరకు ఆయనదే పెత్తనం. వైకాపా ప్రభుత్వంలో కీలకమైన డైరెక్టర్గా నియమితులై పార్టీ నేతలతో అంటకాగారనే ఆరోపణలున్నాయి. -
అల్లూరి పోరాట స్ఫూర్తితో యువత ముందడుగు
[ 05-07-2024]
అల్లూరి సీతారామరాజు పోరాటస్ఫూర్తి అన్ని తరాలకూ ఆదర్శమని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. -
జగనన్న భూరక్ష.. రైతులకే శిక్ష!
[ 05-07-2024]
జగనన్న భూరక్ష పేరుతో చేపట్టిన భూముల రీసర్వేతో రైతులకు ఒరిగిందేమీ లేదు. సర్కారు పెద్దలకు సర్వే రాళ్లు కొనుగోలులో కమీషన్లు దక్కాయి.. వాటిని పాతిపెట్టే పనిలో స్థానిక అధికారులకు వాటాలు అందాయి.