అర్జీదారుల సమస్యలకు సత్వర పరిష్కారం
అర్జీదారుల సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు ఉత్సాహంగా అర్జీదారులు తరలివచ్చారు.
కలెక్టరేట్, న్యూస్టుడే: అర్జీదారుల సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు ఉత్సాహంగా అర్జీదారులు తరలివచ్చారు. సూపరింటెండెంట్ సత్యనారాయణ 15 కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీదారులను ఒక్కొక్కరినీ పంపించి వివరాలు నమోదు చేయించి రసీదు అందించారు. అనంతరం వీసీ హాల్లో కలెక్టర్ రవి, జేసీ జాహ్నవి, అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు ఉంటూ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ప్రతి అర్జీని నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలన్నారు. నాణ్యమైన సమాధానం చెప్పాలన్నారు. పెండింగ్ అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కార శాతం పెంచాలన్నారు. క్షేత్ర స్థాయిలో పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. జిల్లా నలుమూలలు నుంచి 136 అర్జీలు వచ్చాయి. వీటిని శాఖల వారీగా విభజించి సంబంధిత అధికారులకు పంపించారు.
- కోడూరు పంచాయతీ శివారు భూపతిపాలెంలోని పాత పాఠశాల భవనంలో అక్రమంగా నడుపుతున్న అమూల్ డెయిరీని తక్షణమే ఖాళీ చేయించాలని గ్రామానికి చెందిన కె.సురేశ్, కె.గణేశ్ కలెక్టర్ రవికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గతంలో ఈ భవనంలో అంగన్వాడీ కేంద్రం నడిపేవారన్నారు. అమూల్ కేంద్రం ఏర్పాటుకు గతంలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి ఖాళీ చేయించి అమూల్ కేంద్రానికి అన్యాయంగా ఇచ్చారన్నారు. అంగన్వాడీ కేంద్రానికి భవనం లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
- మామిడిపాలెంలో నాలుగు ఎకరాల జిరాయితీ భూమిని ఆక్రమించారని బత్తిన అర్జునరావు జేసీ జాహ్నవికి ఫిర్యాదు చేశారు. పలుమార్లు తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్రమంలో 22 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులతో ఆయన నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్ట పరిధిలోని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీచేశారు. ఎస్బీ సీఐ చంద్రశేఖర్, ఎస్సై సావిత్రి పాల్గొన్నారు.
బిడ్డ మృతిపై అనుమానాలున్నాయి..
- పెదపాటి పార్వతి, పూడి కాలనీ, అచ్యుతాపురం మండలం
చేతికి అందొచ్చిన కొడుకును కొంతమంది హత్య చేశారనే అనుమానాలు ఉన్నాయి. ఏడాది కిందట జరిగిన ఘటనపై పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశా. పూడ్చిన శవాన్ని తీసి పోస్టుమార్టం చేశారు. నివేదిక రాలేదని చెబుతున్నారు.
వేరే వారి పేరుపై భూమిని రిజిస్ట్రేషన్
- కర్రి లక్ష్మి, పల్లపు సోమవరం, కశింకోట
నా పేరు మీద ఉన్న 30 సెంట్ల భూమిని నాకు తెలియకుండా వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేశారు. 2021లో అనకాపల్లిలో నేను రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈసీలో నా పేరు వచ్చింది. 2022లో వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది. దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలి.
గ్రంథాలయం, ఆసుపత్రి నిర్మించాలి
- బల్లిన నాగేశ్వరరావు, కొత్తూరు నరసింగరావుపేట
కొత్తూరు నరసింగరావుపేటలో గ్రామ అవసరాలకు ఉపయోగపడేలా కల్యాణ మండపం, గ్రంథాలయం, ఆసుపత్రి నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టాలి. సర్వే నంబరు 75/1లో 5 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఉంది. ఏళ్ల తరబడి గ్రామ కనీస అవసరాలకు సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆటస్థలం నిర్మాణం చేపట్టాలి.
పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వరూ..
- నడిపల్లి వరహాలు, కోమలపూడి
బుచ్చయ్యపేట మండలం కోమళ్లపూడిలో రెండు ఎకరాల జిరాయితీ భూమి ఉంది. వంశపారంపర్యంగా వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయాలని ఏళ్ల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. తక్షణమే పాసుపుస్తకం మంజూరు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సముద్ర కాలుష్యం.. మత్స్యరాశులకు శాపం
[ 04-07-2024]
చేపలవేట సమయంలో మత్స్యకారులు సముద్రంలో పడేస్తున్న వ్యర్థాలు మత్స్యరాశులకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. -
పోరాట స్ఫూర్తికి... నిలువెత్తు నిదర్శనం
[ 04-07-2024]
భారతావనికి స్వేచ్ఛా వాయువులు అందించడానికి బ్రిటీష్ పాలకులపై విల్లు ఎక్కుపెట్టిన వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆ మహనీయుడు పద్మనాభం మండలంలోని పాండ్రంగి గ్రామంలో 1897 జులై 4వ తేదీన అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు. -
మౌలిక వసతుల కల్పన, భూముల రక్షణకు.. అధిక ప్రాధాన్యం
[ 04-07-2024]
విశాఖను ఐటీ, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అన్నారు. -
నచ్చినోళ్లకు.. నిధులు కుమ్మరింత!
[ 04-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
ఈనెల పంచదార లేనట్టే..!
[ 04-07-2024]
జులై నెల కోటా కింద రేషను కార్డుదారులకు పంచదార అందే పరిస్థితి లేదు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లాలోని పౌరసరఫరాల సంస్థ గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
చేయి చేయి కలిపే... గుర్తింపు సాధించే..!
[ 04-07-2024]
జీవీఎంసీ పరిధిలో వందలాది కాలనీలు ఉన్నా... 87వ వార్డు తిరుమలనగర్ కాలనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి నివాసితులు ఐక్యంగా, పట్టుదలతో పని చేస్తూ.. కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దారు. దీంతో అనేక అవార్డులు వచ్చాయి. -
డ్వాక్రా రుణాలు గుటుక్కు
[ 04-07-2024]
అనకాపల్లిలోని వెలుగు కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న వీఓఏల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. -
అన్నదాతలకు అండగా.. ఆదివాసీలకు తోడుగా..
[ 04-07-2024]
ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. సమస్య నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యమని కర్షకులకు ఆర్డీఎస్ఎస్ కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. ఆ సంస్థసీఈవో గాడి శ్రీను అలియాస్ బాలు కిసాన్ మిత్రా హెల్ప్లైన్ ప్రారంభించారు. -
ఆ ఇళ్ల సంగతేంటి?
[ 04-07-2024]
జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదించాయి. వీటి నిర్మాణాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. జిల్లాలో పునాదుల కోసం గోతులు తవ్విన ఇళ్లే దాదాపు 15,487 వరకు ఉన్నాయి. -
అల్లూరి స్మారకాల అభివృద్ధిపై ఆశలు
[ 04-07-2024]
మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో చెదరని స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. గిరిజనులతో కలిసి విల్లంబులు, బాణాలతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు ఆయన. -
ఇసుక నిల్వలపై అక్రమార్కుల కన్ను
[ 04-07-2024]
నక్కపల్లిలో ఏర్పాటు చేసిన ఇసుక యార్డులోని భారీ నిల్వలపై అక్రమార్కుల కన్ను పడింది. గత ప్రభుత్వ హయాంలో నక్కపల్లిలో యార్డు ఏర్పాటు చేసి నిర్దేశిత ధరలకు ఓ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వమే ఇసుక అమ్మకాలు చేయించింది. -
అయోధ్యకి చేరిన సైకిల్యాత్ర
[ 04-07-2024]
పొట్టిదొరపాలెం గ్రామానికి చెందిన కొళ్లిమళ్ల పెంటారావు అయోధ్యకి సైకిల్యాత్ర చేసి బుధవారం శ్రీరాముడి దర్శనం చేసుకున్నారు. -
సింహగిరిపై వైభవంగా వరద పాయస ఉత్సవం
[ 04-07-2024]
దేశంలో పంటలు బాగా పండేందుకు, అంతా సుభిక్షంగా ఉండేందుకు.. వర్షాలు సమృద్ధిగా కురిపించాలని వైకుంఠ నారాయణనుడిని భక్తులు వేడుకున్నారు. -
పలు రైళ్ల రద్దు..
[ 04-07-2024]
వాల్తేరు డివిజన్ పలాస-విజయనగరం డివిజన్లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
తప్పుల తడకగా ధ్రువపత్రాలు..!
[ 04-07-2024]
గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా చేయించిన కులగణన తప్పుల తడకగా ఉంది. ప్రస్తుతం ఆ సమాచారంతోనే ధ్రువపత్రాలు జారీచేయాలంటూ వచ్చిన ఆదేశాలతో కిందిస్థాయి అధికారులు ఇబ్బంది పడుతున్నారు. -
భీమిలి బీచ్లో అక్రమ నిర్మాణాలపై నివేదిక ఎందుకు ఇవ్వలేదు?
[ 04-07-2024]
విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత నిర్మాణాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలన్న తమ ఆదేశాలకు ఎందుకు కట్టుబడలేదని విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులను హైకోర్టు నిలదీసింది.
తాజా వార్తలు (Latest News)
-
కృష్ణా కరకట్టపై ఫైళ్ల దహనం ఘటన.. ఓఎస్డీ రామారావు పాత్రపై చర్చ!
-
బజాజ్ నుంచి సీఎన్జీ బైక్.. రిలీజ్కు ముందే వివరాలు లీక్!
-
‘వాస్తవాధీన రేఖ’ను గౌరవించాల్సిందే - చైనాకు జైశంకర్ స్పష్టం
-
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి భేటీ
-
తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం మంచిదే: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
-
ప్రచారంలో సవాలు విసిరి.. మంత్రి పదవికి రాజీనామా చేసి..!