చదువుల తల్లికి స్వేచ్ఛ.. ప్రసాదరెడ్డి కబంధ హస్తాల నుంచి ఏయూకి విముక్తి
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విముక్తి కలిగింది. వర్సిటీలోని ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులకు స్వేచ్ఛ లభించింది.
పీవీజీడీ ప్రసాదరెడ్డి
ఈనాడు డిజిటల్ - విశాఖపట్నం, న్యూస్టుడే - ఏయూ ప్రాంగణం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విముక్తి కలిగింది. వర్సిటీలోని ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులకు స్వేచ్ఛ లభించింది. గత అయిదేళ్ల వైకాపా పాలనలో వీసీ ప్రసాదరెడ్డి ఇష్టారాజ్యంగా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో విశ్రాంత, సీనియర్ ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీసీ అక్రమాలపై ప్రశ్నిస్తే ప్రైవేటు సెక్యూరిటీ సహాయంతో నియంత్రించడంతోపాటు కేసులు పెడతామని బెదిరించేవారు. ప్రసాదరెడ్డి నిరంకుశ పాలన సాగించారని, ఆయనపై న్యాయ విచారణ చేపట్టాలని కొద్దిరోజులుగా వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలు, ఏయూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆయనను తొలగించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా.. ఎన్నికల్లో వైకాపా ఘోరంగా ఓడిపోవడంతో ఆ ఉద్యమం ఊపందుకుంది. ఎట్టకేలకు వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య జేమ్స్ స్టీఫెన్ శుక్రవారం రాజీనామా చేయడంతో ఏయూలో పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
95 ఏళ్ల కీర్తి.. అయిదేళ్లలో నాశనం..: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటై మరో రెండేళ్లలో వందేళ్లు పూర్తవుతాయి. దాదాపు 95 ఏళ్లపాటు విభిన్న సంస్కరణలు, పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెరుగైన విద్య అందించింది. ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో పూర్వ విద్యార్థులు దేశ, విదేశాల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. వర్సిటీ ఉప కులపతులుగా పనిచేసిన కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితరులు ఆ పదవికి వన్నె తెచ్చారు. ఏయూను ఉన్నత స్థానంలో నిలిపేందుకు తీవ్రంగా కృషి చేశారు. గతంలో పనిచేసిన వర్సిటీ అధికారులు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేవారు. కానీ వైకాపా హయాంలో ప్రసాదరెడ్డి వీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పదవి విలువ పోగొట్టే విధంగా ప్రవర్తించారనే విమర్శలున్నాయి. 95 ఏళ్లలో వర్సిటీ సంపాదించిన కీర్తి ప్రతిష్ఠలను అయిదేళ్లలో ఆయన సర్వనాశనం చేశారు. ఆయన చేసిన నష్టం పూడ్చేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి.
వీసీ, రిజిస్ట్రార్ దిగిపోవాలని నిరసనలు: ప్రసాదరెడ్డి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల సీనియర్ ఆచార్యులు, అతిథి అధ్యాపకులకు తీవ్ర నష్టం కలిగింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో తొలగించిన అతిథి అధ్యాపకులను విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రసాదరెడ్డి, స్టీఫెన్ అయిదేళ్లలో భ్రష్టు పట్టించారని, వారి అక్రమాలపై విచారణ జరపాలని ఏయూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 14 రోజులపాటు నిరసన తెలియజేశారు. వారిద్దరూ పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా చేయాలని నిరసన తెలిపిన ఘటనలు గతంలో ఎక్కడా చూసిన దాఖలాలు లేవు. ఏయూలో ప్రధాన పరిపాలన భవనం ఎదుటే ధర్నాకు దిగారంటే ఉద్యోగులు ఎంతగా విసిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు గురుశిష్యులిద్దరూ పదవుల నుంచి తప్పుకోవడంతో వారి సంతోషానికి అవధుల్లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు ఆన.. నెరవేరిన క్షణాన!!
[ 02-07-2024]
పింఛన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ప్రజాసంక్షేమంపై చిత్తశుద్ధిని చాటుకుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ తొలిరోజు జిల్లా వ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. -
వాళ్లు ఏడిపించారు..వీళ్లు ఏడువేలిచ్చారు!
[ 02-07-2024]
కూటమి సర్కారు ఏర్పడి నెలరోజులు గడవకుండానే తొలి సంక్షేమ ఫలం పేదల ఇంటికి చేరింది. అవ్వాతాతలకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే కాదు గత మూడు నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించి ఎన్నికల హామీని ఆచరణలో చూపారు చంద్రబాబు. -
జీవీఎంసీలో పరాయి అధికారుల పాగా..!
[ 02-07-2024]
గత వైకాపా ప్రభుత్వ పాలనలో మహా విశాఖ నగరపాలక సంస్థను పరాయి శాఖల అధికారులతో నింపేశారు. కీలకమైన పోస్టుల్లో మున్సిపల్శాఖకు సంబంధంలేని అధికారులను డిప్యుటేషన్పై తీసుకొచ్చి కూర్చోబెట్టారు. -
మాటల్లో కాదు...చేతల్లో చూపుతా..
[ 02-07-2024]
‘విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడి సమస్యలు నాకు తెలుసు. క్షేత్రస్థాయిలో అన్ని విభాగాల్లో పరిస్థితులను మెరుగుపరచటానికి ప్రయత్నిస్తా. -
అక్రమార్కుల బరితెగింపు
[ 02-07-2024]
ఏపీఐఐసీ రక్షణలో ఉండాల్సిన భూమి కబ్జాదారుల పాలయింది. పారిశ్రామిక అవసరాలకు సేకరించిన భూమి అక్రమార్కులపరమయింది. -
సింహగిరిపై వరద పాయసం ఉత్సవం రేపు
[ 02-07-2024]
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలన్న సంకల్పంతో సింహగిరి వైకుంఠవాసుల మెట్టపై బుధవారం వరద పాయసం ఉత్సవం నిర్వహించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
కేజీహెచ్లో ముగ్గురు సెక్యూరిటీ సూపర్వైజర్లకు స్థానచలనం
[ 02-07-2024]
కేజీహెచ్ భద్రతా విభాగంలో సూపర్వైజర్లుగా పనిచేస్తున్న శ్రీనివాస్, రామకృష్ణ, శ్రీకాంత్లను నగరంలోని ఈఎన్టీ, ఆర్ఈహెచ్, ఘోషాస్పత్రులకు బదిలీ చేశారు. -
వైకాపా నాయకుల చెరలో పేదల స్థలాలు
[ 02-07-2024]
గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు తమ భూములను ఆక్రమించారని పలువురు వాపోయారు. -
ఆర్టీసీకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్లు
[ 02-07-2024]
ఆర్టీసీకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్లులాంటి వారని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖమంత్రి మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి అన్నారు. -
వైకాపా హయాంలో సాగినట్లు ఇప్పుడు కుదరదు
[ 02-07-2024]
‘హోంశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటే తహసీల్దార్ కార్యక్రమానికి రాలేదు. ఎంపీడీఓ దూరంగా ఉండిపోయారు. -
1న జీతాలివ్వడం ఇదే తొలిసారి
[ 02-07-2024]
అంగన్వాడీ ఉద్యోగులకు ఒకటో తేదీన కూటమి ప్రభుత్వం వేతనాలు జమ చేయడం అభినందనీయమని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి నాగశేషు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
అమ్మో.. అంగన్వాడీ భవనం
[ 02-07-2024]
కొత్తకోట అరుంధతి కాలనీ (ఎస్సీ కాలనీ)లోని అంగన్వాడీ కేంద్రం-2 భవనం బీటలు వారి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. భవనంతోపాటు మరుగుదొడ్డి, ప్రహరీ గోడ రెండుగా చీలిపోయాయి. -
అర్జీదారుల సమస్యలకు సత్వర పరిష్కారం
[ 02-07-2024]
అర్జీదారుల సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు ఉత్సాహంగా అర్జీదారులు తరలివచ్చారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!
-
తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి ఏర్పాట్లు
-
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 27 మంది మృతి
-
నీట్పై 26 పిటిషన్లు.. జులై 8 నుంచి సుప్రీం కోర్టు విచారణ
-
హీనా ఖాన్ నువ్వు వారియర్వి.. నటికి ధైర్యాన్నిచ్చిన సమంత
-
అప్పుడే హెచ్చరికలు.. అంతలోనే బాంబుల మోత.. ఖాన్ యూనిస్లో విధ్వంసం