tragedy: బాలికల విషాద ‘ప్రేమలు’
నగరంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు బాలికలు చేసిన ఆత్మహత్యా ప్రయత్నంలో ఓ బాలిక మృతిచెందగా మరో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రేమ వ్యవహారాలే దీనికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
వేర్వేరు ఘటనల్లో ఒకరి ఆత్మహత్య, మరొకరికి చికిత్స
నగరంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు బాలికలు చేసిన ఆత్మహత్యా ప్రయత్నంలో ఓ బాలిక మృతిచెందగా మరో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రేమ వ్యవహారాలే దీనికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
పెళ్లికి అంగీకరించలేదని..
పెదవాల్తేరు, న్యూస్టుడే : ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని ఓ బాలిక చీమలమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎంవీపీ స్టేషన్ పరిధిలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ వెనుకాల ఓ నిర్మాణ భవనంలో ఓ వ్యక్తి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె (17) కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. 8వ తరగతి వరకు చదివి ప్రస్తుతం ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అతన్ని వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పింది. దీనికి వారు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై శనివారం ఉదయం చీమలమందు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. దీనిపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సి.ఐ. సంజీవరావు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బంధువుల ఆందోళన: ఈ బాలికకు సకాలంలో వైద్యం అందలేదంటూ కేజీహెచ్ వద్ద బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆదివారం వైద్యులు లేక తమ కుమార్తెకు సరైన సమయంలో వైద్యం అందలేదని ఆరోపించారు. సకాలంలో వైద్యం అంది ఉంటే బతికి ఉండేదని వాపోయారు.
దుకాణం నుంచి ఇంటికి వస్తూ..
గురుద్వారా, న్యూస్టుడే: ఎలుకల మందు తాగి బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ద్వారకా పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన బాలిక (17) తండ్రి మరణించడంతో తల్లితో కలిసి ఉంటోంది. బాలిక సీతంపేట సమీపంలోని ఓ మిఠాయి దుకాణంలో పని చేస్తోంది. శనివారం రాత్రి దుకాణం నుంచి ఇంటికి వస్తుండగా గురుద్వారా సమీపంలో ఎలుకల మందు తాగడంతో స్థానికులు వెంటనే కేజీహెచ్కు తరలించారు. ప్రాణాపాయం లేదన్నారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు ఆన.. నెరవేరిన క్షణాన!!
[ 02-07-2024]
పింఛన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ప్రజాసంక్షేమంపై చిత్తశుద్ధిని చాటుకుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ తొలిరోజు జిల్లా వ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. -
వాళ్లు ఏడిపించారు..వీళ్లు ఏడువేలిచ్చారు!
[ 02-07-2024]
కూటమి సర్కారు ఏర్పడి నెలరోజులు గడవకుండానే తొలి సంక్షేమ ఫలం పేదల ఇంటికి చేరింది. అవ్వాతాతలకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే కాదు గత మూడు నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించి ఎన్నికల హామీని ఆచరణలో చూపారు చంద్రబాబు. -
జీవీఎంసీలో పరాయి అధికారుల పాగా..!
[ 02-07-2024]
గత వైకాపా ప్రభుత్వ పాలనలో మహా విశాఖ నగరపాలక సంస్థను పరాయి శాఖల అధికారులతో నింపేశారు. కీలకమైన పోస్టుల్లో మున్సిపల్శాఖకు సంబంధంలేని అధికారులను డిప్యుటేషన్పై తీసుకొచ్చి కూర్చోబెట్టారు. -
మాటల్లో కాదు...చేతల్లో చూపుతా..
[ 02-07-2024]
‘విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడి సమస్యలు నాకు తెలుసు. క్షేత్రస్థాయిలో అన్ని విభాగాల్లో పరిస్థితులను మెరుగుపరచటానికి ప్రయత్నిస్తా. -
అక్రమార్కుల బరితెగింపు
[ 02-07-2024]
ఏపీఐఐసీ రక్షణలో ఉండాల్సిన భూమి కబ్జాదారుల పాలయింది. పారిశ్రామిక అవసరాలకు సేకరించిన భూమి అక్రమార్కులపరమయింది. -
సింహగిరిపై వరద పాయసం ఉత్సవం రేపు
[ 02-07-2024]
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలన్న సంకల్పంతో సింహగిరి వైకుంఠవాసుల మెట్టపై బుధవారం వరద పాయసం ఉత్సవం నిర్వహించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
కేజీహెచ్లో ముగ్గురు సెక్యూరిటీ సూపర్వైజర్లకు స్థానచలనం
[ 02-07-2024]
కేజీహెచ్ భద్రతా విభాగంలో సూపర్వైజర్లుగా పనిచేస్తున్న శ్రీనివాస్, రామకృష్ణ, శ్రీకాంత్లను నగరంలోని ఈఎన్టీ, ఆర్ఈహెచ్, ఘోషాస్పత్రులకు బదిలీ చేశారు. -
వైకాపా నాయకుల చెరలో పేదల స్థలాలు
[ 02-07-2024]
గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు తమ భూములను ఆక్రమించారని పలువురు వాపోయారు. -
ఆర్టీసీకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్లు
[ 02-07-2024]
ఆర్టీసీకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్లులాంటి వారని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖమంత్రి మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి అన్నారు. -
వైకాపా హయాంలో సాగినట్లు ఇప్పుడు కుదరదు
[ 02-07-2024]
‘హోంశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటే తహసీల్దార్ కార్యక్రమానికి రాలేదు. ఎంపీడీఓ దూరంగా ఉండిపోయారు. -
1న జీతాలివ్వడం ఇదే తొలిసారి
[ 02-07-2024]
అంగన్వాడీ ఉద్యోగులకు ఒకటో తేదీన కూటమి ప్రభుత్వం వేతనాలు జమ చేయడం అభినందనీయమని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి నాగశేషు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
అమ్మో.. అంగన్వాడీ భవనం
[ 02-07-2024]
కొత్తకోట అరుంధతి కాలనీ (ఎస్సీ కాలనీ)లోని అంగన్వాడీ కేంద్రం-2 భవనం బీటలు వారి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. భవనంతోపాటు మరుగుదొడ్డి, ప్రహరీ గోడ రెండుగా చీలిపోయాయి. -
అర్జీదారుల సమస్యలకు సత్వర పరిష్కారం
[ 02-07-2024]
అర్జీదారుల సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు ఉత్సాహంగా అర్జీదారులు తరలివచ్చారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ: మంత్రి శ్రీధర్బాబు
-
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు