వైద్య విద్యార్థినికి 12 స్వర్ణ పతకాలు
తిరునెల్వేలి ప్రభుత్వ వైద్యకళాశాల స్నాతకోత్సవంలో ఓ విద్యార్థిని 12 స్వర్ణ పతకాలు అందుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
పతకాలు అందుకున్న విద్యార్థిని ఆర్తి శక్తిబాలతో తల్లిదండ్రులు
టీనగర్, న్యూస్టుడే: తిరునెల్వేలి ప్రభుత్వ వైద్యకళాశాల స్నాతకోత్సవంలో ఓ విద్యార్థిని 12 స్వర్ణ పతకాలు అందుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తిరునెల్వేలి జిల్లా మహరాజా నగర్కు చెందిన ఆర్తి శక్తిబాల 2018వ బ్యాచ్లో చేరి కళాశాల నుంచి వైద్య విద్య అభ్యసిస్తున్నారు. కళాశాలలో ఉత్తమ విద్యార్థినిగా పేరు తెచ్చుకున్న ఆమె అన్ని పాఠ్యాంశాల్లో ప్రతిభ చాటేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం కళాశాలలో స్నాతకోత్సవం జరుగగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అప్పావు పాల్గొని డిగ్రీ పట్టాలు అందజేశారు. ఆర్తి శక్తిబాల అనాటమీ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయోలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్ వంటి వివిధ పాఠ్యాంశాల్లో ప్రథమ ర్యాంకు సాధించి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. అలాగే ఉత్తమ విద్యార్థిని అవార్డుతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి పతకాలు అందుకున్నారు. ఒకే కార్యక్రమంలో ఓ విద్యార్థిని 12 అవార్డులు అందుకోవడం చూసి కార్యక్రమానికి వచ్చినవారు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథి అప్పావు కూడా ఆమెను అభినందించారు.
వైరల్గా మారిన మటన్ కీమా కేక్
కేక్ తయారీలో విధుసింగ్
వడపళని, న్యూస్టుడే: మదురైకి చెందిన మహిళ తయారు చేసిన ‘మటన్ కీమా కేక్’ బిజారే రిసిప్ వీడియోలో వైరల్గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 3 మిలియన్ల మంది వీక్షించారు. మహిళ విధుసింగ్ ఇన్స్టాగ్రామ్ బయోలో తానొక ‘కేక్ ఆర్టిస్ట్’, ‘పాసనేట్ బేకర్’ అని పరిచయం చేసుకుంటూ ‘మటన్ కీమా కేక్’ను తాజాగా వీడియోలో ప్రదర్శించింది. స్పాంజి కేక్పై క్రీమ్తో అందంగా అలంకరించి మిరప, కరివేపాకుతో తయారు చేసింది. మటన్ కూర చేసి, నాలుగు పొరలుగా చేసిన తర్వాత రెండింటిని మాత్రమే ట్రయల్గా వాడినట్లు పేర్కొంది. తర్వాత చికెన్తో కేక్ చేయాలనుకుంటున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాటేస్తున్న కాలుష్యం
[ 06-07-2024]
శ్వాస సరిగా ఆడదు.. బయటికి రావాలంటే ఇబ్బంది.. ఇంట్లో ఉన్నా ఇదే పరిస్థితి. చెన్నైలో గాలి కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎంతోమంది అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కొత్త చట్టాలు ఉపసంహరించుకోవాలి
[ 06-07-2024]
కొత్త చట్టాలకు వ్యతిరేకంగా డీఎంకే న్యాయవాదుల విభాగం లాయర్లు శుక్రవారం ఆందోళన చేపట్టారు. డీఎంకే రాజ్యసభ ఎంపీ, సీనియర్ లాయర్ ఎన్ఆర్ ఇళంగో నేతృత్వంలో జరిగింది. -
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య
[ 06-07-2024]
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణహత్యకు గురయ్యారు. చెన్నై పెరంబూర్లో నివాసం ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలుచుని ఉన్నారు. -
ఈపీఎస్ నమ్మకద్రోహి
[ 06-07-2024]
ఎడప్పాడి పళనిసామి నమ్మకద్రోహి అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. -
మూత్ర విసర్జన చేశాడని రోగిని బయటకు పంపిన సిబ్బంది
[ 06-07-2024]
మూత్ర విసర్జన చేశాడని ఓ రోగిని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది బయటకు పంపిన అమానవీయ ఘటన మదురైలో చోటుచేసుకుంది. -
సృజనాత్మక సామాజిక మాధ్యమ సృష్టికర్తలు
[ 06-07-2024]
ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలతో సమయం వృథా చేసుకోవడమే కాదు.. ప్రయోజనకర విషయాలూ తెలుసుకోవచ్చు అంటున్నారు ఈ యువ క్రియేటర్లు. -
సినీనటుడు ఎస్వీ శేఖర్కు పురస్కారం
[ 06-07-2024]
ప్రముఖ తమిళ రంగస్థల నటుడు, సినీ నటుడు ఎస్వీ శేఖర్కు ‘ఇయక్కునగర్ శిఖరం కె.బాలచందర్’ పురస్కారం లభించింది. -
యువకుడిపై దాడిచేసి ప్రాణాలతో పాతిపెట్టిన బాలురు
[ 06-07-2024]
తూత్తుక్కుడి జిల్లా మేట్టుప్పట్టికి చెందిన కళంజియం కుమారుడు మారిసెల్వం (24) జాలరి. ఇతను గత నెల 21న అదృశ్యమయ్యాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు.