చైనా రకం కూరగాయలు చెన్నైలో విక్రయం
నీలగిరి జిల్లాలో పండుతున్న చైనా రకానికి చెందిన కూరగాయలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి చెన్నైలో తక్కువ ధరకు విక్రయించాలని సహకారశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.
విల్లివాక్కం, న్యూస్టుడే: నీలగిరి జిల్లాలో పండుతున్న చైనా రకానికి చెందిన కూరగాయలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి చెన్నైలో తక్కువ ధరకు విక్రయించాలని సహకారశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నైలోని ట్రిప్లికేన్ నగర సహకార సంఘం, కాంచీపురం జిల్లా సహకార పండగసాలై సహా నాలుగు సహకార సంఘాలు ‘హరిత ఫాం’ పేరిట కూరగాయల దుకాణాలు నిర్వహిస్తున్నాయి. నీలగిరి జిల్లాలో కోత్తగిరి, కుందా, ఊటీ, కున్నూర్ తదితర ప్రాంతాల్లోని రైతులు పురోగోలి, సుక్కుని, ఐస్బెర్గ్, వెట్యూస్, బ్రస్సల్స్, సెలరి, పార్సెలి తదితర చైనా రకాల కూరగాయలను, క్యాబేజి, క్యారెట్, బంగాళా దుంపలు తదితరాలను పండిస్తున్నారు. వాటిని నీలగిరి సహకార విక్రయ సంఘం కింద పని చేస్తున్న కొండ కూరగాయల కేంద్రానికి తీసుకొచ్చి వేలం ద్వారా విక్రయిస్తున్నారు. చెన్నై, శివారు ప్రాంతాల్లో చైనారకం కూరగాయలు అమ్మకాలు అధికంగా ఉంటాయి. సహకార శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. చైనా రకం కూరగాయలను ఫాస్ట్ఫుడ్, సూప్లలో ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. నీలగిరి రైతుల నుంచి కొనుగోలు చేసి చెన్నైలోని ‘హరిత ఫాం’లలో విక్రయించడానికి చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. తద్వారా రైతలకు ఆదాయం అందడంతో బాటు తక్కువ ధరకు కూరగాయలు లభ్యమవుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య
[ 06-07-2024]
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణహత్యకు గురయ్యారు. చెన్నై పెరంబూర్లో నివాసం ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలుచుని ఉన్నారు. -
ఈపీఎస్ నమ్మకద్రోహి
[ 06-07-2024]
ఎడప్పాడి పళనిసామి నమ్మకద్రోహి అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. -
మూత్ర విసర్జన చేశాడని రోగిని బయటకు పంపిన సిబ్బంది
[ 06-07-2024]
మూత్ర విసర్జన చేశాడని ఓ రోగిని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది బయటకు పంపిన అమానవీయ ఘటన మదురైలో చోటుచేసుకుంది. -
సృజనాత్మక సామాజిక మాధ్యమ సృష్టికర్తలు
[ 06-07-2024]
ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలతో సమయం వృథా చేసుకోవడమే కాదు.. ప్రయోజనకర విషయాలూ తెలుసుకోవచ్చు అంటున్నారు ఈ యువ క్రియేటర్లు. -
సినీనటుడు ఎస్వీ శేఖర్కు పురస్కారం
[ 06-07-2024]
ప్రముఖ తమిళ రంగస్థల నటుడు, సినీ నటుడు ఎస్వీ శేఖర్కు ‘ఇయక్కునగర్ శిఖరం కె.బాలచందర్’ పురస్కారం లభించింది. -
యువకుడిపై దాడిచేసి ప్రాణాలతో పాతిపెట్టిన బాలురు
[ 06-07-2024]
తూత్తుక్కుడి జిల్లా మేట్టుప్పట్టికి చెందిన కళంజియం కుమారుడు మారిసెల్వం (24) జాలరి. ఇతను గత నెల 21న అదృశ్యమయ్యాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/07/24)
-
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
-
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
-
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!