logo

కొత్త ఇంట్లోకి నయనతార దంపతులు

దర్శకుడు విఘ్నేశ్‌ శివన్, ఆయన సతీమణి, నటి నయనతార దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఎగ్మూర్‌లోని ఓ బహుళంతస్తుల భవనంలో ఉంటున్నారు.

Updated : 04 Jul 2024 10:07 IST

నయనతార పోస్టు చేసిన ఫొటో

చెన్నై, న్యూస్‌టుడే: దర్శకుడు విఘ్నేశ్‌ శివన్, ఆయన సతీమణి, నటి నయనతార దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఎగ్మూర్‌లోని ఓ బహుళంతస్తుల భవనంలో ఉంటున్నారు. రజనీకాంత్‌ తదితర ప్రముఖులు నివసించే పోయెస్‌గార్డెన్‌లో ఈ దంపతులు స్థలం కొనుగోలు చేసి గతంలో ఇంటి నిర్మాణ పనులు కూడా చేపట్టారు. ప్రస్తుతం పనులు పూర్తయిన నేపథ్యంలో కొత్త ఇంట్లోకి నయనతార కుటుంబం అడుగుపెట్టింది. ఇంట్లో, ఇంటి ఎదుట తీసుకున్న ఫొటోలను నయనతార తన సామాజిక మాధ్యమాల పేజీలో విడుదల చేశారు.


సదా మిమ్మల్ని ప్రేమిస్తున్నా: షాలిని

షాలినితో అజిత్‌

చెన్నై, న్యూస్‌టుడే: అగ్ర నటుడు అజిత్‌కుమార్‌ భార్య, నటి షాలిని అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ‘విడాముయర్చి’ చిత్రీకరణకు బ్రేక్‌ ఇచ్చి చెన్నై చేరుకున్న అజిత్‌కుమార్‌ సతీమణిని శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షాలిని తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పంచుకున్నారు. ‘సదా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’ అంటూ వ్యాఖ్య జోడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని