logo

స్నాతకోత్సవానికి మంత్రి గైర్హాజరు

అన్నా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి గైర్హాజరయ్యారు.

Published : 03 Jul 2024 00:35 IST

పట్టా ప్రదానం చేస్తున్న గవర్నర్‌

చెన్నై, న్యూస్‌టుడే: అన్నా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి గైర్హాజరయ్యారు. 44వ స్నాతకోత్సవం మంగళవారం వర్సిటీ ప్రాంగణంలోని వివేకానంద ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి హాజరై విద్యార్థులకు పట్టాలు, పతకాలు ప్రదానం చేశారు. ఏఐసీటీఈ ఛైర్మన్‌ టీజీ సీతారామ్‌ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి గైర్హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు కొనసాగడమే అందుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని