పాఠశాలలో కుల ఘర్షణ
తిరునెల్వేలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. నాంగునేరి వద్ద మూండ్రడైప్పు సమీప మరుదకుళం గ్రామంలో ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఉంది.
ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టీనగర్, న్యూస్టుడే: తిరునెల్వేలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. నాంగునేరి వద్ద మూండ్రడైప్పు సమీప మరుదకుళం గ్రామంలో ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఉంది. అందులోని 10, 11, 12 తరగతి విద్యార్థుల మధ్య సోమవారం ఘర్షణలు జరిగాయి. ఇద్దరు గాయపడగా చికిత్స నిమిత్తం తిరునెల్వేలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ విషయమై బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో నిత్యం కుల ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని, అమాయక విద్యార్థులే అధికంగా గాయపడుతున్నారని ఆరోపించారు. పాఠశాల నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి: హైకోర్టు
ప్యారిస్, న్యూస్టుడే: తూత్తుక్కుడి తుపాకీ కాల్పుల ఘటనలో సంబంధం ఉన్న అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని మద్రాసు హైకోర్టు తెలిపింది. కాల్పుల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు తీసుకుని విచారణ పూర్తి చేసింది. ఇందుకు వ్యతిరేకంగా మానవ హక్కుల కార్యకర్త, లాయర్ హెన్రి దిబేన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది జస్టిస్ ఎస్ఎస్ సుందర్, జస్టిస్ సెంథిల్కుమార్ ధర్మాసనంలో సోమవారం మళ్లీ విచారణకు వచ్చింది. ప్రతివాదిగా చేర్చిన తూత్తుక్కుడి డీఎస్పీ లింగతిరుమారన్ తరఫున.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జస్టిస్ అరుణా జగదీశన్ కమిషన్ విచారించిన ఈ కేసును మళ్లీ విచారించడం కుదరదని వాదించారు. అనంతరం పిటిషనర్ తరఫున .. మానవ హక్కుల కమిషన్ చట్ట ప్రకారం జారీచేసే ఉత్తర్వులను పునఃపరిశీలించవచ్చని, కాల్పుల ఘటనపై మళ్లీ విచారించేందుకు ఎలాంటి అడ్డులేదని వాదనలు వినిపించారు. సీబీఐ తరఫున... ఈ ఘటనపై విచారణ కోర్టులో అదనపు తుది అభియోగపత్రం దాఖలు చేసినట్లు తెలిపారు. కేసును సీబీఐ ప్రత్యేక కోర్టు విచారిస్తున్న స్థితిలో కేసు దాఖలు చేయడానికి పిటిషనర్కు ఎలాంటి అధికారం లేదని ఆక్షేపణ తెలిపారు. అప్పుడు జోక్యం చేసుకున్న న్యాయమూర్తులు స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన అమాయక ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. ఏ అధికారి కూడా ఇంతవరకు పశ్చాత్తాపం తెలపలేదన్నారు. తుపాకీ కాల్పుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై హత్యకేసు నమోదు చేయాలన్నారు. కాల్పులు జరపాలని ఉత్తర్వులు ఇచ్చిందెవరు? ఇన్ని ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యత వహించేది ఎవరని ప్రశ్నించారు. తదుపరి విచారణ జులై 15కి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాటేస్తున్న కాలుష్యం
[ 06-07-2024]
శ్వాస సరిగా ఆడదు.. బయటికి రావాలంటే ఇబ్బంది.. ఇంట్లో ఉన్నా ఇదే పరిస్థితి. చెన్నైలో గాలి కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎంతోమంది అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కొత్త చట్టాలు ఉపసంహరించుకోవాలి
[ 06-07-2024]
కొత్త చట్టాలకు వ్యతిరేకంగా డీఎంకే న్యాయవాదుల విభాగం లాయర్లు శుక్రవారం ఆందోళన చేపట్టారు. డీఎంకే రాజ్యసభ ఎంపీ, సీనియర్ లాయర్ ఎన్ఆర్ ఇళంగో నేతృత్వంలో జరిగింది. -
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య
[ 06-07-2024]
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణహత్యకు గురయ్యారు. చెన్నై పెరంబూర్లో నివాసం ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలుచుని ఉన్నారు. -
ఈపీఎస్ నమ్మకద్రోహి
[ 06-07-2024]
ఎడప్పాడి పళనిసామి నమ్మకద్రోహి అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. -
మూత్ర విసర్జన చేశాడని రోగిని బయటకు పంపిన సిబ్బంది
[ 06-07-2024]
మూత్ర విసర్జన చేశాడని ఓ రోగిని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది బయటకు పంపిన అమానవీయ ఘటన మదురైలో చోటుచేసుకుంది. -
సృజనాత్మక సామాజిక మాధ్యమ సృష్టికర్తలు
[ 06-07-2024]
ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలతో సమయం వృథా చేసుకోవడమే కాదు.. ప్రయోజనకర విషయాలూ తెలుసుకోవచ్చు అంటున్నారు ఈ యువ క్రియేటర్లు. -
సినీనటుడు ఎస్వీ శేఖర్కు పురస్కారం
[ 06-07-2024]
ప్రముఖ తమిళ రంగస్థల నటుడు, సినీ నటుడు ఎస్వీ శేఖర్కు ‘ఇయక్కునగర్ శిఖరం కె.బాలచందర్’ పురస్కారం లభించింది. -
యువకుడిపై దాడిచేసి ప్రాణాలతో పాతిపెట్టిన బాలురు
[ 06-07-2024]
తూత్తుక్కుడి జిల్లా మేట్టుప్పట్టికి చెందిన కళంజియం కుమారుడు మారిసెల్వం (24) జాలరి. ఇతను గత నెల 21న అదృశ్యమయ్యాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు.