డీఎంకే ఎన్నికల కార్యాలయంలో టీ, బజ్జీ ఉచితం
విక్రవాండి నియోజకవర్గ ఉప ఎన్నిక 10న జరగనుండటంతో ప్రచారం జోరుగా సాగుతోంది. డీఎంకే తరఫున అన్నియూర్ శివ, ఎన్డీఏ కూటమిలో పీఎంకే నుంచి సి.అన్బుమణి, ఎన్టీకే తరఫున డాక్టర్ అభినయ సహా 29 మంది బరిలో ఉన్నారు.
విక్రవాండిలో జోరుగా పార్టీల ప్రచారం
అన్బుమణి రామదాసు
వేళచ్చేరి, న్యూస్టుడే: విక్రవాండి నియోజకవర్గ ఉప ఎన్నిక 10న జరగనుండటంతో ప్రచారం జోరుగా సాగుతోంది. డీఎంకే తరఫున అన్నియూర్ శివ, ఎన్డీఏ కూటమిలో పీఎంకే నుంచి సి.అన్బుమణి, ఎన్టీకే తరఫున డాక్టర్ అభినయ సహా 29 మంది బరిలో ఉన్నారు. గెలుపు కోసం డీఎంకే ప్రత్యేకంగా ఎన్నికల వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు, సెంజి మస్తాన్తో పాటు 25 మంది మంత్రులు, ఎమ్మెల్యేలను నియమించారు. గత శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో ఆదివారం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు విక్రవాండిలో మకాం వేసి ఓటర్లను కలుస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన, అమలు చేస్తున్న పథకాలు ప్రస్తావిస్తూ ఓట్లు కోరుతున్నారు. డీఎంకే తరఫున ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడికి వెళ్లేవారికి ఉచితంగా టీ, బజ్జీలు, వడలు ఉచితంగా అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు అక్కడికొచ్చి సమస్యలు తెలిపితే వెంటనే పరిష్కరిస్తుండటంతో కార్యాలయం ప్రజలతో రద్దీగా ఉంటోంది.
ప్రచారంలో భాగంగా పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాసు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అదే సమయంలో పీఎంకే తరఫున రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు గ్రామాల్లో మకాం వేసి డీఎంకే ప్రచారాలపై అన్బుమణికి సమాచారం ఇస్తున్నారు. కల్తీ సారా మరణాలు, నకిలీ మద్యం తదితర అంశాలను ప్రస్తావిస్తూ మహిళల ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. సౌమ్య అన్బుమణి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఎన్టీకే కో-ఆర్డినేటర్ సీమాన్ గ్రామ గ్రామానికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాటేస్తున్న కాలుష్యం
[ 06-07-2024]
శ్వాస సరిగా ఆడదు.. బయటికి రావాలంటే ఇబ్బంది.. ఇంట్లో ఉన్నా ఇదే పరిస్థితి. చెన్నైలో గాలి కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎంతోమంది అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కొత్త చట్టాలు ఉపసంహరించుకోవాలి
[ 06-07-2024]
కొత్త చట్టాలకు వ్యతిరేకంగా డీఎంకే న్యాయవాదుల విభాగం లాయర్లు శుక్రవారం ఆందోళన చేపట్టారు. డీఎంకే రాజ్యసభ ఎంపీ, సీనియర్ లాయర్ ఎన్ఆర్ ఇళంగో నేతృత్వంలో జరిగింది. -
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య
[ 06-07-2024]
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణహత్యకు గురయ్యారు. చెన్నై పెరంబూర్లో నివాసం ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలుచుని ఉన్నారు. -
ఈపీఎస్ నమ్మకద్రోహి
[ 06-07-2024]
ఎడప్పాడి పళనిసామి నమ్మకద్రోహి అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. -
మూత్ర విసర్జన చేశాడని రోగిని బయటకు పంపిన సిబ్బంది
[ 06-07-2024]
మూత్ర విసర్జన చేశాడని ఓ రోగిని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది బయటకు పంపిన అమానవీయ ఘటన మదురైలో చోటుచేసుకుంది. -
సృజనాత్మక సామాజిక మాధ్యమ సృష్టికర్తలు
[ 06-07-2024]
ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలతో సమయం వృథా చేసుకోవడమే కాదు.. ప్రయోజనకర విషయాలూ తెలుసుకోవచ్చు అంటున్నారు ఈ యువ క్రియేటర్లు. -
సినీనటుడు ఎస్వీ శేఖర్కు పురస్కారం
[ 06-07-2024]
ప్రముఖ తమిళ రంగస్థల నటుడు, సినీ నటుడు ఎస్వీ శేఖర్కు ‘ఇయక్కునగర్ శిఖరం కె.బాలచందర్’ పురస్కారం లభించింది. -
యువకుడిపై దాడిచేసి ప్రాణాలతో పాతిపెట్టిన బాలురు
[ 06-07-2024]
తూత్తుక్కుడి జిల్లా మేట్టుప్పట్టికి చెందిన కళంజియం కుమారుడు మారిసెల్వం (24) జాలరి. ఇతను గత నెల 21న అదృశ్యమయ్యాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/07/24)
-
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
-
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
-
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!